పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

అబలాసచ్చరిత్ర రత్నమాల.

పుత్రులగు నానాసాహేబు, రావుసాహెబు లాకాలమునందు బాలురేగాన వారితో నీ చిన్నది సదా కలిసి మెలసి యుండుచు వచ్చెను. నానాసాహేబేమి నేర్చిన నది మనూబాయి నేర్చుకొనుచు, వా రిద్ద ఱన్న చెల్లెలివరుసలతోఁ బిలుచుకొనుచుండిరి. చదువు, అశ్వారోహణము, ఖడ్గముత్రిప్పుట మొదలయిన వన్నియు మనూబాయి నానాసాహేబుగారితోడనే నేర్చుకొనెను. ఈమె స్వభావము బాల్యమునుండియే శౌర్యగుణప్రధానముగా నుండెను. దీని కంతకు క్షత్రియాగ్రగణ్య గుణములు గలశూరుల సంసర్గమే కారణము. ఇందువలన స్త్రీలు స్వభావముచేతనే పిఱికివారనియు, వారికి శౌర్యధైర్యము లెన్నివిధములను పట్టువడనేర వనియు వాదించు విద్వాంసులకు సంశయనివృత్తి కాఁగలదు. స్త్రీలకును పురుషులవలెనే బాల్యమునుండి యెట్టిసంస్కరణ జరుగునో యట్టిగుణములే యబ్బునని సిద్ధమగును.

ఇట్లుండ నొకనాఁ డాకస్మికముగా ఝాఁశీ సంస్థానమునందలి జ్యోతిష్కుఁడగు తాత్యాదీక్షితులు బాజీరావును సందర్శింపవచ్చెను. ఆదీక్షితులతో సందర్భానుసారముగా మోరోపంతుగారు ఝాఁశీవైపున మాచిన్నదానికి వరుఁడు కుదురునాయని విచారించెను. అందు కాయన "ఝాఁశీ సంస్థానాధీశ్వరుఁ డగు గంగాధరరావు బాబాసాహేబుగారికిఁ బ్రధమ పత్ని యగురమాబాయి కాలధర్మము నొందెను. కాన నీ కొమర్తె కాసంబంధము విచారింపు" మని చెప్పెను. తదనంతర మీవివాహమునుగుఱించి బాజీరావు గంగాధర రావుకుఁ దెలుపఁగా నాతఁడు సమ్మతించెను. లగ్న నిశ్చయమైన పిదపఁ