గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/అన్నపర్రు

వికీసోర్స్ నుండి

4

అన్నపర్రు

కయిఫియ్యతు మౌజే అన్నంపర్రు. సముతు నాదెళ్ల,

తాలూకే సత్తెనపల్లి యిలాకే రాజామానూరు వెంకట్రావు

మయినరు జమీదారు స్న౦౨౨౭ ఫసలీ మజుకూరి కరణాలు

అనపర్తి క్రిష్ణమరాజు, బుచ్చిరాజు, పెరుమాళ్ళు శేషప్ప,

మంత్రప్ప మొదలయినవారు వారియించినది.

పూర్వం బొబ్బిలి దేవమహారాజు బొబ్బిలిపట్నంలో వుండి రాజ్యభారం చేస్తూవుండగా అప్పట్లో అతిసంమ్మంధమయిన జయినులు కొందరు యీస్థలానికివచ్చి గ్రామం యేర్పరచుకొని రాజవోలు అని నామాంకితంవుంచి కొన్ని దినములు ఆస్థళమందు కాపురంవుండి కాలాంతర అవస్థ చాతను జయినులు ఖిలపడిపోయిన మీదట ఆస్థలం పాడయి దిబ్బగావుండగా దక్షిణాది చిరమన కాపరస్ధులయిన అన్నంరాజు చిగిలిరాజు కోనంరాజు అనేవారు అన్నదమ్ములు అర్థవంతు లయివుండి యీదేశానకువచ్చి యీజయినుల సంమ్మంధమయిన వాటిమీద అన్నంరాజు తన పేరిట గ్రామంకట్టుకొన్నందున గ్రామానికి అన్నంపర్రు అనే వాడికె వచ్చినది. గజపతి సింహాసనస్థుడైన గణపతిదేవ మహారాజులుంగారు ప్రభుత్వంచేస్తూ వుండేయడల వీరివద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామన్నగారు సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరిణీకపు మిరాశీలు నిర్ణయించే యడల యీగ్రామానికి యజుశ్శాఖాధ్యాయనులున్ను శ్రీవత్సస గోత్రులయిన అన్నపర్తివారికి మిరాశీ యేకభోగముగా యిచ్చినారు. తత్సంతతివారు పరంపరా అనుభవిస్తూ వున్నారు. అప్పట్లో సదరహీ గ్రామ మిరాశీదార్లు అయిన అన్నంపర్తివారు యీగ్రామమధ్య మందు ఆంజనేయస్వామి వారికి ఆలయం కట్టించి ప్రతిష్ట చేసినారు. తదనంతరం మల్కీ విభురాంపాదుషహవారు దేశం ఆక్రమించుకొని సముతుబందీ వగయిరాలు నిర్నయించేయడల యీగ్రామం నాదెళ్ల సముతులో దాఖలు చేసి సముతు చవుదరు, దేశ పాండ్యాలు అమీన్లు పరంగా అమానీ మామ్లియ్యతు జర్గించుకొంటూ వచ్చినారు. స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో ముఖార సువారు కొండవీటిశీమ జమీదార్లకు పంచిపెట్టేయడల యీగ్రామం సర్కారు మజుందారు డయిన మానూరు వెంకన్న పంతులు వంటులో వచ్చి చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయినది గనుక వెంకన్న పంతులు ప్రభుత్వం చేస్తూన్ను యీ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామివారిని పునః ప్రతిష్ట చేసి గుడికట్టించి నిత్య నైవేద్య దీపారాధనలకు యిచ్చిన మాన్యం-కు ౦౺౦ యీదేవస్థానం భజంత్రీలకు యిచ్చిన మాన్యం కు ౦౺౦ యీ గ్రామం యొక్క కాపు నొల్లా మూర్తి వేయించిన చర్వుకు యిచ్చిన మాన్యం కు ౦౺౦ యీప్రకారముగా వెంకన్నగారు స్న ౧౧౪౦ (AD 1730) ఫసలీ వరకు ప్రభుత్వం చేసిన తదనంతరం యీయన తమ్ముడయిన అప్పాజీ పంతులు ప్రభుత్వంచేశిన మీదట యీయన కొమారుడు వెంకట్రాయునింగారు అధికారంచేస్తున్ను స్న ౧౧౪౪ (AD 1734) ఫసలీలో మజుకూరి కాపు అయిన నొల్లా రవణప్ప పొలిమేర తొక్కినందున యితనికి కు ౦౺౦ పొలిమేర మాన్యం యిచ్చినారు. తదనం

తరం వెంకట కృష్ణనింగారు స్న ౧౧౬౦ (AD 1750) ఫసలీ లగాయతు ప్రభుత్వం చేస్తూవుండే యడల భట్టుమూర్తి అనే భట్టురాజు పద్యాలు చెప్పినందున కుచ్చెలపొలం మాన్యం యిచ్చినారు. తదనంతరం నవాబు ముఖారసుఖానువారు కొండవీటి ఖిల్లాకు జాహగీరుగా పద్దెనిమీది గ్రామాదులు నవాబు ఫతుల్లాధా౯ ఖిల్లేదారుపరం చేసినారు గనుక అప్పట్లో యీ గ్రామం హవేలీజాహగీరులో దాఖలుఅయి ముప్పై అయిదు సంవ్వత్సరములు జాహగీరు నడ్చినది. రాజా మానూరు వెంకట కృష్ణునింగారు స్న ౧౧౭౮ (AD 1768) ఫసలీ వరకు ప్రభుత్వం చేశిన మీదట యితని కొమారుడయిన నరసన్నారావుగారు వెంకటేశంరావుగారున్ను తాలూకా చేరిసఖం పంచుకునేయడల యీ గ్రామం వెంకటేశం రావువారి వంతులోవచ్చీ సత్తెనపల్లి తాలూకాలో దాఖలు అయినది గనుక వెంకటేశ్వరావుగారు స్న ౧౧౮౨ (AD 1772) ఫసలీ లగాయతు స్న ౧౨౦౫ (AD 1795) ఫసలీ వరకు ప్రభుత్వం చేసిన మీదట యీయన కొమారుడయిన రమణయ్యరావుగారి ప్రభుత్వములో అచ్యుతన్న శేషాద్రి సోమయాజులు యీ గ్రామానకు అధికారానికివచ్చి యీ గ్రామమధ్యమందు శివాలయం కట్టించి విశ్వేశ్వరుడనే లింగమూర్తిని ప్రతిష్ట చేశినారు. స్న ౧౨౦౬ (AD 1796) ఫసలీ లగాయితు స్న ౧౨౨౪ (AD 1814) ఫసలీ వరకు రమణయ్యారావుగారు అధికారంచేసి చనిపోయిన మీదట యీయన తమ్ముడయిన వెంకట్రావు మయినరీలో వున్నారు గన్కు హానరెబల్ కుంఫిణీవారు మేనేజర్ల పరంగా అమానీ మామిలియ్యతు జరిగించుకొంటూ వున్నారు. యీ గ్రామంలో విశ్వేశ్వరస్వామి దేవాలయంగా ఆంజనేయుల దేవాలయం ౧యీ రెంటికి పూజా నైవేద్యాలు జర్గుతూవున్నది.

(యిక్కడ స్థలం మూలంలో ఖాళీగా వున్నది)