పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్ సయ్యదు మహమ్మదుఖాను

సయ్యదు మహమ్మదుఖాను 1813 వ సంవత్సరము 17 వ అక్టోబరు తారీఖున ఢిల్లీలో జన్మమొందెను. అతని పూర్వులు మొగలాయి చక్రవర్తులవద్ద గొప్ప యుద్యోగములు చేయుచువచ్చిరి. ఆతనితండ్రి సయ్యదు మహమ్మదుటర్కీ ఢిల్లీచక్రవర్తియగు రెండవయక్బరునకు బ్రాణమిత్రుఁడై యుండెను. ఈ టర్కీమహమ్మదుగారే యా చక్రవర్తవద్ద మంత్రియై యుండెను. ఆ మంత్రి మృతినొందినప్పుడు చక్రవర్తియైన రెండవ షాలం గతించిన మంత్రియొక్క బిరుదులు మొదలగునవి మహమ్మదు టర్కీకి నియ్యదలంచెను. కాని టర్కీ యవి తన కక్కరలేదని చెప్పెను. మహమ్మదుటర్కీ 1836 వ సంవత్సరమున మృతి నొందెను. అప్పటికి సయ్యదు మహమ్మదుఖాను పందొమ్మిదేండ్ల ప్రాయము గలవాఁడైనను గడపటి ఢిల్లీ చక్రవర్తియగు బహదూరుషా మాతామహుని బిరుదులన్నియు వానికిచ్చి యనుగ్రహము చూపెను.

అహమ్మదుఖాను పసిబిడ్డయైనపుడు తల్లినోటనుండియే చదువు నేర్చుకొనెను. అతఁడు పగలు నేర్చుకొన్న చదువంతయు వాని తల్లి రాత్రి వానివద్ద నప్పగించుకొనుచు వచ్చెనట. అతఁడు యింగ్లీషు నేర్చుకొనలేదు. నేర్చుకొన్న స్వభాషావిద్యయు పితృమరణమువలన గాబోలు 1837 వ సంవత్సరమున సమాప్తి యయ్యెను. అందుచేత నతఁడా సంవత్సరమున నుద్యోగమునకై బ్రయత్నించి ఢిల్లీలోనున్న సర్కారువారి సాదరమీను కోర్టులో స్తిరస్తదారుగ బ్రవేశించెను. అతఁ డుద్యోగమున ప్రవేశించిన స్వల్పకాలములోనే యభివృద్ధిని పొందెను. అపనిలోఁ బ్రవేశించిన రెండేండ్లకే యాగ్రా కమీషనరు