పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

మహాపురుషుల జీవితములు



నందును మిక్కిలి యభిరుచియుండెను. ఆ ఆయభిరుచిచేతనే రామవర్మ వటక్కు కొత్తరమనుపేర నొకమందిరమును నిర్మించి దాని చుట్టు మంచి పండ్లతోఁటలు పూఁదోటలు పంటచేలు వేయించి రాజయ్యు గృషీవలుఁడైఁ యుండెను. వంటక్కు కొత్తరమనగా నల్లుని మందిరమని యర్థము. ఈభవనమందు రామవర్మ దనజీవితమునఁ జాలకాలము గడపెను. అన్య దేశములలోఁ బండుధాన్యములు దుంపలు, పొగాకు మొదలగునవి తెప్పించి స్వదేశమున నాటించి యతఁడు కృషి వృద్ధిచేసెను. చిత్తరువులు వ్రాయుటలో నభిరుచి గలవారి కావిద్యలు నేర్పించి ముఖ్యముగా నీటితో రంగులువేయుట చమురుతో రంగులువేయుట నను రెండు కళల విషయమునఁ జాలపని చేసెను.

ఈనడుమ మాధవరావుగారు కొన్ని కారణములచేత సంస్థానములో దివానుపనిని మానుకొనిరి. రామవర్మ కాయన గురువగుట చేత గురుభక్తినిఁజూపుచు నతఁడు మాధవరావుగారిబుద్ధివి శేషమును గొనియాడుచు 'కలకత్తారివ్యూ' యను పత్రికకు మనోహరమయిన యుపన్యాస మొకటివ్రాసిపంపెను. ఆవ్రాత యానాటి విద్యావంతుల మనస్సుల నాకర్షించెను. అప్పటి గవర్నరు జనరలుగారగు నార్తుబ్రూకు ప్రభువుగా రది చదివి మాధవరావు రాజనీతి విశారదు డని గ్రహించి యిందూరు సంస్థాన ప్రభువగు హోల్కారునకు మంత్రి కావలసియుండగా మాధవరావు నంపిరి. ఆ గవర్నరు జనరల్ గారే రామవర్మ బుద్ధికుశలత గూడ గ్రహించి తన యాలోచన సభలో సభ్యుడుగా నుండుమని ఆయనను గోరిరి. కాని యనారోగ్యముచేత రామవర్మ దాని నంగీకరింపలేదు. 1874 వ సంవత్సరమున రామవర్మకు జబ్బుచేసి ప్రాణము మీదికివచ్చెను. అతడు జీవింపడనికొన్ని దినములు బంధువులు నిరాశచేసికొనిరి. ఎట్టెటో దైవానుగ్రహమున