పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సి. వి. రంగనాథశాస్త్రి

267



చుండ నంతలో హైకోర్టులో భాషాంతరీకరణము చేయువానియుద్యోగము కాళీయయ్యెను. హైకోర్టువారు పరీక్షచేసి తగినవారి కాయుద్యోగ మీయదలచిఁరి. రంగనాథుని ప్రాపకుడగు జడ్జీ హైకోర్టులోనే యున్నందున వెంటనే యతఁ డా సంగతి రంగనాథున కుత్తరము వ్రాసి తెలిపి శీఘ్రముగ దరఖాస్తు పంపుమనియెను. రంగనాథశాస్త్రి తన దరఖాస్తులోఁ దాను ద్రావిడము తెనుగు మరాటి కన్నడము హిందూస్తానీ పారసీ ఇంగ్లీషను నేడు భాషలలో లేశమైన దడుముకొనక తర్జుమాచేయగల్గినట్లు వ్రాసెను. దరఖాస్తు దారులలో నంతటి వా డెవ్వడు లేనందున నుద్యోగము వానికే నీయపడెను. హైకోర్టు తర్జుమాదారగుటచే రంగనాథుని ప్రజ్ఞలువెల్లడియగు నవసరము లనేకములు వచ్చెను. హైకోర్టుజడ్జీలు ప్రత్యక్షముగ వాని భాషాంతరీకరణముఁ జూచుచుండుటచే వాని సామర్థ్యము త్వరలోనే తెలిసెను. అందుచేత వారుతరుచుగ కోర్టులోనే వానిసామర్థ్యములు మెచ్చి పొగడుచువచ్చిరి. దక్షిణహిందూస్థానములోని భాషలన్నియు నేర్చి రంగనాథశాస్త్రి, విద్యాశక్తియధికముకాగా యూరపుఖండములోని భాషలను చదువనారంభించెను. ఆరంభించిన స్వల్పకాలములోనే ఫ్రెంచిలాటినుభాషలలో దృఢప్రవేశము కలిగెను. ఒకనాడు ఫ్రెంచిభాష మాటలాడగల మనుష్యుని కొఱకు హైకోర్టువారు వెదకుచుండిరి. అప్పుడు రంగనాథశాస్త్రి సిద్ధమయ్యెను. ఫ్రెంచి యతనికివచ్చునని యెవ్వరెరుంగకపోవుటచే వానిసాహసమునకు జడ్జీ తెల్లబోయి కానిమ్మని యవలీలగను స్వచ్ఛముగను రంగనాథుఁడు చేయు తర్జుమాచూచి యద్భుతము నొందెను. అది మొదలు జడ్జీలు వాని నొక తాబేదారుగఁ దలఁపక సమానుఁడగు మిత్రుఁడుగా భావింపసాగిరి. తరుచుగ వారు వానిని దమగృహములకు సగౌరవ