పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

మహాపురుషుల జీవితములు



నుండి స్వదేశమునకు వచ్చినతోఁడనే యాతనిపై మఱియొక కార్య భారము బడెను.

1886 వ సంవత్సరమున గవర్న మెంటువారు పబ్లికు సర్విసు కమీషన్ అనేపేర నొకసభ నేర్పరచిరి. ఆసభలోఁ గొందరు తెల్లవారు మేటికెక్కిన స్వదేశస్థులు కొందఱు సభ్యులుగా నియమింపఁబడిరి. సర్ రొమిశ్చంద్రమిత్తరు బంగాళమునుండియు సార్కారను నతఁడు బొంబాయినుండియుఁ జెన్నపురమునుండి రామస్వామి మొదలియారియు మరియొకచోటనుండి భీంగారాజు సభికులుగానియుక్తులైరి. ఈసభ చేయవలసిన పనియేమనగాఁ దొరతనమువారి కొలువులో నదివఱకు స్వదేశీయు లెందఱున్నారో విశేషముగా వారిని గొలువులోఁ జేర్చుకొనవలయునా లేదా యెట్లుచేర్చుకొనవలయు ననువిషయములుగూర్చి విచారణచేసి దొరతనమువారికి రిపోర్టు పంపుట. రామస్వామి మొదలియారి యప్పటికి ముప్పదియా రేండ్ల వయసుగల వాడైనను మిక్కిలి లోకానుభవము గల పెద్దలతో సమానముగ గార్యనిర్వాహము జేసెను. ఎంతో గొప్పబుద్ధిశాలియైనంగాని దొరతనమువారంత చిన్నవానినంత గొప్ప కమీషనులోఁ గూర్చుండ బెట్టరు. పెట్టినందు కతడు తీసిపోక తగినట్లు బనిచేసెను.

ఈయన దేశీయ మహాసభమీదకూడ చాల నభిమానము కలిగి పనిజేసెను. ఒక సంవత్సరమీయనను దేశీయమహాసభ కధ్యక్షుడుగా నుండవలయునని తత్సభానిర్వాహకులు కోరగా నీతడా గౌరవముకుం దగినవారు తనకంటె పెద్దలున్నారని నిరాకరించెను. అంత దేశాభిమానము నంతవిద్య నంతయోగ్యత యంతధైర్యము గల యీసత్పురుషుని నలువదియేండ్లు నిండినతోడనే మృత్యు దేవత 1892 వ సంవత్సరమున దనబొట్ట బెట్టుకొనియె. ఇందుచేత దక్షిణ హిందూదేశము దురదృష్టవంతమని చెప్పనొప్పు.