పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

మహాపురుషుల జీవితములు



ఏలయన నవిజనులకుఁ బ్రయాణ సౌకర్యము గలిగించునని వాణిజ్యము నభివృద్ధిజేయుననియు నింగ్లీషువారి రాజ్యముతో మైసూరురాజ్యము కలసి విశేషలాభప్రదమగుననియు నాతఁడునమ్మెను. మైసూరురాజ్యమునందు, నీటిసాగుబడికిఁ జాలవీలున్నను భూమి విశేషభాగము సాగుబడికి రాక, వచ్చిన జక్కగా సాగుబడి చేయఁబడకయుండెను. దానికిఁ గారణము వ్యవసాయము చేయువారికిఁ దగిన సహాయము లేకపోవుటయేయని రంగాచార్యులు నిశ్చయించి యినుపదారులు దేశమున బ్రబలిన నీలోపము నివారింపబడునని తలచి తత్ప్రయత్నముల జేసెను. సంస్థానము లేమిలోనున్నను రంగాచార్యులు దానికి భారములేకుండ నినుపదారి విశేషముగా వేయించెను.

మైసూరు ప్రభువు లింగ్లీషుదొరతనమువారి కీయవలసిన యెనుబదిలక్షల రూపాయల ఋణమును దీర్చుటనుగూర్చి యతఁడు పిమ్మట ప్రయత్నించెను. సంస్థానముయొక్క ధనస్థితినిబట్టి చూడగా నీయప్పు తరతరములవఱకు దీఱునట్లు కనఁబడలేదు. ఆ ఋణము మీఁద నేఁటేటఁ బెరుఁగువడ్డీయే పెద్ద మొత్తమై యసలు మాటయటుండగా నీవడ్డియైన దీఱినంజాలుననుపించు చున్నట్లుండెను.అప్పటి స్థితులంబట్టి చూడగా నిండియా గవర్నమెంటువారు వారికిదోఁచినప్పుడు ఋణము దెమ్మని మహారాజును నిలువదీసి యడుగవచ్చును. అట్టి చిక్కు సంభవించెనా, ఋణవిమోచనమునకై సంస్థానమునకు భంగకరములైన పనుల జేయవలసివచ్చునని దూరదృష్టిగల రంగాచార్యుడు గ్రహించి, యాపప్పును గురించి యేవోస్థిరమైన యేర్పాటులు చేయఁదలచి, యిండియా గవర్నమెంటుతో లేఖాప్రసంగ మారంభించెను. ఈ జాబులలో నతఁడు మైసూరు దరిద్రదశలో నున్నదని వ్రాయుటయేగాక వెనుకటి మహారాజుల దౌర్బల్యము కతమున సంస్థాన మాంగ్లేయుల యేలుబడిలో నున్నపుడు జరిగిన