పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

మహాపురుషుల జీవితములు



ప్రజలకు గలిగించు పీడయెక్కువ. నేలపన్ను హెచ్చుగానున్న స్థలములఁదగ్గించి యతఁడు 1863-64 వ సంవత్సరములలో నెగుమతి దిగుమతి సరకులమీద విధింపబడిన పన్నులగూడ స్వల్పము చేసెను. మరుసటి సంవత్సరము కొచ్చిను రాజుతోడను నింగ్లీషుదొరతనము వారితోడను నతడు వాణిజ్యవిషయమున నొక యొడంబడిక చేసిఁకొనెను. ఆ యొడంబడికనుబట్టి యింగ్లీషు రాజ్యమునుండి కొచ్చిను సంస్థానమునుండి తిరువాన్కూరునకుబోవు సరకులను తిరువాన్కూరునుండి యా దేశమునకుఁ బోవు సరకులకును బన్నులు లేవు.

అట్లు మాధవరావు తిరువాన్కూరు సంస్థానమునకుఁ జేసిన యమితోపకారమునకు నింగ్లీషు దొరతనమువారు సంతసించి కె. సి. యస్. ఐ. యను బిరుదము వానికిచ్చిరి. అప్పుడు చెన్నపట్టణపు గవర్నరుగారుండిన నేపియర్ ప్రభువు మాధవరావును చెన్నపట్టణము రావించి యాబిరుదమును స్వయముగావచ్చి యిచ్చునప్పుడు విక్టోరియా రాణీగారు వాని చేసిన పనులకు మిక్కిలి సంతసించిరని చెప్పి పలు తెఱంగుల వాని గుణములం బొగడెను. ఆసంవత్సరమే మాధవరావు చెన్నపట్టణపు యూనివరిసిటీలో సభ్యుడయ్యెను. అట్లు చిరకాలము మంత్రిపదము వహించి దేశము క్రమస్థితిలోనికిదెచ్చి మాధవరావు హాయిగానుండదలప వాని తలఁపునకు వ్యాఘాతము సంభవించెను. మాధవరావుమీద గిట్టనివారు మహారాజుతో నెన్నో కొండెములు జెప్పి యాయన మనస్సు విరిచిరి. ఆ కొండెములు విని మహారాజు మునుపటియట్లనమ్మడయ్యె. అందుచేత మాధవరావు 1872 వ సంవత్సరమున మంత్రి యుద్యోగమును మానుకొనెను.

ఆమహామంత్రి చరిత్రమునందు బ్రథమాధ్యాయమింతతోముగిసెనని చెప్పవచ్చును. మాధవరావు తిరువాన్కూరులో నంధకారమయములగు ప్రదేశములందు వెలుతురు ప్రకాశింప జేసెను. అరాజకము