పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

మహాపురుషుల జీవితములు



గవర్నరుగా నుండిన సర్ అలగ్జాండరు అర్బతునాటు ముత్తుస్వామి అయ్యరునకు తంజావూరుజిల్లా జడ్జిపనినీయదలచెను. కాని కలకత్తాలోఁ జెన్నపట్టణములో నుండిన తెల్లవారు వలనుపడదని చెప్పినందున మానవలసివచ్చె. 1878 వ సంవత్సరము జనవరినెలలో జరిగిన ఢిల్లీ దర్బారునకు దొరతనమువారు ముత్తుస్వామి అయ్యరు నాహ్వానముచేసి జ్ఞాపకార్థముగా వానికొక పతకమును బహుమానమిచ్చిరి. ఆ సంవత్సరమే వానికి సి. ఐ. యి. అను బిరుదము నిచ్చిరి. అప్పటికి చెన్నపట్టణపు గవర్నరుగారగు బకింగుహాంప్రభువుగారు వానికాబిరుదచిహ్నములను స్వయముగా నిచ్చి శ్లాఘించిరి. 1878 వ సంవత్సరమందే దొరతనమువారు ముత్తుస్వామి అయ్యరును హైకోర్టు జడ్జీని చేసిరి. చెన్నపురిరాజధానిలో స్వేదేశస్థులు హైకోర్టు పీఠ మెక్కుట కదియే ప్రథమము. ఆగవర్నరుగారు ముత్తుస్వామి అయ్యరునుగూర్చి యొక యుపన్యాసములో నీక్రిందివిధముగ జెప్పిరి. "ఆనరబుల్ శేషయ్యగారిని గవర్నర్ జనరల్‌గారి యాలోచనసభలో సభికునిచేయుటయు, ఆనరబుల్ ముత్తుస్వామి అయ్యరుగారిని హైకోర్టు పీఠ మెక్కించుటయు వారిని దగనిపదవిని నిల్పుటగాదు. తగనిగౌరవముచేయుట గాదు. అట్టివా రనేకులు కావలయు గావున వారి నవలంబించుటకు మీరు ప్రయత్నము జేయుఁడు"

ముత్తుస్వామి అయ్యరు హైకోర్టు పీఠమెక్కిన క్రొత్తలో దన సామర్థ్యముఁ దానెఱుఁగక కార్యనిర్వహణము గూర్చి కొంతకాలము భయపడజొచ్చెను. అతని భయమునకుదోడుగ మొదటనెతెల్లవారి వ్యాజ్య మొకటి విచారణకు వచ్చెను. ఒక తెల్లవాఁడువాగ్దానమును దప్పినాఁడని వానిమీఁదనభియోగముతేఁబడెను. ఇంగ్లీషువారి ఆచారవ్యవహారము లెఱుఁగనివాడగుటచేఁ బ్రమాదవశమున నెట్టి గొప్ప తప్పులుచేసి యపనిందపాలు కావలసివచ్చునో యని భయపడి జాగ్ర