శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదియెనిమిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదియెనిమిదవ అధ్యాయము)



శ్రీసాయిసచ్ఛరిత్రము నలుబదియెనిమిదవ అధ్యాయము : భక్తుల ఆపదలు బావుట :1.శేవడే 2. నపత్నేకరుల కధలు

ఈ యధ్యాయము ప్రారంభింఛునప్పు డెవరో హేమాడ్పంతును "బాబ గురువా? లేక సద్గురువా?" యని ప్రశ్నింఛిరి. ఆ ప్రశ్నకు సమాధాన మిచ్చుటకైసద్గురువు లక్షణములను హేమాడ్పంతు ఇట్లు వర్ణించుచున్నారు.

సద్గురుని లక్షణములు:

ఎవరు మనకు వేదవేదాంతములను షట్ శాస్త్రములను బోధింఛెదరో,ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాసనిశ్వాసములను బంధించదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా నుపన్యసింఛెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పున:శ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవితపరమావధిని బోధించగలరో,కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు.ఎవరయితే చక్కని సంభాషణలవల్ల మనకు ఇహపరసుఖములందు వరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మసాక్షాత్కారమందుమన కభిరుచికలుగునట్లుజేసెదరో,యెవరైతే ఆత్మాసాక్షాత్కార విషయమున పుస్తకగ్యానమేగాక ఆచరణయం దనుభవము కూడ పొంది యున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగ పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదింఛగలరు? సద్గురువు స్వప్నమందయినను శిష్యులనుండి సేవనుగాని ప్రతిఫలమునుగాని యాశింఛడు.దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచను. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావింఛడు.సద్గురువు తన శిష్యుని కొడుకువలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా జూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా జూచును.సద్గురుని మిఖ్యలక్షణ మేమన, వారు శాంతమున కునికిపట్టు. వారెన్నడు చాపల్యమునుగాని చికాకుగాని చెందరు. తమపాండిత్యమునకు వారు గర్వించరు.ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.

హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుక్రుతముచే సాయిబాబ వంటి సద్గురువు ఆశీర్వాదమును, సహవాసమును పొందెనని తలంచెను.బాబా యవ్వనమందు కూడ ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబముగాని స్నేహితులుగాని, యిల్లుగాని,ఎట్టి యాధారముగాని లేకుండెను.18 ఏండ్ల వయస్సునుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి.వారొంటరిగా,నిర్భయముగా నుండెడివారు.వారెల్లపు డాత్మానుసంధానమందు మునిగి యుండెడివారు.భక్తుల స్వచ్ఛమైన యభిమానమును జూచివారి మేలుకొరకేవైన చేయుచుండెడివారు.ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి యుండెడివారు.వారు భోఉతికశరీరముతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ యనుభవముల నిచ్చుచుండిరో, యట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మటకూద వారి పై నాధారపడిన భక్తులకిప్పటికినీ నొసగుచున్నారు.అందుచేభక్త్లు చేయవలసిన దేమన - భక్తి విశ్వాసములనెడు హ్రుదయదీపమును సరిచేయ వలెను.ప్రేమయను వత్తిని వెలిగింఛవలెను.ఎప్పుడిట్లు చేసెదరో,యప్పుదడు గ్యానమనే జుఓతి(ఆత్మ సాక్షాత్కారము)వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రాకసించును. ప్రేమలేని గ్యానము ఉత్తది.అట్టి గ్యానమెవరికి అక్కరలేదు.ప్రేమలేనిచో సంత్రుప్తి యుండదు.కనుక మనకు అవిఛ్ఛిన్నమైన అపరిమితప్రేమ యుండవలెను. ప్రేమను మన మెట్లు పొగడగలము?ప్రతి వస్తువు దాని యెదఉట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ యనునదే లేనియెడలచదువుటగాని,వినుటగాని,నేర్చుకొనుటగాని నిష్ఫలములు.ప్రేమ యనునది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి స్వేఛ్ఛలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనిని గూర్చిగాని మిక్కిలిచింతించనిదే దానియందుమనకు ప్రేమ కలుగదు. యదార్ధమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును.అదియే ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ యధ్యాయములో చ్చెప్పవలసిన ముఖ్యకదను పరిశీలించెదము.స్వచ్ఛమైన మనస్సుతోనెవరైనను యోగీశ్వరుని వద్దకు బోయి వారి పాదములపై బడినచో, తుట్టతుద కతడు రక్షింపబడును.ఈ విషయము దిగువ కధవలన విశదపడును.

శేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి, సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను.తోటి విధ్యార్ధి శేవడే అతనితో చేరెను.ఇతర విధ్యార్ధులు కూడ గూమిగూడి తమ పాటములు గ్యానము సరిగా నున్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన శేవడే కు ఏమియు రానట్లు తోచెను.తక్కిన విధ్యార్ధులు అతనిని వెక్కిరించిరి.అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తనయందు సాయిబాబ క్రుప యుండుటచే ఉత్తీర్ణుడనగుదుననిచెప్పెను.అందుకు సపత్నేకర్ యాశ్చర్యపడెను.సాయిబాబ యెవరు?వారినేల యంత పొగడుచున్నావు? అని అడిగెను.అందువలన శేవడే యిట్లనెను. "శిరిడీ మసీదులో నొక ఫకీరు గలరు.వారు గొప్ప సత్పురుషులు, యోగులితరు లున్నను ,వారమోఘమైన వారు.పూర్వజన్మ సుక్రుతమున్నగాని, మనము వారిని దర్సించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను.వారు పలుకునది యెన్నడు అసత్యము కానేరదు.నేను పరీక్షలో తప్పక యుత్తీర్ణుడ నగుదునని వారు నన్ను ఆశీర్వదించి యున్నారు.కనుక వారి క్రుపచే తప్పక చివరి పరీక్షయందుత్తీర్ణుడ నయ్యద " ననెను.నపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడ వెక్కిరించెను.

నపత్నేకర్ దంపతులు

నపత్నేకర్ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను.అక్కల్ కోటలో వ్రుత్తిని ప్రారంభించి యచట న్యాయవాది యాయెను.పది సంవత్సరముల పిమ్మట అనగా 1913 లో వానికి గల యొకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయను.అందువలన అతనిమనస్సు వకలమయ్యెను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్ధము పోయి శాంతి పొందవలెననుకొనెను.కాని యతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని యదికూడ సహాయపడలేదు.అంతలో శేవడే మాటలు అతనికి బాబాయందుగల భక్తియు జ్గ్యప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడ శిరిడికి పోయి శ్రీసాయిని చూడవలె ననుకొనెను.అతడు తన సోదరుడగు పండితరావుతో శిరిడికి వెళ్ళెను.దూరమునుండియే బాబా దర్శనము చేసి సంతసించెను.గొప్ప భక్తితో బాబా వద్దకేగి యొక టెంకాయ నచట బెట్టి, బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసెను."బయటకు పొమ్ము!" అని బాబా అరచెను.నపత్నేకర్ తలవంచుకొని కొంచెము బెనుకకు జరిగి యచట కూర్చుండెను.బాబా కటాక్షమును పొందుట కెవరి సలహాయైన తీసుకొనుటకు యత్నించెను.కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి.బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో బెట్టి యదెవరిదని యడిగెను.దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ నపత్నేకర్ వయిపు చూపెను.బాబా నవ్వగా నచటివారందరునవ్విరి.బాలాఆ నవ్వుయెక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు నపత్నేకర్ ను దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయుమనెను.నపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా, బాబా తిరిగి వెడలి పొమ్మని యరచెను.నపత్నేకర్ కు కేమి చేయవలెనో తోచకుండెను.అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి.మసీదు ఖాళీ చేయుమని బాబా నపత్నేకర్ ఆగ్యాపించెను.ఇద్దరు విచారముతో నిరాశజెందిరి. బాబా యాగ్యను పాలించవలసి యుండుటచే నపత్నేకర్ శిరిడీ విడువవలసి వచ్చెను.ఇంకొకసారి వచ్చినప్పుడైన దర్శన మివ్వవలెనని అతడు బాబాను వేడెను.


నపత్నేకర్ భార్య ఒక సంవత్సరము గడిచెను.కాని అతని మనసు సాంతి పొందకుండెను.అతడు గాణగాపురమ్ వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను.విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను,తుదకు కాశీ వెళ్ళెటకు నిశ్చయించుకొనెను.బయలు దేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకొక స్వప్నద్రుశ్యము గనపడెను.స్వప్నములో నామె నీళ్ళ కొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను.అచ్చట నొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని,వేపచెట్టు మొదట కూర్చున్నవారు తనవద్దకు వచ్చి " ఓ అమ్మాయి!అనవసరుముగా శ్రమపడెద వేల? నేను స్వచ్చజలముతో నీ కుండ నింపెదను" అనెను. ఆమె ఫకీరుకు భయపడి,ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయెను.ఫకీరు ఆమెను వెన్నంటెను.ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను.ఆమె తన కలను భర్తకు జెప్పెను.అదియే శుభశకున మనుకొని యిద్దరు శిరిడీకి బయలుదేరిరి.వారు మసీదు చేరునప్పటికి బాబా యక్కడ లేకుండెను.వారు లెండీతోటకు వెళ్ళియుండిరి.బాబా తిరిగి వచ్చువరకు వారచట ఆగిరి.ఆమె స్వప్నములోతాను జూచిని ఫకీరుకు బాబాకు భేదమేమియు లేదనెను.ఆమె మిగుల భక్తితో సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అచటనేకూర్చుండెను.ఆమె యణకువ జూచి సంతసించి బాబా తన మామూలెపద్దతిలో నొక కధ చెప్పుటకు మొదలిడెను."నా చేతులు, పొత్తికడుపు,నడుము చాల రోజులనుండి నొప్పి పెట్టుచున్నవి.నే ననేకఔషధ్అములు పుచ్చుకొంటిని,కాని నొప్పులు తగ్గలేదు.మందులు ఫలమీయకపోవుటచే విసుగు జెందితిని.కాని నొప్పులన్ని నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుటిని"అనెను.పేరు చెప్పినప్పటికి ఆ వ్రుత్తాంతమంతయు నపత్నేకర్ భార్యదే.ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గి పోవుటచే నామె సంతసించెను.

నపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసికొనెను.మరల బాబా బయటకు పొమ్మనెను.ఈసారి యతడు మిక్కిలి పశ్చాత్తాపపడి యెక్కువ శ్రద్దతో నుండెను.ఇది బాబాను తాను పూర్వము నిందించి యెగతాళి చేసినదాని ప్రతిఫలమని గ్రహించి, దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను.బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను.అట్లే యెనర్చెను. ఆతడు తన శిరస్సును బాబా పాదములపై బెట్టెను.బాబా తన వరదహస్తమును నపత్నేకర్ తలపై బెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు నపత్నేకర్ అక్కడనే కూర్చుండెను.అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక కోమటి గూర్చి కధ చెప్పదొడంగెను.వాని జీవితములోని కష్టములన్నియు వర్ణించెను.అందులో వాని యొకే కొడుకు మరణించిన సంగతి కూడ చెప్పెను.బాబా చెప్పిన కధ తనదే యని నపత్నేకర్ మిక్కిలి యాశ్చర్యపడెను.బాబాకు తన విషయములన్నియు దెలియుటచే విస్మయమందెను.బాబా సర్వగ్యుడని గ్రహించెను.అతడందరి హ్రుదయములు గ్రహించుననెను.ఈ ఆలోచనలు మనస్సున మొదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి నపత్నేకర్ వైపు జూపంచి యిట్లనెను."వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు.నేను లోకుల బిడ్డలను జంపెదనా?ఇతడు మసీదునకు వచ్చి యేద్చుచున్నా డేల?అదే బిడ్డను వీని భార్య గర్భములోనికీ మరల దెచ్చెదను". ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్చి యిట్లనియె. "ఈ పాదములు ముదుసలివి,పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా యందే నమ్మకముంచుము.నీ మనోభీష్టములు నెరవేరును." నపత్నేకర్ మైమరచెను.బాబా పాదములను కన్నీటితో తడిపెను.తరువాత తన బసకు పోయెను.

నపత్నేకర్ పూజాసామాగ్రి నమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొను చుండెడివాడు.ప్రజలు మసీదులో గూమిగూడి యుండెడివారు.నపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను.ప్రేమవినయములతో నొక్కసారి నమస్క్రరించినచాలునని బాబా నుడివెను.ఆనాడు రాత్రి నపత్నేకర్ బాబా చావడి యుత్సవమును జూచెను.అందు బాబా పాండురంగనివలె ప్రకాశించెను.

ఆ మరుసటి దినమింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ యిచ్చి తిరిగి యడిగినచో రెండవ రూపాయి లేదనక యివ్వవచ్చునని నపత్నేకర్ అనుకొనెను.మసీదుకు బోయి ఒక రూపాయి దక్షిణ నివ్వగా బాబా ఇంకొక రూపాయి అడిగెను. బాబా వానిని ఆశ్వీర్వదించి యిట్లనెను."టెంకాయను దీసుకొనుము.నీ భార్య చీరకొంగులో పెట్టుము.హాయిగా పొమ్ము.మనస్సునందెట్టి యాందోళనము నుంచకుము!" అతడట్లే చేసెను.ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను.8 మాసముల శిశువుతో భార్యాభర్తలు శిరిడికి ఆ శిశువును బాబా పాదములపై బెట్టి యిట్లు ప్రార్ధించిరి." ఓ సాయి! నీ బాకీనెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది.కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి.నిస్సహయుల మగుటచే మమ్ముద్దరించ వలసినది.ఇక మీదట మేము మీ పాదములనే యాశ్రయించెదము గాక.అనేకాలోచనలు,సంగతులు స్వప్నావస్ధలోను జాగ్రదవస్ధలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజనవైపు మరల్చి మమ్ము రక్షింపుము!".

ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ యను పేరు పెట్టిరి.తరువాత భాస్కర్,దినకర్ యను నిద్దరు జన్మించిరి.బాబా మాటలు వ్రుఢా పోవని నపత్నేకర్ దంపతులు గ్రహించిరి.అవి అక్షరాల జరుగునను కూడ నమ్మిరి.

శ్రీ సాయినాథాయ నమః నలుబదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు