శ్రీతులస్యుపాఖ్యానము/ప్రకృతిఖండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

బ్రహ్మవైవర్త పుహాపురాణము. ప్రకృతిఖండము.

శ్రీతులస్యుపాఖ్యానము.


నారదుఁ డిట్లనియె. సాధ్వి యు నారాయణునికిఁ బ్రియురాలు నగునా లక్ష్మి యెట్లు తులసియ య్యెను ఎచ్చట జన్మించెను? ఆ 'మె పూర్వజన్మ మున నెవ్వతె ఆమె ఎవ్వనికులమునఁ బు ఫొట్టినయది? ఆతపస్విని యెవ్వని కన్యక? ఆమె యేత పంబు చేసి బ్రకృతికం టెం బరుండును నిర్వికల్పుల డును నిరీహుండును సర్వ సాక్షి స్వరూపుఁడును పరబ్రహమయుఁడుము పరమాత్త స్వరూపుఁడుసు ఈశ్వరుండును సర్వారాధ్యండును. సర్వే శ్వరుండుసు సర్వజ్ఞుండును . సర్వకారణ కారణుఁడును సర్వాదారుఁ డును సర్వమయుండును సర్వరక్ష కుండును నగునా గాయణునిం జెం దెను? ఇట్టి దేవి యెట్లు వృక్షుత్వంబుఁ జెందెను? ఆతపస్విని యె ట్లసు రునిచే నాక్రమింపంబడి యె?ఇందు సందియంబు నొందుచు సొమనము లోల 'మై పలుమా:) నన్నుఁ బ్రేరేపించుచున్న యది. సర్వసం దేహము లను బోనడఁచునోనారాయణ మహర్షి నీవు నాసం దేహములఁ బాపు దగుడు వనియడిగిన నారాయణమహర్షి యానారదుని కి ట్లనియె.

తులసితండ్రియగు ధర్మధ్వజుని వంశక్రమము.

