తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయము. VIII.

తీథ౯ములు.

ఈ పర్వతమున 360 తీర్థములుగలవనియు అందులో కొన్ని అంతర్థానమనియు, కొన్ని మిగుల కష్టసాధ్యమనియు చెప్పెదరు. యాత్రికులకు సులభ సాధ్యములగు తీర్థములు కొన్ని గలవు.

1.శ్రీస్వామిపుష్కరిణి.

ఈ తీరమునుగురించి అనేక పురాణములు బహు తెరంగుల వర్ణించినవి. ఏ పురాణములో జూచిననీతీర్థ మహాత్మ్య

మద్బుతముగా చెప్పబడినది. గ్రంధబాహళ్యమగునని స్వల్పము నిందు చెప్పబడినది.

శ్రీస్వామి పుష్కరిణి గంగాది మొదలగు సర్వతీర్ధములకు జన్మభూమనియు, పంచమహపాతకములు పోగొట్టినదియు, స్నానమాత్రమున నై హికాముష్మికములు నిచ్చునదియునుగ వైకల్య దోషములను బోగొట్టునదియు, వైకంఠముునుండీ మహావిష్ణు అమవార్లసహా క్రీడార్ధం శ్రీస్వామిపుష్కరిణి తీర్ధమునకువచ్చి నారనియు మొదలగు మహిమవర్ణింపబడినది.

శ్లో. స్వామి పుష్కరిణీ పుణ్యా సర్వపాపప్రణాశిని|
వైకుంఠె భగవత్క్రిడా వాపశ్రీ భూమిలా||

 

శ్లో. అపాకృతజకాఘచనుగన్ధా సుమనోహరా|
గజ్ఞాదిసర్వతీర్ధానాం జన్మభూమి శ్శుభోదకా||

 

శ్లో. ఆనీతా నైనతేయేన క్రీడార్ధం తత్ర తిష్టతి|
విరఃకొవడ్రజోదోష ప్రముఖాఘవినాశిని||

వరాహపురాణం

ఈ తీర్థములో మధ్యగనొక చక్కని రాతిమంటపము గలద.అందు దశావతారములు శిలలోబాగాశిల్పము దయబడినవి. ఈమంటపము నాలుగు వత్సరముల క్రిందట జీర్ణోధారము జేయబడినది.

ఈ తీర్షము శ్రీవారి దేవస్థానమునకుత్తరభాగమున ప్రాకారమునకు మూడుగజములదూరమున నున్నది. యాత్రి కులందఱు నిండు స్నానము చేసి శ్రీవారి దర్శనముగావించెదరు.

ధనుర్మాసములో శుక్లపక్షద్వాదశి అరుణోదయము ఈ తీర్థమునకు ముక్కోటి. శ్రీవారి దేనస్థానంనుండి చక్రతాళ్వార్ వేంచేసి స్నానముగావించెదరు. అప్పుడు విశేషముగ జనముండి చక్రతాళ్వార్తోగూడా స్నానమొనర్చెదను.ఈ సమయమున సర్వతీర్థములందుండుననియు దేవతలందరచ్చట స్నానముచేసెదరని చెప్పెదరు.

శో.ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే|
ఆయా న్తి సర్వతీర్ధాని స్వామిపుష్కరిణీజ లే||

శ్లో.తత్ర స్నాత్వా సరస్సద్యోము క్తిమేతి న సంశయః|
యస్య జన్మసహస్రేషు పుణ్యమేవార్జితం పురా||

శ్లో.తస్యాస్నా నంభ వేద్వి ప్రానాన్యస్యత్వ కృతాత్మా నః|
విభవాసుగుణందానం కార్యం తత్ర యథావిధి||

శో.సాలగ్రామశిలాదానం గాం దద్యాచ్చవి శేషతః|
యే శృణ్వన్తి వ కథాం విష్ణో స్సదాభువనసానసమ్||

స్కన్దపురాణము.

శ్రీవైకుంఠ తీర్థము.

శ్రీ స్వామి పుష్కరిణికి ఈశాన్య భాగమున రెండు మైళ్ల దురమున నొక గుహగలదు. దీని పేరు వైకుంఠ గుహ యని వాడెదరు. ఈగుహలోనుండి తీర్థము సదానచ్చుచుండును దీనిని వైకుంఠ తీర్థమనెదరు. శ్రీరాములవారు పంపానదీ దాటి వానర సైన్యముతో లంకకుఁ బోవుచున్నప్పుడు శ్రీ స్వామి పుష్కరిణి తీరమున నిల్చిరి. వానర బలపరాక్రమ శాలురైన గజ గవాక్ష గవయస్సర భగంధమాధ నాదులు, సింహతుల్య పరాక్రమశాలురు ఆగుహ ప్రవేశించిరి. కోటిసూర్య ప్రకాశ మానమైన నొక తేజస్సును, ఒక పట్టణమును జూచిరి.



శ్లో.

తత్ర కాచిత్పురీ రమ్యా తప్తహాటక నిర్మితా।
కవాటతోరణవతీ రమ్యోద్యావశతైర్యుతా॥


శ్లో.

స్ఫటీకోపలవచ్చుద్ధజలనద్యా సమావృతా।
రత్న మాణిక్య వైడూర్యముక్తా నిర్మిత గోపురా॥


శ్లో.

