పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

మహాపురుషుల జీవితములు



ఖాను మరల నింగ్లీషువారి భూమి పుచ్చుకొనుటకు వచ్చువఱకు ననుమాట లాకాగితమందు మెలకువతో జేర్పించెను. పిమ్మట నింగ్లీషువారు నిరపాయముగా బోవ నాయూరు పితూరీదారు లాక్రమించిరి. పితూరీదారులలో ననేకులు తురకలగుటచే దెల్లవారితో జేరి యహమ్మదుఖాను తమప్రయత్నము విఫలము చేయుచున్నాడని స్వమతస్థులు వానిపై ద్వేషము బూనియుండిరి. అది కారణముగ బ్రాణభీతిజెంది యహమ్మదుఖాను మొదటహాలుదారు గ్రామమునకు బిదప మీరతుపట్టణమునకు బారిపోయి యచ్చట గూడ సురక్షితుఁడు గామి ఢిల్లీ ఇంగ్లీషువారి స్వాధీనమైన పిదప యక్కడికిని బారిపోయెను. ఈ సిపాయి పితూరీలో నితఁడు చేసిన యుపకారమునకుఁ గృతజ్ఞులై దొరతనమువారు రెండు తరములవఱకు నెలకు రెండువందల రూపాయలచొప్పున వాని కుటుంబమునకు భరణ మేర్పరచి వానికిఁ జాల బిరుదులు నిచ్చిరి. ఈవిధములైన సత్కారములు వానికిఁ జేయవలసినదని షేక్స్పియరు దొరగారు దొరతనము వారికి గట్టిగా సిపారసు చేసిరి.

ఆ పితూరీ ముగిసిన వెనుక నహమదుఖాను పితూరీవచ్చుటకు ముఖ్యకారణముల నొక పుస్తకముగ హిందూస్థానీభాషలో వ్రాసెను. ఆ గ్రంథము నతఁడు పేర్కొన్న ముఖ్యకారణము లివి. 1 ప్రజలు దొరతనమువారి యభిప్రాయములను దెలిసికొనక యపోహపడుట. 2. ప్రజల పూర్వాచార వ్యవహారములకు విరుద్ధముగ నుండునట్టి చట్టములను దొరతనమువారు నిర్మించుట. 3. ప్రజల యాలోచనలను వారి యాచారపద్ధతులను గవర్నమెంటువారు తెలిసికొనక పోవుట. 4 మంచి పాలనమునకు ననుకూలమగు విషయములను దొరతనమువారు శ్రద్ధచేసి కనుఁగొనకపోవుట. 5. సైన్యమునందు దొరతనమువారిమీఁద నసహ్యము కలుగుట. అయోధ్య రాజ్యమును నవాబుల