దక్షసావర్ణి యసుమనువు పుణ్యవంతుఁడు ను వైష్ణవుఁ డు ను శుచి యు యశ స్సంపన్నుఁడు ను కీర్తిమంతుఁడు నైన వాఁడు. ఆతఁ డు విష్ణునీయంశము చే సంభవించిన వాఁడు. ఆతని పుత్రుఁడు ధర్మసా వర్ణి (మనువాఁడు ధరిష్ఠుఁడు ను వైష్ణవుఁడు ను శుచి యు నై యుం డెడివాఁడు ' ఆతని పుత్రుఁడు విష్ణుసావర్ణి యనువాఁడు, అతఁడు వైష్ణ వుఁడు ను జితేంద్రి యుఁడు నగువాఁడు. అతని పుత్రుఁడు దేవసావర్ణి యనువాఁడు విష్ణువ్రత పరాయణుఁడు. అతని పుత్రుఁడు రాజసాసర్ణి యను వాఁడు మహా విష్ణుభ క్తుఁడు, ఆరాజసావర్ణి కుమారుఁడు వృషధ్వజుఁ డనువాఁడు వృషధ్వజునిభక్తుండు. శంభు వాతనియాశ్రమమునందు మూఁడు దేవయుగములు వసియించియుండెను. శివునికి నారాజునం దుఁ బుత్రునికం టె నధికమయిన ప్రీతి గలదు. ఆవృషధ్వజుఁడు యణుని లక్ష్మిని సరస్వతిని గారవింపనివాఁడు, మఱి యాతఁడు సర్వ దేవతల పూజనములు దూరీభూతములు గావించె.మదమతిశయించియా రాజు. భాద్రపదమాసమునఁ బ్రవృత్త మగుమహాలక్ష్మీ పూజనమును ఖండించి మాఘమాసమునఁ బ్రవ ర్తింపంబడు సరస్వతీ పూజనంబును నిలిపి వేసెను. అతఁడు యజ్ఞమును విష్ణు పూజనమును నిందించి నవి సేయక యుండె. శివుఁ డాతనియందుఁ బ్రీతుం డై జేసి యేసురలు ను ఆరా జేంద్రుని శపింప రైరి. దివాకరుఁ డా రాజును శ్రీవిహీనుఁ డగునట్లు శపియిం చె. అది యెఱింగి శంకరుఁడు శూలముఁ గైకొని సూర్యుని పైకిఁ బోవుడు దిననాధుఁడు తనతండ్రి యగుకశ్యపునిఁ దోడుకొని బ్రహలోకమునకుం జని యానలువను శరణుజొచ్చెను. శివుఁడు ను క్రోధము చే ద్రిశూలము హస్తము నఁ దాల్చి బ్రహలోకమునకుఁ బోవ బ్రహ యు భయభ్రాంతుఁ డై సూర్యుని మున్ని డుకొని వైకుంఠమునకుఁ జనియె. అంత శంకరుం డు శూలముఁ దాల్చి తాను సూర్యుని వెంబడించి పరుగిడ బ్రహ గశ్యపుడు సూర్యుండు ను సంత్రాసము నొందుచుఁ దాలు వులఁ దడి యెండఁ గా సర్వేశ్వరుఁ డగునా రా యణుని శరణు కొచ్చిరి. వారలుశిరములు వంచి హరికిఁబ్రగా మములు గావించి మాటి మాటికి. సంస్తుతులు సల్పి యందఱును తమభ సుములకుఁ గారణము విన్న వించుకొనఁ.. గా నారాయణుఁడు .కృపాయ త్తచిత్తు, డై వా రల కభయ మొసఁగి యోభీతులారా మీరు ర్యమున నుండుఁడు నేనుండఁగా మీకు భయ మెక్కడిది? ఎవ్వరు విపదము సంభవించి నప్పుడు భయముఁ జెంది నన్ను సంస రిం చెదరో వారలను వా రుం డుచోటికి చక్రాయుధుండ నై వేగం బ చని రక్షించుచుండుదును. ఓదేవతలారా నేను జగములకుఁ బాలకుఁడను. నేను నిరతము సృష్టి కర్తను. బ్రహస్వరూపమున సృజించెదను.. శివరూపమున సంహరిం చెదను. "నేన శివుఁడను. బ్రహ వగునీవును నేన. త్రిగుణాత్మకుఁ డగు సూర్యుండు ను నేన, నానారూపములం దాల్చి సృష్టిని పరిపాలిం చుచున్నాఁడను. మీరలు. పొండు. మీకు శుభ మగును. భయము మీ కేల? ఇది దొట్టి నావరము చేత శంకరునివలని భయము మీకు లేదు. భగవంతుం డగునీశంకరుండు శీఘ్రము గ సంతోషము నొందువాడు. అతఁడు సత్పురుషులకు గతి యగువాఁడు. సుదర్శన చక్రమునందును శివునియందును నాకు నా ప్రాణములకం టెఁ బ్రియ మధిక మై యుండు. ఈయిఱువురకం టెఁ దేజస్వి యగువాఁడు