పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి

                    సాభార్యాయా శుచి ర్దక్షా సాభార్యా యా పతివ్రతా
                    సాభార్యాయా పతిప్రీతా సాభార్యా సత్యవాదినీ. [1]

పద్మావతి జగన్నాధ నివాసస్థుఁడగు అగ్ని హోత్రుఁడనువిప్రుని కూఁతురు. జయదేవుఁ డను మహాకవిభార్య. ఈమె పాతి వ్రత్యమునందు మిగుల ప్రసిద్ధిఁ గాంచెను. పద్మావతి మిగులసౌందర్యవతియు గుణవతియు నైనందున నామెజనకుఁ డామెకుఁ దగినవరుని విచారించి వివాహము చేయనిశ్చయించెను. అంతఁ గొన్నిదినములకు జగన్నాధమునకు బిల్వా యను గ్రామములో నుండిన నారాయణభట్టను బ్రాహ్మణుని కుమారుఁడగు జయదేవుఁడు సకల సద్గుణపరిపూర్ణుఁ డనియుఁ దగిన వరుఁ డనియు దెలిసినందున బీదవాఁడని శంకింపక యాయగ్ని హోత్రి పద్మావతి నాతని కిచ్చి వివాహము చేసెను. వివాహానంతర మాదంపతులు మిగుల నైక్యము గలిగి కాపురము చేయుచుండిరి. పద్మావతి తమకుఁ గలదానిలోనే కాపురము మిగుల చక్కఁగాఁ గడపుచుండెను. ఆమె పూర్వకాలపు పతివ్రతలకధలు చదివియు వినియుఁ దాను వారివలెనే ప్రవర్తించుటకు నెల్లప్పుడు యత్నించుచుండెను. కాన పరమభక్తుఁడగు

  1. పవిత్రురాలును చాతుర్యవతియునై పతివ్రతయయి భర్త్రనుగ్రహము వడసి సత్యము పలుకునట్టిదియే సద్భార్య యనఁదగు.