అనేక మంణ్డ వైర్యుక్తా ప్రాసాశత సంకులా।
మహావీధి శతోపేతా రథమాతంగ సంయుతా॥


శ్లో.

వరనారీగణోపేతా సర్వమంగళశోభితా।
శంఖచక్రధరాస్తత్ర సర్వేచైవ చతుర్భుజాః॥


శ్లో.

సశుక్ల మాల్యవసనాస్సర్వాభరణభూషితాః ।
దివ్యచందనాలిప్తాంగాః పరమానందాపూరితాః॥


శ్లో.

తన్మధ్యేసుమహద్దివ్యవిమానం సూర్యసన్నిభం।
అత్యున్నతమహామేరుశృంగతుల్యం మనోహరం॥


శ్లో.

బహుప్రకాశసంపన్నం మణిమండపసంయుతం।
భేరీమృదంగపణవమర్దలధ్వనిశోభితం॥


శ్లో.

నృక్తువాదిత్రసంపన్నం కిన్నరస్వనసంయుతం।
దదృశుస్తత్ర పురుషం పూర్ణచంద్రనిభాననం॥


శ్లో.

చతుర్బాహుముదారాంగం శంఖచక్రధరంపరం।
పీతాంబరధరం సౌమ్యమాసీనం కాంచనాసనే॥


శ్లో.

ఫణామణిమహాకాంతి విరాజితకిరీటినం।
భోగిభోగేసమాసీనం సర్వాభరణభూషితం॥


శ్లో.

అసనోపరివిన్య స్తవామే తరకరంభుజం।
ప్రసార్యదక్షిణంపాదము ద్ధృ తేవామజాను॥

90

తిరుమల తిరుపతియాత్ర.

శ్లో.ప్రసార్య వామహస్తాబ్జం శ్రీభూమిభ్యాం నీషేవితం|
   సేవింగీశయా దేన్యవైజయంత్యావిరాజితం||

శ్లో.శ్రీవత్సకౌస్తుభోరస్కం వనమాలావిభూషితం|
   కృపారసతరంగౌఘ పూర్ణ నేత్రాంభుజద్వయం||

శ్లో.శశి ప్రభాసమచ్ఛుత్రం చానురవ్యజనేశుభే|
   హస్తాభ్యాం ధారయంతీ భిర్నారిభిస్సేవితం ముదా||

వరాహపురాణము.

ఈ ప్రకారము చూచుచుండగా చతుర్బాహువులు గల యొక పురుషుడుకట్టెతో కొట్ట వచ్చినట్టు కనపడ వారలందరు భయపడి గుహబయటికి పారివచ్చి యిదంతయు తన మిత్రులకు దెల్సి మహామాయి కామరూపీ మొదలగు వానర సముదాయ మంతయు బయలు దేరి వెళ్లి గుహయందంతయు పరిశీలించి అదేమియు గానక తిరిగి వచ్చిరి. ఈగుహ చొచ్చుట మునులకు యోగులకు కష్ట సాధ్యము. శ్రీమన్నారాయణ లీలావిలాసము చేత ఈవానర శ్రేష్టులకు శ్రీమహావిష్ణువుండు లోకము దర్శనమాయెను. కలియుగములో జనుల నుద్ధరించుటకు గాను శ్రీమన్నారాయణుడు ఈగుహలో ఈమాదిరిగా నుండును. ఈ ప్రభావము వినినంత మాత్రముననే కలికాలములో జనులకు దోషములు పోయి సమస్త సుఖంబులు బడయుదురు, ఈగుహలో నుండి వచ్చెడి తీర్థము సాక్షాత్ వైకుంఠములో నుండి వచ్చుచున్నందున నిండలి స్నాన ఫలము చెప్పనలవిగాదు.

3.పాండవ తీర్థము.

శ్రీ స్వామివారి దేవస్థానమునకు వాయవ్య మూలలో నుమారుమైలు దూరమున నొకతీర్థము గలదు. అది శ్రీక్షేత్ర

తిరుమల తిరుపతి యాత్ర

91

పొలకులచే కాపాడబడుచున్నది.ఇచ్చట ఒక్కసంవత్సరము నివసించి ఆతీర్ధము స్నాన సముల ఉపయోగించుచుండి అంతటా దక్కము క్షిణించును పుణ్యము సమకూరును. ఇదే మాదిరి పాండవులీతీర్ధముదొక సంవత్సరము నివసించి ఒక దుఃస్వప్నము గాంచిరి.అనంతరము యుద్ధములో జయించి రాజ్యమును సంపాదించిరి .ఇందు స్నానము చేసిన కారణమున జనులు దుఃఖ బాహ్యులై సుఖము బడియుదురు.

శ్లో.వృషభాస్థేరవౌ రాడేదేవదాస్యా    
శుక్లే వాప్యశవా కృష్ణ పక్షే భౌనుమన్వితే||

శ్లో.తథేపాండవనా మ్యాత్రణజ్ఞనేన్నతి యోనర|
నేహాదుఃఖ మవాప్నోతి పఠ త్నసుఖమస్నుతే ||

4.జాబాలితీర్ధము

శ్రీ స్వామి పుష్కరిణికి ఉత్తర భాగమునకు ఐదుమైళ్ళ దూరములో జాబాలి తీర్థముగలదు. ఇచ్చట జావలి ఋషి యొక్క ఆశ్రమముండెను.కొంత కాలమైన తర్వాత తిరిగిరాగల నుద్దేశ్యముతో ఒక్కొక్కరే ఆశ్రమమును వదిలివెళ్లిరి.

అగస్త్యులు వారిచ్చట ననేక యుగములలో భక్తులు రాజులుతోఁ గలిసి శ్రీవారిని గురించి అద్భుతముగా పూజాదులు జరుపు చుండిరి. ఈతీర్ధములో స్నానము చేసినంతట పంచమాహా పాతకము సహా పోవుటయే గాక పిశాచములు వదలును. ప్రాయశ్చిత్తము లేనీ దోషములు గూడచును.

92

తిరుమల తిరుపతియాత్ర.

కావేరీ నదీతీరమున దురాచోరుడను నొక బాహడుండెను. ఎల్లప్పుడు కౄరకర్మయేగాని సుకృత్యము లెన్నడు చేసిన వాడు కాడు. పంచమహా పాతకములు సదా చేయువాడు.ఈ దుష్కర్మవల్ల నొక బ్రహ్మ రక్షసి అతనికి పట్టియనే దేశములు త్రిప్పెను. పూర్వపుణ్యఫలము వలన నీదూరాచారుడు పిశాచ వీడితుడయ్యు నీవేంకటాద్రికివచ్చి యీతీర్థములో స్నానము చేసేను.వెంటనె తన దుష్కర , మంతయు పోయి పిశాచము తోలగుటయే గాక దానికిన్ని విముక్తిగలిగేను. పిశాచము తొలగినందు వలన తెలివిగలిగి చెంతనున్న జాబాలి ఋషి వద్దకు బోయి "నేను కావేరి తీరముననుండి దుష్కరముచేయుచు దురాచారుడను నామమున బిలువబడు చుంటిని, నేనిప్పుడు ఎక్కడనుంటినో నెటులనిక్కడకు వచ్చితీనో డెలుపవేడెదనన" నాముని ముహుర్తమాత్ర మాలోచించీ కనికరము గలిగి “పూర్వ మొకానొక బ్రాహణుండు పితృశ్రాద్ద్ధము పార్వణ విధానముగ చేయనందున పితృశాపము వలన పిశాచరూపము బొందెను. ఆపిశాచముసదా దుష్కరుడవగు నిన్ను దేశమంతయు త్రిప్పి తుదకు నీపుణ్యమువలన నిక్కడకు తీసుకోని రాగా ఈతీర్థ స్నానముచే నాపిశాచమునకుముక్తి గలిగె ను. నీకు దుష్కర తోలిగెను.”

శ్లో. యాని నిష్కృతి హీనాని పాపాన్యపీ వినాశయేత్ |
శూద్రేణ పూజితం లిజ్ఞం విష్ణుంవాయెనమోద్విజః||

శ్లో. ప్రాయశ్చిత్తంగత స్యోక్తం స్మృతిభిః పరమర్షిభిః
నశ్యేత్త స్యాపితత్పాపం తీర్ధే జాబాలిసంజ్ఞకే||

తిరుమల తిరుపతియాత్ర.

93

శ్లో. విప్రనిన్దాకృతాం చైవ ప్రాయశ్చిత్తం న విద్య తే|
విశ్వాసఘాతుకానాం చ కృతఘ్ననాం చ నిష్కృతిః ||

శ్లో. భ్రాతృభార్యా రతానాం చ ప్రాయిశ్చిత్తం నవిద్యతే|
తేషాం జాబాలితీర్ధేనై స్నానాచ్చుద్ధిర్భవిష్యతి||

5. కటహ తీర్థం.

గంగా నదికి దక్షిణభాగమున 200 ఆమడ (యోజనము) దూరమున తూర్పు సముద్రమునకు పంచభిర్యోజనచూరము పశ్చమముగా సుసర్ల ముఖీనదీ తీరమున ను త్తరముగా క్రోశడుదూరములో సమన్తులవలన నందింప బడు వెంకటాద్రిగలడు. ఆ వెంకటద్రీశుని మేరుపుత్రుడు దేవతలు ఋషులు మొదలగు వారు సాకేత్ శ్రీమన్నారాయణుడని పుజించెదరు.మోక్షప్రదాయకుడై శ్రీవెంకటేశ్వరుని చుట్టుకోని శ్రీమహాలక్ష్మీయు భూనీళా   దేవులున్నారు.అట్టి వెంకటేశుని ఆలయములో నుత్తరభాగమున విమాన ప్రదక్షణములో నున్నదనీ భారద్వాజ ఋషి చెప్పిరి. ఇందలి తీర్థమును స్పర్శదోషము లేకుండా బ్రహ్మకుక్షత్రియ వైశ్య శూద్రులు నాల్గుజాతుల వారు తీసుకొనేదరు. ఇందలి తీర్థపానము బ్రహ్మహత్యాది మహాదోషములను గూడ బోగోట్టీముక్తిదాయకముగనున్నది. నాల్గు ఆశ్రమములవారు ఇందలితీర్థము సేవించి ముక్తిబొందేరు. కుష్టు మొదలగు కర్మవ్యాధుల సహాపోగొట్టును.

