పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

మహాపురుషుల జీవితములు

చెప్పిపోయిరి. ఈతెఱంగుననే యతఁడు కోరినట్లనేకాద్భుతములు దేవీ ప్రసాదమువలన జరుగుచు వచ్చెను.

ఇట్లు నిరంతరప్రార్థనములఁ జేయుచు సమాధులం బ్రవేశించుచు రామకృష్ణుఁడు పండ్రెండుసంవత్సరములు తపస్సు చేసెను. ఆకాలమునం దొకనాఁడు రాత్రియు నతనికి నిద్రలేదు. కన్నులు బలవంతముగా నతఁడుమూయఁదలచినను మూయఁబడవయ్యె, అప్పుడప్పు డతఁడు "దేవీ! నేను మృతినొందుదును గాఁబోలునని భయపడుచుండ నతనికి "వత్సా! శరీరమునం దభిమానము విడువ వేని నీకు ముక్తి యెట్లుగలుగు" నని యొకశబ్దము వినఁబడెను. ఒకమారతఁడు తల్లీ నేనీకిం చిజ్ఞు లగు మనుష్యులవద్ద చదువు నేర్చికొనను నీవే నేర్పుమని యడుగ "వత్సా! నేను నీకు నేర్పెదనులే" యని యొకమాట వానికి వినఁబడెను. అప్పుడప్పు డతఁడు సర్వసమానుడయి "నేను బ్రాహ్మణుఁడను గొప్పవాఁడను, తక్కినజాతులవా రల్పులను దురభిమానము నామనసునుండి తొలఁగింపు"మని దేవిని బ్రార్థించి వెంటనే తక్కువజాతివాండ్రగు సేవకులయిండ్లూడ్చి వారికి విధేయుఁడయి మెలఁగును. మఱియొకప్పు డతఁడొకచేత రూపాయిలను రెండవచేత చిల్ల పెంకులను బట్టుకొని గంగయొడ్డునఁ గూర్చుండి "ఇది ధనము దీనిచే బియ్యము పప్పు మొదలగువస్తు లన్నియు లభించును. దీని నందఱు గౌరవింతురు. ఇవి చిల్ల పెంకులు. వీని మొగ మెవ్వరుఁ జూడరు. నాకివి రెండు సమానములే"యని రెండును గలిసి గంగలో బారవేయును. ఒకనాఁడు రాసమణి యల్లుఁడు మథురనాథుఁడు పదునైదువందల రూపాయిలు విలువగల యొక గొప్ప శాలువ వానికిం గప్పెను. రామకృష్ణుడు మొదట దానికి సంతసించినట్లె కనఁబడి నాలుగు నిముసములలో నాశాలువందీసి