పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజారామమోహనరాయలు

5



గవర్నరుజనరలుగారగు లార్డువిలియంబెంటింకుదొరగారు రామమోహనరాయల వాదములు యుక్తియుక్తములుగ నున్నవని గ్రహించి లోకోపకారకమగు నతనియుద్యమమునకుఁ దోడ్పడి యాదురాచార పిశాచము నడుగంటద్రొక్కందలంచి 1829 వ సంవత్సరము డిశంబరు నాలుగవ తారీఖున సహగమనము నిషేధించుచు నొక చట్టమునిర్మించి పుణ్యము గట్టుకొనెను. చూచుటకు, వినుటకు : దలఁచుకొనుటకు సయితము నతిదారుణమగు నీయాచారమును నిర్మూలము చేసిన మహానుభావుఁడు రామమోహనరాయలగుటచే భరతఖండమునందలి స్త్రీ పురుషు లందఱు నా చంద్రతారకముగ నతనికిఁ గృతజ్ఞులయి యుందురుగాక ! రామమోహనరాయలు కలకత్తాకువచ్చినక్రొత్తలో వేదాంతశాస్త్రమును వేదాంతసారమును బంగాళీభాషలోనికిఁ తర్జుమా చేసెను. 1816-17 వ సంవత్సరములలో నతఁడు ముఖ్యములగు నుపనిషత్తుల నింగ్లీషుభాషలోనికి బంగాళీభాషలోనికి భాషాంతరీకరించెను. ఇట్లు వేదాంతరహస్యముల బయలుపరచినందుకు పూర్వాచారపరాయణులు రామమోహనుని నిందింపనారంభించిరి. ఈమహాత్ముఁడు సంస్కృతముఁజదివి వేదశాస్త్రముల శోధించుటయేగాక అరబ్బీభాష నేర్చుకొని తురకల వేదమగు ఖొరాను చదివి, హీబ్రూ, గ్రీకుభాషల నేర్చుకొని క్రైస్తవులవేదమగు బైబిలు పఠించి తద్గ్రంథముల సారములు గ్రహించి దోషముల బైలుపెట్ట నారంభించెను. 1820 వ సంవత్సరమున నితఁడు యేసుక్రీస్తు, ధర్మములను గూర్చి, బంగాళీ సంస్కృతభాషలలో గ్రంథములు వ్రాసి ప్రకటించి యందు క్రీస్తు మతగురవగునుగాని, దేవునికుమారుఁడగుట యబద్ధమని వ్రాసెను. ఇందుచే నచ్చటి క్రైస్తవమతబోధకులకును, రామమోహనునకును గొప్ప వివాదములు బైలు దేర క్రైస్తవులు వ్రాసిన దానికి రామమోహనుఁడును, రామమోహనుడు వ్రాసినదానికి క్రైస్తవులును యుత్తరప్రత్యుత్తరముల నిచ్చుకొనుచు వచ్చిరి. ఇంత