శ్లో. స్మృతిమాత్రేణ యత్పూంసాం సర్వపాపనిషూదనం,
మంత్రేణాష్టాక్ష రేణై వపిబేతీర్థ మనోహరం.||

శ్లో. అధవా కేశ వాద్యైశ్చ నామభిర్వాపిజ్జలం,
యద్వానామత్రయేణాపి పిబెత్తిీీర్ధం శుభప్రదం.||

94

తిరుమల తిరుపతియాత్ర.

శ్లో.ఆహాస్విద్వే టేశస్య మంత్రేణాష్టాక్షరేణ వై;
పిబేత్కటాహతీర్థం తాద్భుక్తిముక్తి ప్రదాయకఁ;

శ్లో.వినా మంత్రేణ యో వి ప్రస్సం పిబే తీర్ధము త్తమం;
పాపమేనాశయక్షిప్రం జన్మాంతర కృతంమహత్;

శ్లో. ఇత్యుక్త్వా న పిబేన్నిత్యం మోక్షమార్ధైక సాధనం;
స్వామిపుష్కరిణీ స్నానం వరాహ శ్రీశదర్శనం;

శ్లో.కటాహతీర్థ పానం చ  త్రయంత్రైలోక్య దుర్లభం;
బహునాకి మిహోక్తేన బ్రహ్మహత్యా దినాశకం;

స్కన్దపురాణము.

పూర్వము తుంగభద్రానదీతరమున వేదశాస్త్రపారంగతుడైన పద్మనాభశర్మ అనుబ్రాహ్మణోత్త ముండుగలడు. ఆయనకు కేశవర్మ అనుపుత్రుండు గలడు. ఆపుత్రుండు దల్లి దండ్రులను భార్యనుస్వకర్మలను వదలి జూదమాడుచు, సురాపానము జేయుచు, వేశ్యాంగనల నిండ్లభుజించుచు, గాలము గడుపుచుండెను. ద్రవ్యముకొఱకు దొంగతనము శేయుచు చేత ఖడ్గము బూని బ్రహ్మహ్యత లొనర్చుచుండెను. ఒ కేపుత్రుడిటుల దుష్కరుఁడయ్యెనని దుఃఖించుచు తండ్రి తుదకు భరద్వాజ ఋషికడకేగి నమస్కరించి జెప్పుచుకొనగవారు ఈతీర్థముపుచ్చు కొన్నంతటన్ని దోషములు పోవుననీ చెప్పనటుల నాబ్రహ్మణుఁడు పుత్రుని తీసుకొనివచ్చి శ్రీస్వామిపుష్కరిణి స్నానము గావించి శ్రీవరాహస్వామివారి దర్శనము చేయించి శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానమునకు తీసుకొని వెళ్లి విమాన ప్రదకుణంచేయించి తీర్థము పానంబుగావింప నాదుష్కర్మవిముక్తి గల్లెను.

తిరుమల తిరుపతియాత్ర.

95

6.కుమారధారతీర్ధము.

స్వామీ ఫ్రషరిణికి నుత్తరభాగమున మూడుమైళ్ల దూరమున పాపనాశనమును .ఈ తీర్ధమునకు వాయవ్యమూలను మూడుమైళ్ళ దూరమున కుమారధార తీర్థము గలదు. కుంభ రాశియందు రవియుండగా మఖనక్షత్రముతో కలిసిన మాఘశుద్ధపౌర్ణమి నాటిమధ్యాహ్నము ఈ తీర్ధములో స్నానము చేసినంతటి గంగాది సర్వతీర్ధస్నానముగావించిన ఫలము ప్రాప్తించి 12 సంవత్సరములుండును ఈ తీర్థమందేవరు దక్షణయుక్తముగా నన్న దానముగాని చందనటంబుల దానముగాని చేస్తారో వారి స్నానఫలము బొందెరు. ఈతీర్ధమువద్ద ఒక్క ఇనుపనిచ్చెనయాత్ర అంతము సౌఖర్యార్ధము వేయబడినది.

శ్లో.

   ... ... ... ....
తస్మి౯ తీర్ధ సర్ణ దానమణు మేరుసమంభ వేతం॥


శ్లో.

వస్త్రం దానంచ గోదానం భూదానం చ తతోథిమ్।
యో నాదదాతి మత్ప్రీత్యా తస్య లక్ష్మీర్గృహెస్థితా.॥

మార్కండేయపురాణము.

పూర్వకాలమున నొకానొక వృద్ధ బ్రాహ్మడుండెను. అతఁడు మిగుల దారిద్ర్యపీడుతుడై కుటుంబసంరక్షణ చేసుకోనలేక నుండెను. దరిద్ర దోషమువలన నిహపర సాధనములే మిగుల దుఃఖితుడుగా నుండెను. ఈకష్టము భరింపమి ఒకనాడు

96

తిరుమల తిరుపతియాత్ర.

