పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

మహాపురుషుల జీవితములు



అతఁడు జనులవిశ్వాసమునకుఁ బాత్రుడై యెల్లవిషయముల వారి కాలమునందు నాయకుఁడైయుండెను. 1805 వ సంవత్సరమందుదొరతనమువారతనికి "జస్టిసుఆఫ్‌దిపీస్" అను గౌరవోద్యోగమునిచ్చిరి. ఇది బెంచిమేస్ట్రీటు మునిసిపల్ కమీషను మొదలగు నుద్యోగములవలె జీతములేనిదె గౌరవమున కధికారముగలదై యుండును. ఆ కాలమందు బొంబాయిలో మునిసిపాల్టీ యేర్పడనందున నగరము యొక్క పారిశుధ్యమును విచారించు నధికారమీ జస్టిసునందే యుండెను. ఈ జస్టిసులందఱికిని నొక ప్రధాన పురుషుని దొరతనము వారేర్పరచి కార్యనిర్వాహక మంతయు వానికప్పగించిరి. అతఁడు మిక్కిలి బుద్ధిశాలియు లోకానుభవము గలవాఁడునయినను ధనమనావశ్యకముగా వ్యయముచేయుటయు నప్పుడప్పు డపహరించుటయు మొదలగు దురభ్యాసముల కలవడెను. విశ్వనాధనారాయణ మండలికుఁడు వాని చెడుచేతలకిష్టపడక యెదిరించి వానిగుట్టు బయలుపెట్టఁ జూచెను. స్థితిగతులు బొత్తుగ చెడిపోయినవని దొరతనమువారు గ్రహించి 1872 వ సంవత్సరమున మునిసిపాలిటీయేర్పరచి బొంబాయి నగరమును జస్టిసులచేతిలోనుండి తప్పించి యా మునిసిపాలిటి కప్పగించిరి. మండలీకుఁడీసభలో ప్రధానసభికుఁడై యుండెను.

1879 వ సంవత్సరమందును మరల నెనుబదియవ సంవత్సరమందును మండలీకుఁడు బొంబాయి మునిసిపల్ చేర్మన్‌గా నియమింపబఁడెను. బొంబాయివంటి మహానగరమందు నంతటియధికారముచేయుట మిక్కిలికష్టమైనను మండలీకుఁడు నిష్పక్షపాతముగను న్యాయముగను జనసమ్మతముగను వ్యవహరించెను. 1862 వ సంవత్సరమం దతఁడు బొంబాయి యూనివర్సిటిలో సభికుఁడయ్యెను. అందుండి పలుమారు లాయన మహారాష్ట్రభాషలో సింధుభాష