బ్రహ్లాండముల లేఁడు, మహాదేవుఁడు లీల'మెయి గోటి సూర్యుల నైనను సృజియింప శక్తుఁడు, ఇట్టి బ్రహలను కోటిసంఖ్యుల నైనఁ గలిగించును. ఆళూలి కసాధ్య మేమి యున్నది! నన్ను దీవానిశము "ధ్యానించు చుండుటం జేసి యాతనికి బాహ్యజ్ఞాన మొకించుక యుండదు. అతఁ డు భక్తితో నానామములను నాగుణముల నైదు మొగములచేఁ గీ ర్తించుచుండు. నేను ని బ్లాతనికిఁ గల్యాణము గలుగ నగు నని చింతిం చుచుందును. ఎవ్వరు న న్నెట్లు జెం దెదరో వారల నే నట్లు భజియిం చెదను.ఆభగవంతుఁడు శివస్వరూపుఁడు. శివమున కధిదేవత. అతని వలన శివమగును, కాన బుధు లాతని శివుఁ డని పల్కుదురు. అని చెప్పుచుండఁగా నాసమయమున శంకరుఁడు శూలమును కేలు గిలిం చి వృషభారూఢుఁ డై రక్తపంకజములకు సమానము లగులోచన ములతో సయ్యెడకుం జనుదెంచి తూర్ణముగ వృషభ వాహనము డిగ్గి భక్తి వినమ్రం బయినకంఠముతోఁ బరాత్పరుడు ను శాంతుండు నమనలక్ష్మీ కాంతునికి నమస్కరిం చెను. ఇట్లు రత్న మయభూషణభూషితుఁ డయి; కిరీటమును, కుండలములను, వనమాలయు, చక్రాయుధమును దాల్చి; నవీననీరదమున కొప్పయిన శ్యామసుందర విగ్రహముతోఁ ' జతు ర్భుజములతోఁ జందనం బలఁదినసర్వాంగములతో(బీతాంబరముతో బొడసూపుచు; లక్ష్మీ దేవి యందిచ్చు తాంబూలము భుజియించుచు;మంద స్మి తసుందరముఖారవిందుడైఁ విద్యాధరకాంతలు నేయున స్తనము సూచుచు చతుర్భుజు లగు పార్షదులు వింజామరములు వీచుచుండ రత్న సింహాసనమున వేంచేసియుండునా 'పరమాతునికి భక్తానుగ్రహ విగ్రహుం డగువానికి నమస్కృతు లొనరించి యమహా దేవుండు బ్రహకును ప్రణామంబుఁ గావించె. సూర్యుండును సంత్రస్తుం డగుచు భక్తితోఁ జంద్ర శేఖరునికి నమస్కరించెను. కశ్యపుఁ డాతని నతి భక్తితో సంస్తుతించి నితి యొనరించె, శివుండు సర్వేశ్వరుని సంస్తుతించి మణిమయా సనంబునం గూరుచుండెను. ఇట్లున్న తాసనంబునందు సుఖా సీనుం డై విశ్రమించి యుండుచంద్ర శేఖరునికి విష్ణు పొర్షదులు దగ్గరి శ్వేత చామరంబులచే మందమారుతంబు లొలయ వీఁచుచుండిరి. సత్త్య మయుని స్వర్గంబునఁ గోధం బడఁగి ప్రసన్నుండయి ముదంబునమంద సితంబుతో నాశంకరుండు పంచవ క్తంబులను పరుండు ను విభుండు నగునారాయణుని స్తుతించుచుండెను. నారాయణుండు ప్రసన్నాతుం డగుచు సుధామధురంబులు మనోహరంబులునగువచనంబులతో దేవ సభయందు భగవంతుండగునా చంద్ర శేఖరునితో నిట్లనియె. ఓమహా దేవా శివుఁడ వగునిన్ను గుఱించి శివప్రశ్న మొనరించుటయ త్యంతమవహాస్య మగును. అట్లయ్యును శివస్రశ్న ము సేయుట లౌకిక మనియు వైదిక మనియు సేయుచున్నాను. తపములకు ఫలము లొసంగువాఁడవై సర్వము లగుసంపదల నిచ్చుచుండునట్టినిన్ను గుఱించి సంపత్నము తపఃప్రశ్నము సేయుట యయోగ్యము. జ్ఞానాధి దేవత వయి సర్వ జ్ఞుఁడ వగు నిన్ను వృధా జ్ఞానప్రశ్న మేల సేయవలయు? మృత్యుం జయఁడ వై ననీకు విషత్తు లేని కాలమున నాప్రశ్న ము వలదు' వీయింటికి నీవు నచ్చినప్పు ఉలవచ్చితి వని ప్రశ్నము సేయుట నాకనుమతముగాదు. అయినను నీవు తాసముతో నియ్యెడకువచ్చుటకుం గారణ మేమి యని యడుగవలసియున్న ది, అందుకుఁ గారణముఁ దెల్పుము.