స్వర్ణముఖరీ సమీపమునబోయి చెంతనున్న శేషగిరిశిఖరమున కెక్కి. “బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలారా నవగ్రహాశ్వస్యాదులారా సర్వభూతములారా! నేనతీత దరిద్రపీడితుడై కుటుంబరక్షణ చేయ లేక నిహాలోక సుఖము లేక ధరాచరణన శక్తిచే పరలోక సుఖంబుగానక యున్నాను, వృద్దుడునై దరిద్రదోషహతుడగుట జన్మ వ్యయర్థంబు. పర్వతశిఖరంబుననుండి పత\బు చే ప్రాణత్యాగంబు దోషంబు లేదని పెద్దలు వచించిచెదరు. నేను పడుచున్నాను పడుచున్నాను పడుచున్నాను అనిపడ బోవుచుండ శ్రీవేంక 'కేశ్వరస్వామివారు మృగయార్ధమే తెంచిన నొక రాజపుత్రునిన లే దర్శనమిచ్చి పర్వతము క్రిందనుండీ “వలదు వలదు బ్రాహ్మణునకు భృగుపతనంబు దోషము పర్వతశిఖరంబు దిగిరమ్మ"నుచుజెప్ప నావీ ప్రుండు “ఓరాజు! నన్ను నాభార్యా బిడ్డలను గాపాడినంతట నేను దిగెదను” అని ప్రత్యుత్తరమియ్య “సర్వందదామి” అని రాజపుత్రుడె నతియ్య నా బ్రాహ్మణుడుదిగేను. ఆ ప్రభువృద్ధ బ్రాహణునికరము కర ముచే బూనితీసుకొని వెళ్లి "పాపనాశనమునకు కుత్తరముననున్న ఈతీర్థమున స్నానముచేయుము దుఃఖశాన్తియై కౌమారము వచ్చును” అని చెప్పెను.

శ్లో.

స్నానం కురు తతః ఖేద శాన్తిస్తత్ర భవిష్యతి।
ఇత్యుక్తె తత్ర తత్తీర్థే స్నాత్వోత్థాయ యువ భవత్॥


శ్లో.

మనః ప్రసన్న తాం యాతంకుమారశ్చత దాభవత్॥
తరంతు సర్వతః పశ్యంస్తమ దృష్ట్వా స్వ తప్యత॥

మార్కండేయపురాణము.

తిరుమల తిరుపతియాత్ర.

97

ఆ బ్రాహ్మణుండు స్నానము జేయుచుండగా నారాజపుత్రుం డంతర్ధానయాయెను. తన్నువదలి రాజకుమారుడెక్కడకు బోయెనని విప్రుండు విలపించుచుండనంత నొక శబ్దము "ఓ బ్రాహ్మణుడా! శ్రీవెంకటేశ్వరకృపాకటాక్షము వలన నిహలోకములో నైశ్వర్యసుఖము నీవు బొందితివిగదా! నీ దేశమునకుబోయి భార్యాబిల్లలు సహీతముగానుండు. శరీరములో బలమున్నప్పుడే ధరము జేయుడి” అను మొదలగుహీతోపదేశము వెల్లడిచేసెను. దరిద్రపీడితుడైన నీవృద్ధబ్రాహ్మణునకి తీర్థస్నానమున కుమారత్వం ధనత్వం ప్రాప్తమాయెను. వృద్దుండిందలి స్నానము జేసిన మాత్రమున కౌమారదశబొందె నందున కుమారధారతీర్థమని పేరుగల్గెను. శ్రీకుమార స్వామి దేవసేనానిగానుండి దేవతల ప్రత్యర్ధముతారకాసురుని సంహరించి నందువలన బ్రహ్మహత్యా దోషము బోవుటకు నీతీర్థముల ప్రణవపూర్వక శ్రీ వేంకటేశాష్టాక్షర మంత్రము జపించుచు స్నానము జేసి నంతటా దోషము హరించునని పురంధరు డానతియ్య నాయనట్లు జేసినందున ఆదోషముబోయెను, ఒక్కకల్పము ఈతీర్థమువద్ద శ్రీకుమారస్వామి శ్రీవారి అనుజ్ఞ ప్రకారమున్నారు.

7. చక్రతీర్థము.

ఈతీర్థము తిరుమలకు రెండుమైళ్లదూరమున వాయవ్యమూలలో నున్నది. ఇచ్చట పూర్వము శ్రీవత్సగోత్రీకుడైన పద్మనాభుడను బ్రాహ్మణుండు జితేంద్రియుండై వత్రోతోదకంబులు భక్షీంచుచు 12 సంవత్సరంబులు ఘోరంబుగా తపంబా చరించెను. రాక్షసబాధమిగుల హెచ్చుగనుండెను. శ్రీవేంకటశ్వరస్వామివారు ప్రత్యకుమయి ఆఋషిని నిచ్చట నేనుండమని రాక్షసాదుల నివారింపతమ చక్రమిడెను. ఈచక్రమునలునుననుర బాధనివారమాయెను. తపంబుసల్పమిగుల నుత్తమ శమాయేను. శ్రీరంగములో నుందగుండను బ్రాహ్మణుండు శాపం వలస రాక్షసరూపముబొంది ఈతీర్థమునకు వసిష్టమహఋషి అనుజ్ఞ ప్రకారము రాగా సుదర్శనంబు వల్ల రాక్షసత్వముతో, తీర్థస్నానమువలన పాపములు పోయిముక్తి బొందెను. ప్రతిసంవత్సరము కార్తీక బహుళ ద్వాదశినాడు మధాహ్నం అచ్చటకు దేవస్థానంనుండి ఒక్క పాయసంతళిహ తీసుకొనివెళ్లి అచ్చట నున్న శ్రీలక్ష్మీ నృశింహస్వామివారికి సుదర్శనమునకు అభిషేకనుయిన తర్వాత ఆరగింపు వినియోగములు చేయబడును. అప్పుడు అదఱు తీర్థస్నాన మొనర్చెదరు.

