పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణాజిల్లాకాంగ్రెసుసంఘమునుండి విడిపోయి, గుంటూరుజిల్లాలోని కాంగ్రెసువాదులు గుంటూరుజిల్లాసంఘము ప్రత్యేకముగ నేర్పరచవలెనని ఉద్యుక్తులగుచుండిరి.

సొంతవ్యవహారములు

ఒకనాడు పాతగుంటూరు వెళ్లునప్పటికి నాతమ్ములిరువురును బిగ్గరగ అరచుచు తగవాడుచుండుటయేగాక ఒకరినొకరు కొట్టుకొనబోవుచుండిరి. నే నప్పు డిరువురను విడిపించి అట్లు బజారున బడుట అవమాన మని చెప్పి శాంతింపజేసితిని. కాని వారిరువురమధ్య సరిపడక మధ్యమధ్య తగవులాడుచునేయుండిరి. వారి భార్యలమధ్య మనస్పర్ధ లేర్పడెను. మా తండ్రిగారికి వీరిర్వురు నొకచోట కాపురముచేయజాల రని తోచెను. కుటుంబపు టాస్తిని పంపకముచేసి వేరింటికాపురములు పెట్టుటకు నిర్ధారణచేసుకొనిరి. "నీ వేమనియెద" వని నన్ను ప్రశ్నించిరి. నేను వారితో నేకీభవించితిని. భాగములు పరిష్కరించుటకు నా భార్యమేనమామగారైన మద్దులూరి సీతారామయ్యగారిని పిలిపించవలసినదని వారు సెలవిచ్చిరి. నా తమ్ముని భార్య నా భార్యకు పెదతల్లికుమార్తెయే గాన సీతారామయ్యగారు నాచినతమ్మునకు అనుకూలురే. పెదతమ్ముడు సూర్యనారాయణ చిన్నవానికంటె కొంతపరిజ్ఞానము కలవాడు కాన సీతారామయ్యగారి మధ్యవర్తిత్వము నంగీకరించెను. కుటుంబపు టాస్తిలో నాకు భాగము పంచనక్కరలేదు, తమ్ము లిరువురకే సమముగా పంచివేయవలసినదని మాతండ్రిగారితో చెప్పితిని. వా రందుకు