అని యడిగిన మహా దేవుం డి ట్లనియె. ఓహరీ నాభ క్తుండు ను నాకు నా ప్రాణములకంటె నధికప్రియుండు నగువృషధ్వజుని సూర్యుం డు శపియిం చెనని నాకుం గోపముసు డ్రా సమును గల్గి యున్న ది. భ క్తు సందలిపుత్రవాత్సల్యమున నై నశోకము చేత సూర్యునిం జంపుటకుం గడంగితిని. ఆతఁడు బ్రహను శరణుజొచ్చెను, ఆబ్రహ సూర్యునిం దోడ్ - ని నిన్ను శరణుజొచ్చి యున్న వాఁడు. ఏనరులు ధ్యానంబున నైన సచనముల నైన నిన్ను శరణు వేడెదరో ; వారలు విపత్తు గడచి శంకావివర్జితు లై మృత్యువును జయింతురు. అట్లుండ నిన్ను సాక్షాచ్ఛ రణము జెందిన వారలఫలం బే మని పొగడుదును, హరిస్మరణం - బెల్లప్పు డునభయం బొసంగునది. సర్వమంగళములు ను 'దానం గలుగు. ఓజగ తీభూ సూర్యుని శాపంబుకతమున సీరి చెడి మూడుం డై యుండు నాభ కునికిఁ గాఁగ లగతి యేమి? నా కది వచియింపుము. అని యడిగిన భగవంతుం డి ట్లనియె. ఈ వైకుంఠ Wన నర్ధక్షణమునకు భూమియందు నిజువది యొక్క యుగముల కాలము గైవము చే నతీతంబయ్యె. వేగంబ నృపాలయమునకుం జనుము. దుర్ని వారము ను మహాదారుణము నగుకాలము చేత వృషధ్వజుండు మృతుం డయ్యె. ఆతనికుమారుండు హంసధ్వజుండు ను సిరిచెడి యుండి మృతుం డయ్యె. ఆతని పుత్రులు ధరధ్వజుండు ను కుశ ధ్వజుండు ననుమహాభాగులు సూర్యని శాపమున హతశ్రీకు లయి రాజ్యభ్రష్టు లగుచు లక్ష్మి నిగూర్చి తపము సల్పెదరు. వారలభార్యలయందు లక్ష్మి యాత్మ కలాం శమున జనియించును. అప్పు లయి నృపోత్తము లగుదురు. ఓశంభూ నీ సేవ కుండు మృతుం డయ్యె. పొను. ఓ బ్రహ్లాదులా మీరలు ను పొండు. అని యి జ్ఞానతిచ్చి నా రాయణుండు లక్ష్మితో సభ నుండీ యభ్యంతరం బునకుం జనియె. దేవతలు ను శంభువు ను సంహృష్టు లయి పగమము లయినతమతమయాశ్రమములకుం జనిరి. 'శివుండు ను శీఘ్రమునఁ బరి పూర్ణ తమముగఁ దపంబు సేయం జసెను.