8. ఆకాశగంగ.

ఇది శ్రీస్వామి పుష్కరిణి తీర్థమునకుత్తరమున రెండు మైళ్లదూరమునగలదు. ఇచ్చట అంజనాదేవి త్రేతాయుగములో పండ్రెండు సంవత్సరంబు లాహరంబు లేక తపంబొనర్చి ఆంజనేయులనుగనెను. ఈ తీర్థము పర్వతములోనుండి ధారగా వచ్చును. చాలానిర్మలోదకము. నిత్యము శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆరాధనకు మూడుబిందెల తీర్థమువచ్చును.

పూర్వకాలములో రామానుజుడను విపృుడోకండు ఆకు అలములీనుచు ఘోరతంబు శేయ శంఖుచక్రధరుడై లక్ష్మీ

తిరుమల తిరుపతియాత్ర.

99

సమేతుడైన శ్రీమహావిష్ణువు పరిహార సహితముగి ప్రత్యక్షమాయెను.

శ్లో.

ఏతేనచకృతాళోస్మి వెజ్కకేశ జగిత్పతే।
యన్నామన్మతిమాత్రేశోమహాపాతకపోచ॥


శ్లో.

ముక్తిం ప్రయన్తిమానుజాన్తం పశ్యామి జనార్ధమ్.।
త్వత్పాదపద్మయుగ నిశ్చలాభ క్తిరన్తుమ్.॥

"మేఘమాసములో చిత్రానక్షత్రయుక్త పూర్ణిమనాడు ఈతీర్థములో స్నానమొనర్చినవారు పునరావృత్తి వర్జిషితసుఖం బునుబొందెదరు. రామానుజ ! నీవు ఈతీర్ధముు నొద్ద వసించుము. కర్మానుభవముగ నీవు జన్మాంతమున మత్స్య రూపంబు బొంచెదవు. ఈ తీర్థములో స్నానముజేసినవారు భాగవతోత్తములగుదర"ని శ్రీస్వామివారు చెప్పి భాగవత లక్షణంబువచించున్నారు.

1. సర్వహితము గనసూయ మత్సరాదులు లేని జ్ఞాన మునిస్పృహత్వము శాంతము గలిగినవారు.

2. అపరిగ్రహశీలులుగ నుండీగను మనోవాక్కాయ కర్మలచే పరపీడ చేయనివారు.

3. సత్కథ శ్రవణమందు సాత్విక బుద్ధిగలిగి నాయందు భక్తిగలవారు.

4. పరనిందజేయక సుగుణ గ్రహణము గావించువారు

5. తల్లి దండ్రుల శిశృూషచేయు వారు. దేవతార్చన యందానక్తిగలవారు. 6. శతృమిత్రభేదము లేక “ ఆత్మవత్ సర్వభూతానీ” అను {ప్రకారము నడచువారు.

7. ధర్మశాస్త్రవేత్తలు, వీర్లకు శిశ్రూష చేయువారు.

8. గోబ్రాహ్మణ శిశ్రూష చేయువారు. తీర్థయాత్రా పరులు.

9. అన్న దానము చేయువారు.

10. తోటలు, భావులు దేవాలయములు నేర్పరుచు పోరు.

పూర్వకాలమున గోదావరితీరమున వేదవేదాంగపారంగతుఁడు అగ్ని హోమాదిక్రతువులొనర్చిన పుణ్యశీలయనునొక విప్రవర్యుండుండెను. అతడు పితృతిధికి నిమన్త్రరరణకు గాను గొప్ప పండితుండును అగ్నిష్టోమము చేసినవాడును సుశీలుడును అయిన నొక బ్రాహ్మణుని పిల్చెను. నిమన్త్రణానంతరము పుణ్యశీలుడు గర్దభముఖ ప్రాప్తిబొందెను. ఇందుకు దుఃఖతుడై కారణంబుగానక స్వర్ణముఖరీ తీరమందాశ్రమములో నుండు అగస్త్య ఋషివద్దకుబోయి వేడ వారిట్లు వచించిరి."పుత్రుడు లేని బ్రాహ్మణుని నియంత్రణకు నిర్మించుటచే నిట్లు దోషముగల్లెను.

శ్లో.

యేలో కేహక్యకవ్యాదౌ వన్ధ్యాయాస్సామినంద్విజమ్।
నియోజయన్తితేయాన్తి ముఖేగార్దభరూపతామ్.॥


శ్లో.

శుభకర్మణివావి ప్రనైతృకేపికర్మణి,।
వన్ధ్యాపతిమపాపం కదాచిన్న నిమన్తృయేత్ .॥

అని చెప్పుచు వేంకటాచలమందు వియడ్గగగలడు. ఆ పర్వతమునకేగి అచ్చట సర్వపాపహరమగు శ్రీస్వామిపుష్కరిణిలో సంకల్పపూర్వముగా స్నానమొనర్చి తర్వాత నాకాశగంగ తీర్థములో స్నానము చేసినంతట నీవి రూపము బోవు నయనతడట్లు జేయవికృతరూపము పోయెను.

9.పాపవినాశనము.

ఈ తీర్థము శ్రీస్వామి పుష్కరిణి కుత్తరభాగమున మూడుమైళ్లదూరమున నున్నది. ఇందలి స్నానము ముక్తి దాయకము.

శ్లో.

