పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

మహాపురుషుల జీవితములు



మున నీపండిత శిఖామణి హుగ్లీ, నద్యా మొదలగు నాలుగు జిల్లాలకు పాఠశాలా పరీక్షాధికారిగ నియమింపఁబడి నెల కయిదువందల రూపాయిల జీతము నార్జింప నారంభించెను. ఈయుద్యోగమునం దున్న పుడె యాతఁడు హుగ్లీ బర్డ్వాన్ మండలములలో నలువది బాలికా పాఠశాలలు స్థాపించెను.

ఆకాలమున బంగాళాదేశమునందలి పాఠశాలలకు "యంగ్" అనునొక దొరగారు డైరెక్టరుగానుండిరి. ఆయన ఇంచుక యధికార గర్వము గలవాఁడగుటచే స్వతంత్రబుద్ధిగల విద్యాసాగరునకు తనపై యధికారితో సరిపడక పొరపులు గలుగుచు వచ్చెను. ఇట్లు క్రమ క్రమముగ మనస్పర్ధ లధికమగుచుండ నొకనాఁడు దొరగారు విద్యాసాగరునిం బిలిచి హిందూకళాశాల ప్రధానోపాధ్యాయుని యొద్దకు బోయి యొకమాట చెప్పిరమ్మని యాజ్ఞాపించెను. విద్యాసాగరున కాపని స్వగౌరవ భంగకరముగాఁ దోఁచినందునఁ తనతో దొరగారు గూడ వచ్చిన యెడల దానచ్చోటికిఁ బోవుదుననియు దానొక్కఁడు బోనొల్లననియు నతఁ డుత్తరము చెప్పెను. విద్యాశాఖకెల్ల సరా కారియగు తన్నుఁ దనచేతిక్రింది యుద్యోగస్థుఁడు తిరస్కరించుటచే దొరగారుకోపించి నీవిది చేయకతప్పదని విద్యాసాగరునితోఁ బలికెను. విద్యాసాగరుఁడు వెంటనే జేబులోనుంచి యొక కాగితముఁదీసి తన యుద్యోగమునకు విడుదల యడిగెను. బంగాళాదేశపు గవర్న రగు 'హాలిడే' యను నాతఁ డీశ్వర చంద్రునకు నాప్తమిత్రుడగుటచే నుద్యోగమును మానుకొన వలదని యతఁ డెన్ని విధములనో విద్యాసాగరుని బ్రతిమాలెను ; కాని వాని ప్రార్థనలు విద్యాసాగరుని నిశ్చల చిత్తమును జలింపఁ జాలవయ్యెను.

ఈవిధముగ దొరతనమువారి కొలువు కట్టడముసేయక నడుమనే ముగించి విద్యాసాగరుఁడు నిర్వ్యాపారుండుగాక తన దేశమునకు మునుపటికంటె నింకను మిక్కిలిగానుపకారమును జేయఁగలవాఁడయ్యె