పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథ నారాయణ మండలికుఁడు

మహారాష్ట్రమందలి కొంకణగిరి జిల్లాలోఁ మురుదాయను నొకగ్రామము గలదు. విశ్వనాథ నారాయణ మండలికుఁడు 1833 మార్చి 8 వ తారీఖున జన్మించెను. ఈమండలీక కుటుంబము పూర్వకాలమునందు శ్రీమంతులగు పీష్యాలతో సంబంధబాంధవ్యంబులు కలిగియుండుటచే మిగుల గౌరవాస్పదమైనది. ఈతని ముత్తాత పీష్వాలవద్ద నొకమండలమునకు సుబేదారుగానుండెను. ఈ మండలికుఁడు మొట్టమొదట నక్షరాభ్యాసము తనతాతయగు దుండిపంటు వద్ద చేసి యనంతరము గ్రామపాఠశాలలోఁ జేరెను. అక్కడ కొన్ని నాళ్ళు గడచుటయుఁ దలితండ్రులు వాని కింగ్లీషు చెప్పించుటకై రత్నగిరికిఁ బంపిరి. అతని యదృష్టవశమున నచ్చటపాఠశాలలోనుపాద్యాయ శిరోమణియగు రావుబహదూరు రామచంద్రబాలకృష్ణుఁ డనునతఁడు ప్రధానోపాధ్యాయుఁడై యుండుటచే నక్కడ యున్నంత వఱకు విద్యఁ జక్కగ నేర్చి పిమ్మట బొంబాయికిఁ బోయి యెల్ఫినిష్టనుపాఠశాలలో నతఁడుచేరెను. పూవుపుట్టగానే పరిమళించునన్నట్లు మండలికుఁడు విద్యార్థియై యున్ననాఁడె తెలివికిఁ బ్రసిద్ధొకెక్కి ఫీజుస్కాలరుషిప్పును పేరుగల విద్యార్థి వేతనమును సంపాదించెను. అక్కడ నుపాధ్యాయులుగానున్న దొరలనేకులు తెలివితేటలంబట్టి యాబాలునిమీఁది నెంతయు నభిమానముఁబూనిరి. ఆపాఠశాలలోని యొజ్జల కతనిమీఁద నెంతయభిమానము నెంతగౌరవము గలవో యీ క్రిందిపనివలనం దెలియవచ్చును.

ఆ బడిలోనున్న గణితశాస్త్రపండితుఁ డొకమాసము సెలవు పుచ్చుకొనెను. మంటలీకు డప్పటికింకను విద్యార్థియై యుండినను పాఠశాలాధికారు లామాసముదినములు పనిచేయుటకు బాలుఁడని యెంచక వానినే నియమించిరి. పాఠశాలాధికారులు వాని ప్రజ్ఞకు