తత్రస్నా నాన్న రాయన్తి వైకంఠం సోత్రసంశయః॥

ఈ తీర్థమునకు ముక్కోటి అగు ఆశ్వయుజ శుద్ధసప్తమి ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడిన ఆదివారము నొడు గానీ, ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తమైన ద్వాదశినాడుగాని స్నానముమిగుల శ్రేష్ఠము.

శ్లో.

ఆశ్వయుక్చుక్ల పక్షాచప ప్తమ్యాంభానువాసరె.॥


శ్లో.

ఉత్తరాషాఢాయుక్తాయాం తథాపాపవినాశనమ్.।
ఉత్తరాభాద్రాయుక్తాయాంద్వాదశ్యాంవాసమాగమ॥


శ్లో.

సాలగ్రామశిలాందత్వా స్నాత్వాచవిధిపూర్వకమ్,।
ముచ్యతేసర్వపానైశ్చ జన్మకోటిశదవైః.॥

10. ఘోణతీర్థము.

ఈ తీర్థము శ్రీ స్వామి పుష్కరిణి కుత్తర భాగమున పది మైళ్లదూరముననున్నది. ప్రదేశముచూడ బహు రమణీయముగ నుండును. ఇది దట్టమైన అరణ్యమద్యనున్నది. మినమాసములో నుత్తరఫల్గునీ నక్షత్రయుక్త పౌర్ణమాన్యదినమున నీతీర్థముక్కోటి. అచ్చట కప్పుడనేక జనంబు లేగి స్నాన జపభోజనాదులుగావించి సాయంకాలమునకు తిరుగ వచ్చెదరు. దేవస్థానమునుండి శ్రీవారీ కారగింపయిన ప్రసాద ములు చందనము తాంబూలము సహా అచ్చట కేగిన జనంబున కాహారమునకు పంపబడును.

శ్లో.

మీనసంస్ధసవితరిపొర్ణ మానీతిధౌధరే॥


శ్లో.

ఉత్తరపల్గునీయుకే చతుర్లైకాలసత్తమే.
పంఞ్చచనామపితీర్ధానాం తుమ్భేధగిరిగహ్వరే.॥


శ్లో.

యస్నాతిమనుజోదేవి పునర్గ నజాయతే.॥

ఇక్కాలమున చేసిన స్నానఫలంబు చెప్పనలవిగాదు. కోటికి న్యాదానములు గోదానములు మొదలగునవిచేసిన ఫలంబు ప్రాప్తించును. సమస్తపాపములను హరించును. ముక్తిని చ్చును.గంగాదీనదులలో స్నానంబొనర్చిన పుణ్యంబు సంప్రాప్తించును. అగ్నిష్ఠోమాది క్రతువులోనర్చిన ఫలంబు జేకురును. ఆరామచ్చెదనము, కన్యావిక్రయము, దేవద్రవ్యా పహరణము తటాకు సేతు భేత్తారము. పర స్త్రీ సంగలోలుపము, గురు విప్రజనద్వేషము, ఆత్మస్తుతి పరాయణము, అసంస్కృతాన్న భోజనము, పితృశేషాన్న భోజనము, మాతాపితృవిరోధము బోహణుండు దర్భపాణియై ఛండాలునీతో భాషించుట, పితృయజ్ఞ పరి త్యాగము మొదలగువాని వలన దోషములను ఘోణతీర్థస్నాన ముహరించును, ఇందలిస్నానము వలపునరానృత్తి వర్జితమైన వైకుంఠప్రాప్తీగల్లును.

పూర్వకాలములో తుంబురుడను గంధర్వుడు పత్నీ సహితముగ నీతీర్థమువద్దనివసించుచుండెను. తుంబురుడు సర్వవిద్యో విశారదుండు. భార్య సర్వనుగుణసంపన్నురాలు, గంధర్వుడు ప్రీతితో తన భార్యనుబిలిచి ఈమాఘ మాసంబునను దినము. తనతో అరుణోదయమున స్నానము చేసినట్టిల్లు అలికిముగ్గు పెట్టి దేవతానివేదనకు పాకము చక్కగా చేసి తనతో దేవునికి ప్రదక్షణముగావించి అరిషడ్వర్గంబులు వడలి (శ్రీమన్నేరాయుని ధ్యానింపుము. శాశ్వతైశ్వర్యపదము నులభ సాధ్యమగుననీ జెప్ప శీతంబున స్నానంబు సాధ్యంబుకాడను అప్రియ వాక్కులనేకములు బలుకునాగ్రహముగల్లి "శ్లో. పుత్రంచధర్మదిముఖం భార్యాం చాప్రియభాషిణీమ్, అ బహణ్యంచ రాజానాం సద్యశ్నాపేనశోయేత్ || "అనువాక్యము స్ఫురణకు తెచ్చుకొని “నీవు ఘోణతీర్ధమునకు దక్షిణమున నిర్జల ప్రదేశమున పిప్పలివృక్ష శోటరములో మండూకరూపముననుందువుగాక?” అని భార్య నుశపింప నామెపతిఅయిన గంధర్వవల్లభుని పాదములమీదపడి దయకు ప్రార్ధింప “అగస్త్య ఋషి ష్యులతోవచ్చి ఘోణతీర్థములో స్నానముగావించి పిప్పలి వృక్షమువద్ద శిష్యులకు ఘోణతీర్ణమహిమ చెప్పనదిపిన నీకు ఈ రూపము బోవునని ఆనతిచ్చెను. ఆ ప్రకారమనేక వత్సరములా కోటరములోనుండెను. తుదకు అగస్త్య ఋషిశిష్యులసహా వేంకటాద్రికివచ్చి శ్రీస్వామిపుష్కరిణిలో స్నానమాచరించి శ్రీవరాహస్వామివా రిని, శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించి ఘోణతీర్థమునకుజని స్నానానంతరము పిప్పలి వృక్షనీడను కూర్చుండి శిష్యులకు ఘోణతీర్థ మహత్మ్యము వర్ణించెను. మండూకము ఋషి సాద కములకు నమస్కరింపనారీరూపము జెందెను. అంత నీవెవ్వ వని నౌమునిపుంగవుడడుగ పతివాక్యము మీరినందున నీగతి గలైనని అంతయు వెల్లడిచే సెను. అంత నామునిశ్రేష్ఠుండు "పతివాక్యంబు మీర రాదు. స్త్రీకి స్వతంత్రము లేదు. పతియే ఆత్మ, విష్ణు, బ్రహ్మ, శివుడు, గురువు, పతిపాదములుకడిగి ఆ తీర్ణములో స్నానము చేసిన గంగాదీనదులలో స్నానఫలంబుగల్లుటయేగాక శ్రీమహావిష్ణువునకు ప్రీతిగల్గును.” అను హితోప దేశముచేసెను. తుంబురునిభార్య ఇపముచే మాండూకు రూపొపమొంది ఘోణతీర్థమహత్మ్యమువలన తిరుగే నారీరూపముజెందెను. గనుక తుంబుర తీర్థమని పేరుగల్గెను. దీనినే తుంబుర ఘోణతీర్థమని వాడెదరు.