ఇది శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమునఁ బ్రకృతిఖండమునందు

నారాయణనారద సంవాదమునఁ దులస్యుపాఖ్యాన

మునం ద్రయోదశాధ్యాయము ముగిసెను.


కుశధ్వజసుత యగు వేదవతి చరిత్రము.

నారాయణ మహర్షియి ట్లనియె. ఓనారదమునీ యాధర్మ ధ్వజుం దును గుళధ్వజుండు నుగ్రం బయినతపము చేత లక్ష్మీ దేవి నారాధించి వారలు వెర్వేజ దమ కిష్టము లయినవరములు వడసిరి. అధర్మధ్వజ కుళధ్వజులు మహాలక్ష్మి వరము చేతఁ బృధ్వీ షతు లయి ధనము గలిగి పుత్ర వంతులైరి. అందు కుళధ్వజునిపత్ని మాలాపతి యను దేవి. ఆసతి కొంత కాలమునకు లక్ష్మ్యంశ సంభవయు సతి యునగుసుతం గనియె. ఆమె భూమిపణుం బడినంతట న జ్ఞానయుక్త యయి యందలు వినునట్లు స్పష్టముగ వేదధ్వనిం గావించి సూతి కాగృహమునుండి వెలు వడియె, ఆకన్యక జనించినయంత న వేదధ్వనిం గావించె గాన మనీషు లాకన్యకను వేదవతి యని పల్కుదురు. ఆమె జనియించినంత న బాగుగ జలకం బాడి తపము సేయ వనమునకుం జనియె. యయి యామె యెల్లవారు నిషేధించినను వినక వార లప్ర యత్నములు వము చేసి చనియె. ఆ వేదవతి పుష్కర క్షేత్రమునందు తపము సేయం బూని యొకమన్వంతరము లీల మెయి “నత్యుగ్ర. మగు తపము సలి పె. అ ట్లయ్యు ను పుష్ట మై క్లేశము నొందక నవయానన సంయుత యై వెలుంగుచుండె. ఇట్లుండ, నా మెకు 46 ఓ సుందరీ నీకు జనాం తరమునందు శ్రీహరి తా న భర్త యగును. బ్రహ్లాదుల చేత దురారా ధ్యుం డగుపతిని నీవు వడయంగలవు” అని యా కాశ వాణి వినంబడి యె, ఆయాకాశ వాణివచనములు విని యు నాయమ రోషంబు తో గంధమా దననగమునకుం జని యచట నొక నిర్జనస్థలమున మరలఁ దపంబు సేయు టకుపక్రమించెను. అచటఁ చిరకాలము తపముగావించియుఫలం బందక నిట్టూరుపుని గుడించుచుం గూరుచుండి యెదుట గుర్ని వార్యుం డగురావ బునింగాంచి యతివినయభ క్తులతో నాతనికిం బాద్యంబొసంగి యాస్వా ద్యము లగుఫలములు మూలమఃలు ను సుశీతలము లయినజలములు నిచ్చెను. అవి భుజియించి యాపాపిష్ణుండు తా నాయమసమీపము నకు జని ఓకల్యాణీ నీ వెవ్వతెవు? అని యడిగి పీనోన్న తము లగు పయోధరములును శరత్పంకజమువలె నుత్సవముఁ గల్పించు మొగం బును గలిగి మందహాసము సల్పు సుదతియుసతియు నగునావరారో హం గాంచి కామబాణముల చేఁ బీడితుం డై యాకృపణుం కు మూర్ఛం జెంది తెలిసి యాకన్యకిం గరము వట్టి తిగిచి శృంగార చేష్టలు సేయం గడంగిన నాసతి కోపదృష్టిం గనుంగొని వానికి స్తంభితునిఁ గావించె. ఆరావణుఁడు హస్తములు ను పాదములు ను గదలింప లే యేమి యుం జెప్ప నశక్తుం డయి పడ్డాంశ సంభవ యగునాపద లోచనను మానసమున స్తుతియిం చెను. ఆదేవి యు నాతఁడు సల్పిన స్తవమున సంతుష్ట యయి యాతని స్తబ్ధత్వమును మాన్చి వానింగాంచి యోరీ నీవు నాకతమున బాంధవులతో వినాశము నొందఁబోయెద వని శపి యించి యోరావణా నీవు నన్ను స్పృశియించితివి గాన నీశ రీరమును బరిత్యజిం చెదను కనుంగొనుము అని చెప్పి యోగబలమున నాసుదతి శరీరముం బరిత్యజించినం జూచి రావణుం డామె మేనును గంగయందు వదలి తనగృహమునకుం జనియె. ఆ యసురుండది గాంచి తనమనమున నౌరా యేమి యద్భుతముఁ గంటిని! నే నెట్టి కార్యముఁ గాంచితిని! అని చింతించి చింతించి యది దలంచి పలుమాఱు విలపించుచుండెను. ఆవేదవతి కొంతకాలమునకు జనక రాజునకు దనూజయై జన్మిం సీతా దేవి యని విఖ్యాతిం జెందె, ఆమెకోటి కె రావణుండు నిహతుం డయ్యె. మహాతపస్వినీ యగునాయమ పూర్వజన్మమునం జేసినతివ ము చే హరిస్వరూపుఁడును బరిపూర్ణతమ్ముడు నగు రాము ని భర్తగా బడ సెను. లక్ష్మీ స్వరూపిణి యగునా సుందరి జగత్పతిని దషము చే నారా ధించి యాతని స్వామి గాఁ బడసి మారామునితో చిర కాలము రమి యించెను. ఆమె జాతిస్తర యగుటం జేసి తొలుతం జేసినతపళ్లమ మును గలంచుకొనుచుండినను సుఖు బసుభవించుటం జేసి యవిమాను కొనియె. దుఃఖమునకు సుఖము ఫలంబుగ దా? ఆసతి యు బహు సుకుమారుండు