పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సెట్టిపాణియం వీరవలి రంగాచార్యులు

ఈరంగాచార్యులు 1831 వ సంవత్సరమున చెంగల్పట్టుజిల్లాలో నొకగ్రామమున జన్మించెను. ఈయనతండ్రి రాఘవాచార్యులు. చెఁగల్పట్టుకలెక్టరు కచ్చేరీలో నొక గుమాస్తాగా నుండెను. రంగాచార్యులు పసిబిడ్డయైనపుడు గొప్పగండ మొకటితప్పెను. తల్లితోఁగలసి పయనము చేయుచుండ దారిలో బండి బోల్తపడెను. బండి పడిపోవుటకు సిద్ధముగా నున్నపుడు రంగాచార్యునియన్న వేగముతోఁ దల్లి యొడి నున్న తమ్ముని నీవలకు లాగి యాతని ప్రాణములు కాపాడెను. కానిచో రంగాచార్యు లేమయియుండునో ! ఆతని తండ్రికి సర్కారు జీతముతప్ప మఱియేయాస్తియు లేదు. కుమారున కింగ్లీషు విద్య జెప్పింపవలయునని రాఘవాచార్యులు తలంచెనుగాని సంసార స్థితి చక్కగా నుండకపోవుటచేఁ జదువు మాన్పింపఁ జూచెను. అంతలో రాఘవాచార్యుని సోదరులలో నొకఁడు రమారమి యెనిమిది వందల రూపాయలు బాలుని చదువునిమిత్తమిచ్చి మృతినొందెను. ఏ యాధారములేని రాఘవాచార్యున కిది కొంతసహకారిగా నుండెను. కాని కొమరునిఁ జెన్నపురికిఁ బంపి విద్యాభ్యాసము సంపూర్ణముగఁ జేయించుటకిది చాలదయ్యెను. ఏమి చేయనగునని రాఘవాచార్యు లాలోచించుచుండ వానిబంధువుఁడు, చెన్నపట్టణమున మేజస్ట్రేటుగా నియమింపబడిన మొదటి హిందువుఁడునగు, వి. రాఘవాచారుల లనునతఁడు బాలుని విద్యాభ్యాసమునఁ గొంతసహాయముఁ జేయునట్లు వాగ్దానము చేసెను. అంతట రంగాచార్యులు చెన్న పట్టణమునఁ జదువ నారంభించెను.

విద్యార్థిగానున్న కాలమున రంగాచార్యులు వయసునకుఁదగని తెలివిగలవాఁడని పేరుపడెను. పెద్దవాండ్రు చదరంగ మాడుచుండ