ఇచ్చట తరిగొండ వెంగమ్మను భక్తురాలు కొంత కాలము క్రిందట తపంబుసల్పిన తావు ఇంకను తెల్లంబు.

11. రామకృష్ణతీర్ధము.

శ్రీస్వామి పుష్కరిణికి ఉత్తరభాగములో నీ తీర్థము 6 మైళ్లదూరమునగలదు. ఇచ్చటకు కృష్ణుడను నోక మునితపన్సు చేసుకోనుచు నీ తీర్థము స్నానార్ధము కల్పించెను. అనంతరము రామకృష్ణుడను నోక ముని ఇచ్చట అనేక శతాబ్దములు ఘోరతపంబుస ల్పెను. ఆమునిచుట్టు వల్మీక మొక నిర్మాణనూయేగానీ నామునిపుంగవున కిది తెలియదాయేను. ఇతని తపంబుచూచి పరీక్షాదషము సప్తవివసంబులు రెయంబగళ్లు దేవతలు అతీతమైన వర్షంబుకురుపించిరి.

శ్లో.

శ్దారావర్షేణమహతా వృష్యయమాణోపిపై మునిః,।
తద్వర్షం ప్రతిజగ్రాః నిమీలితవిలోచనః.॥

తర్వాత ఉరుములు విశేషముగానుండెను. చెవులు వీన బడకనుండెను. మెరుపులు పిడుగులుగల్గె. పిడుగులవలన వలీక శిఖరముక్రిందపడెను.వెంటనే గరుడారూఢుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఇట్లు వచించెను.

శ్లో.

మదారిర్భావదివసేయ స్స్నాతిమనుజోత్తమః,।
తస్యపుణ్యఫలళంవక్తుం శేషేణాపిసశక్యతే.॥


శ్లో.

మకరస్థెథేరావౌవిప్ర పౌర్ణమాస్యాంమహాతిధౌ,।
పుష్యనత్రయుక్తాయాం స్నానకాలోవిధీయతే.॥


శ్లో.

శ్లో. తద్దినేస్నాతియోమర్త్యః కృష్ణతీర్ధేమహామితిః,।।
సర్వపాపవినుర్ముక్తు స్సర్వాన్కామా౯ల బేతసః,॥


శ్లో.

శ్లో. మదావిర్భావదివసె కృష్ణతీర్థజలేశుభై,।
స్నాతుంతత్ర సమాయాంతి స్వపాప పరిశుద్ధయే.॥

స్కన్దపురాణము.

నేను నీకు ప్రత్యకమయిన దివసమగు మకరమాస పుష్యమి నక్షత్రముతో కూడుకొనిన పొర్లమాస్య దివసమున తీర్ధములో స్నానముచేయు దేవతలు, మనుష్యులు మొదలగు వారికి సర్వపాపములు పోవును. ఇకమీదట నీతీర్థము రాను కృష్ణతీర్ధమని లోకములో ప్రఖ్యాతిజెంందును.

ఈ శుభ దినమున వందలకొలదీ జనులు స్నానమునకు తీర్ధమునకు వెళ్లెదరు. దేవస్థానమునుండి ప్రసాదములు మొదలగునవి పంపబడును. దేవస్థానం శిబ్బందీలు అర్చకులు మొదలగు వారందరు వెళ్లేదరు. అచ్చటనుండు కృష్ణవిగ్రహమునకు అభిషేకమయి దేవస్థానంనుండి తీసుకొనబడిన ప్రసాదము ఆరగింపయి వినియోగము జేయబడును.