పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

13



నాధ బెనర్జీగారి తండ్రిగారగు దుర్గచరణ బెనర్జీగారి సహాయమున నీశ్వరచంద్రుఁ డప్పు డప్పుడు మిగుల శ్రద్ధతో నాంగ్లేయభాష నభ్యసించెను. 1846 వ సంవత్సరమున సంస్కృతకళాశాల కతఁడు సహాయ కార్యదర్శిగా నియమింపఁబడి యా యుద్యోగమున నున్నప్పుడే విఠ్ఠల పంచవిశంతి యలు బంగాళీ వచన కావ్యము నొకదానిని వ్రాసి ప్రచురించెను.

ఈశ్వర చంద్రుని పరిశుద్ధశైలియు, రచనా చమత్కృతియుఁ గనుఁగొని దేశస్థు లందఱు బంగాళీభాషనంత రసవంతముగ మనోహరముగ వ్రాయుటకు వీలున్నదని యప్పుడు గ్రహించిరి. ఆ యుద్యోగమున నున్నపు డాయన పలుమార్పులఁ దెచ్చి కళాశాలను వృద్ధినొందించెను గాని చిరకాలముండలేదు. 1849 వ సంవత్సరము నతఁడు ఫోర్టువిలియమ్ కళాశాలలో నెల కెనుబది రూపాయలుజీతము గల మొదటి గుమాస్తాగానే ప్రవేశించి యచట నున్న కాలములోనే స్త్రీవిద్యావిషయమున నాదినములలో గడుబరిశ్రమచేసిన బెత్యూన్ దొరగారి స్నేహము సంపాదించెను. మరుచటి సంవత్సరమున మరల నతఁడు సంస్కృత కళాశాలలో తొంబది రూపాయల జీతముగల పండితుఁడుగాఁజేరి కొలఁది కాలములోనే యాకళాశాల ప్రధానోపాధ్యాయుఁ డయ్యెను. మనపండితులు సంస్కృతభాషను విద్యార్థులకు సుబోధకమగునట్లు తెలుపలేక శిష్యులను బాధబెట్టి తాము బాధ పడుటఁజూచి విద్యాసాగరుఁడు సంస్కృత కళాశాలకుఁ బధానోపాధ్యాయుఁడుగా నున్న కాలమున గీర్వాణభాషను బాలురు చుల్కనఁగ నేర్చుకొనుటకుఁ గొన్ని పద్ధతులఁ గనిపెట్టెను. నాటనుండియు సంస్కృత విద్యాభ్యాసము సులభ సాధ్యమయ్యె. 1851 వ సంవత్సరమున వానిమిత్రుడగు బెత్యూన్‌దొర కాలధర్మమునొంది నప్పటి బంగాళాదేశపు గవర్నరు హాలిడే యను నతఁడు బెత్యూన్ పాఠశాలకు విద్యాసాగరు నధికారిగా నేర్పరచెను. 1885 వ సంవత్సర