నుండియే ఆంధ్రజాతీయకళాశాలకు దుర్దశ ప్రారంభమైనది. సాలునకు పదివేలరూప్యముల ఆదాయము వచ్చు భూవసతి దానికిగలదు. గాంధిమహాత్మునకు కళాశాలయందును అందు పనిచేయు పట్టాభి సీతారామయ్య, హనుమంతరావు, కృష్ణరావులయందును గల అభిమానముచేత కాంగ్రెసుచే పదునారు వేలరూపాయల నొక్కసారిగ విరాళమిప్పించిరి. ద్రవ్యానుకూలమెంత యున్నను ప్రజలలో నిజమైన జాతీయవిద్యాభిమానము లేమిచే కళాశాలోద్దేశములు నెరవేరవాయెను. నేడు స్వరాజ్యము స్వాతంత్ర్యము లభించినవి గాన ఈకళాశాలలో జాతీయవిద్యతోపాటు స్వతంత్రముగ జీవితముజరుపుటకు తోడ్పడగల చేతిపనులను నేర్పు ఏర్పాటులు జరుపుటకు ప్రభుత్వము శ్రద్ధ వహింపదగును.
అనాదిసిద్ధమైన వంగజాతి ఐక్యమునకు భంగముగావించి దాని ప్రాధాన్యమును గౌరవమును నశింపజేయుటకు కర్జను ప్రభువు చేసిన ఈ దుష్ప్రయత్నము ఆయన యనంతరమున హార్డింజి హయాములో ప్రభుత్వము విడనాడవలసివచ్చెను. పూర్తికాబడిన విభజన మరల మార్చబడదని ప్రతిజ్ఞాపూర్వకముగ ఇండియాకార్యదర్శి వచించిన వాక్యము మరల దిగమ్రింగవలసివచ్చెను.
ఆంధ్రోద్యమబీజములు
గవర్నరుజనరల్ హార్డింజి "ఒక్కభాషయు, ఒక్క మతమును, ఒక్క సంస్కృతియు గల జనులు ఏకముగ