పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

మహాపురుషుల జీవితములు



కొన్ని పుచ్చుకొని కట్టగట్టి తనవారికి జూపుటకు సీమకు తీసుకొని పోయెను.

1854 వ సంవత్సరము జూలై నెలలో సేమరుదొరగారు పార్లమెంటులో హిందూదేశ ప్రసంగము వచ్చినపుడు హిందువులు హానికరములగు దుష్కార్యములు చేసినందుకేగాక పన్ను లిచ్చుకొనలేనందుకుగూడ గవర్నమెంటువారిచేత క్రూరముగ బాధింపబడు చున్నారని చెప్పెను. దేశము చూచివచ్చిన సేమరుదొర యట్టిబాధ లున్నవని చెప్పుచుండ మనదేశమెన్న డెఱుగని పార్ల మెంటుసభికులు చాలమంది యట్టిపీడలు హిందూదేశమున లేవనివాదించి యంతతో తనివినొందక వ్యర్థదోషారోపణముల జేయుటకు దేశమందలి మారు మూలలు తిరిగితివి గాబోలునని సేమరుదొరను నిందించి యధిక్షేపించిరి. ఇండియా బోర్డున కప్పుడు ప్రసెడెంటుగా నుండిన వుడ్డుదొరగారు మాత్రమది యబద్ధమై యుండదని దానింగూర్చి విచారణ చేయదలచి తద్విషయమున సాక్ష్యములు పుచ్చుకొమ్మని ప్రత్యేక మొక చిన్నసభ నేర్పరచెను. ఆసభవారు కొన్ని ప్రదేశములు తిరిగి యా విషయమున సాక్ష్యములు తీసికొని పార్ల మెంటు మహాసభకు పంపిరి. దొరతనమువారి విచారణ జరుగుచుండ యా విషయమున బ్రజల యభిప్రాయమునుగూడ యధికారులకు దెలియ జేయవలయునని లక్ష్మీనర్సు శెట్టి చాలమంది చేత వ్రాళ్ళుచేయించి యొక మహజరు పంపెను. ఇవి యన్నియు జేరినతోడనే పార్ల మెంటువారు పన్ను లిచ్చుకొనలేని జనులను బాధించుట దౌర్జన్యమని యట్టి దురాచారము నడంచిరి.

1852 వ సంవత్సరమున లక్ష్మీనర్సుశెట్టి ప్రేరణమున జెన్నపురి స్వదేశసంఘమువారు తమకష్టములన్నియుం బేర్కొని వానిని నివారింపుమని వేడుచు పార్ల మెంటువారికి మఱియొక మహజరంపిరి.