పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

మహాపురుషుల జీవితములు



నాధిపతియై కార్య నిర్వాహము జేయుటయే గాక దేశీయసభతో గవర్నరులయొక్కయు గవర్నరు జనరల్ యొక్కయు నాలోచన సభలు పెద్దవి చేయవలయునని చక్కగా ముచ్చటించెను. మాధవరావు తన జీవితకాలములో గడపటి నాలుగైదేండ్లు హెర్బర్టుస్పెన్సరను మహాతత్వవేత్తయొక్క గ్రంథమును జదివి సాంఘిక రాజకీయ విషయములలో వానిమతమే మంచిదని యనుసరించుచువచ్చెను. ఇట్లు చదువుటతో తనివినొందక యతఁడు చెన్నపురమందలి వార్తా పత్రికలకు దరచుగా వ్యాసములు వ్రాసి పంపుచు వచ్చెను. ఆకాల మందాయన వ్రాతలకు మిక్కిలి గౌరవ ముండుటచే బత్రికాధిపతులు వాని లేఖలను గన్నుల నద్దుకొని గ్రహించుచు వచ్చిరి. ఇప్పుడె కాదు. మాధవరా వుద్యోగములో నున్నప్పుడు సయితము యెట్లో తీరిక చేసికొని పత్రికల కుపయుక్తమయిన సంగతులు వ్రాసిపంపుచు వచ్చెను. 1875 వ సంవత్సరమందీయన శుక్రగ్రహ సంచారమును గురించి యుపన్యాసము వ్రాయ దాని జదివి పశ్చిమఖండ జ్యోతిశ్శాస్త్రజ్ఞులు స్వదేశదైవజ్ఞులు వాని ఖగోళశాస్త్ర పాండిత్యమున కచ్చెరు వడిరి.

1888 వ సంవత్సరమున గవర్నరు జనరలగు డఫ్రన్‌ప్రభువు తన యాలోచనసభలో మాధవరావు నొక సభ్యుడుగ నుండుమని కోరెను. మాధవరావు వయస్సు ముదిరినకారణమున దాని కొప్పుకొనలేదు. 1889 వ సంవత్సరమున మాధవరావు స్వదేశబాలురకు విద్యనేర్పు విధమను పేరుపెట్టి యొక చిన్న పుస్తకమును వ్రాసెను. అది మనబాలురకు మిక్కిలి యుపయుక్తమయినది. ఆచిన్న పుస్తక మిప్పటికి ద్రవిడ మహారాష్ట్ర మళయాళ భాషలలోనికిఁ దరుజుమా జేయఁబడినది. ఆసంవత్సరమందే యితఁడు జర్మనీవారి యాఫ్రికా ఖండా క్రమణమును గూర్చి యొక చిన్న వ్యాసము వ్రాసి జర్మనీరాష్ట్ర