పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంబాకం రామయ్యంగారు

373



గవర్నరుగారి శాసన నిర్మాణసభలో మొదటి స్వదేశసభికుఁడు నన శ్రీశఠగోపాచార్యులు, 3. దక్షిణహిందూస్థానమున విద్యాధికుఁడనిన పేరువహించిన లౌరీదొరగారు. 4. తిరువాన్కూరు సంస్థానమందలి హైకోర్టులో జడ్జీగాఁ జిరకాలముండిన సదాశివపిళ్ళేగారు. 5. గొప్ప విద్వాంసుఁడని పేరుపొంది బ్రతికినన్నాళ్ళు రోగములతో దీసికొనుచు స్వల్పకాలమే జీవించిన దీనదయాళు నాయఁడు.

ఈ యాఱుగురు విద్యార్థులు బరీక్షలో ఘనముగాఁ గృతార్థులైరి. ఆహైస్కూలు ప్రధానోపాధ్యాయుఁడగు పవెలుదొర తన విద్యార్థుల బుద్ధివిశేషము, గనిపెట్టి వారికిఁ పాఠశాలలోఁ జెప్పెడు చదువుఁగాక యింటివద్దగూడ ప్రకృతి శాస్త్రము మొదలయినవి చాలవఱకు చెప్పెను. ఆదినములలోనే రామయ్యంగారు ప్రకృతి శాస్త్రమును జ్యోతిశ్శాస్త్రమును నేర్చి వాటియందు మిక్కిలి యభిరుచిగలవాఁ డయ్యెను. రామయ్యంగారు పెద్దపుస్తకముల కట్ట చేతఁబట్టుకుని ముత్యాలుపేట నుండి ప్రతిదినము మిక్కిలి దూరమున నున్న తన పాఠశాలకు బోవుచు వచ్చెను. ఈకాలమందీయనకుఁ బరమమిత్రుఁ డీయన జ్ఞాతి యగు శఠగోపాచార్యుఁడు. ఈకాలములో రామయ్యంగారి కొకకష్టము సంభవించెను. ఈయన యన్నయు సర్వజనులకు నిష్టుఁడు గొంత కుటుంబభారము వహించిన వాఁడు నగు పార్థసారథియయ్యంగారు కాలధర్మము నొందిరి. ఆయన మరణము చేత దుఃఖితులైన తల్లి దండ్రులకు తనవిద్యాభ్యాసవ్యయము భారముగా నుండకుండ రామయ్యంగారు తనస్కూలుజీతము తానే తెచ్చుకొనవలసి వచ్చెను. ఆకాలములో శ్రీపచ్చయప్ప మొదలియారిగారి పాఠశాల పరిపాలనముఁ జేయుసభవారు, ఆంగ్లేయశాస్త్ర విద్యలను జదువుకొను విద్యార్థులతో మొదటివానికిఁ గొంత నెలవేతన మీయదలంచిరి. రామయ్యంగారు కష్టపడి చదివి తన వ్రజ చేతనే