ను నవయౌవనుండును గుణవంతుఁడు ను రసికుండు ను శాంతుండు ను మనోహర వేషము గలవాఁడు ను త్తముఁడు ను స్త్రీల కు మనోహరుఁడు ను తాను గోరిన ప్రకారముగ నుండువాఁడు నగునా రామునితో నానావిధశృంగార సౌఖ్యముల ననుభవించుచుండె. బలవం తంబయిన కాలంబు చేత నారాముఁడు వనవాసము సేయం బోయి సముద్రమునొద్ద సీతతోడ లక్ష్మణునితోడ వసించి యుండి గూహరి విప్ర రూపంబుఁ దాల్చి వచ్చినయగ్ని దేవునిం గాంచెను. ఆబ్రాహణుఁడు ను దుఃఖతుం డయినరామునిం గాంచి తాను ను దుఃఖించుచు నాసత్య పరాయణుండు సత్యములు నిష్టములునగువచనముల నిట్లనియె. ॥వహ్ని॥ ఓభగవంతుఁడా నాహక్యము వినుము. కాలాను సారముగ నీకొకటి సంప్రాప్త మయి యున్న ది. ఇది సీతాహరణ కాలము. ఇది నీకు సము పస్థితం బయి యున్న యది. విధి దుక్ని వార్యము. విధికం టెంబరం అయిన బలము గలది లేదు. ఇప్పుడు నావలసం జనించిన సీతను నాయందు వదలి నీవు నీ సమీపమునం దచ్ఛాయ నుంచుకొని రక్షింపుము. మరల బరీక్షా సమయమునందు సీతాదేవిని నీ కొసం గెదను. నన్ను దేవత లంపిరి. నేను విప్రుండను గాను. హుతాశనుఁడను అని చెప్పఁగా (గా నాతని వచనంబులు విని లక్ష్మణుని కది ప్రకాశింపఁ జేయక య దూయమానం బయినహృదయంబుతో స్వచ్ఛందంబు గఁ గైకొనియెను, వహ్ని యుఁ దనయోగబలంబు చేత సీతవలననుండి మాయాసీతం బుట్టించి యాసీతాదేవికి సమానము లగుగుణంబులు ను సర్వాంశంబులు ను గలయా మాయాసీతను రాముని కొసం గెను. ఇట్లాసంగి యావహ్ని యిది గోప నీయము. దీని నితరులకుఁ దెలియపఱచం గూడ" దనిని షేధించి సీతం దీసికొని పోయెను. ఈ గోప్యంబు లక్ష్మణుఁడు సయిత మెఱుంగఁడట్లుండ నితరుల కె బ్లెఱుంగనగు. ఆ సమయంబున రాముఁడు సువర్ణ మృగంబుం గనుంగొనియె. సీత యాకనకమృగంబును బట్టి తెమ్మని ప్రయత్న పూర్వ కంబు గ నాతనిం బం పె. రాముఁడు జానకిరక్షణంబును లక్ష్మణునియందు వదలి పెట్టి వనంబునందు నామృగంబును వెబడించిచని దానిని సాయ కంబునం జంపె, ఆమాయామృగము లక్ష్మణా! యని కూసి యెదుట శ్రీ హరిం గాంచిస్మరించుచు వైశం బ ప్రాణములు వద లెను. ఆతఁడు మృగ రూపమును పరిత్యజించి దివ్యరూపముఁ దాల్చి రత్న నిర్మితం బయిన విమానమున వైకుంఠమునకుం జనియెను. వైకుంఠమునం బ్రతి ద్వారము నందు ను ద్వారపాలకులకు ఁ గింకరుం డుండు.అందు జయవిజయులకుం గింకరుండు జితుం డనువాఁడు. మిగులబలవంతుండు. వాఁడు సనకాదుల శాపముచేత రాక్ష సతనువుం జెంది యుండి యాతఁడు మరల ద్వార పాల కులకు ముం దయాద్వారమును జే రెను.అంతసీత, లక్ష్మణాయని చెప్పినవిళ్ల బంబయినవచనము విని రాముని సన్ని ధికి లక్ష్మణునిఁ బం పెను లక్ష్మణుండు రామునొద్దకుం. జనఁ గా దుర్ని వారణుం డగురావణుండు చనుంచి లీలమెయి సీత నపహరించుకొని లంకకుం జనియె. అచట వనంబున రాముఁడు లక్ష్మణునింగాంచి మిగుల దుఃఖించి వేగిరం బ స్వాశ్రమము నకుం జను దెంచి సీతాదేవిం గానక విషాదమున సుచిరకాలము మూర్ఛ ఇంది మరల విశేషముగ విలపించెను. ఆగహనమునందు నాసీతను వెద కుచు మరలఁ బరిభ్రమించుచుఁ గొంత కాలమునకు నదీతటమునం బక్షి చే సీతావృత్తాంతం బెఱింగి యాహరి వానరుని సహాయము గాఁ గొని సాగరము బంధించి లంకకుం జని యారఘు శ్రేష్ఠుండు సాయకములచే రావణుని సబాంధవను గఁ జంపి దుఃఖత యగుసీతాదేవిం బడసి సత్వ

త్రిహాయణిచరితము.

రము గ సామెకు వహ్ని పరీక్ష చేయించెను. ఆకాలమున హుతాశ నుండు వాస్తవి యగుజానకి నొసం 7. అప్పుడు ఛాయాసీత వినయా'న్విత యయి వహ్ని దేవుని రామునిఁ గాంచి యే నేమి సేయంగలను. అందు కుపాయము దెల్పుఁడు”అని ప్రార్థింపఁ గా పహ్ని యి ట్లనియె. ఓ దేవి నీవు పుణ్యప్రద మగుపుష్కర క్షేత్రమునకుం జనుము. అచట తపం బొన రించి నీవు స్వర్గ లక్ష్మివి గాఁబోయెదవు. అని చెప్పిన వహ్ని వచనంబు లాలకించి పుష్కరమునం దపంబాచరించి యాఛాయాసీత మూఁడు లక్షలది వ్యవర్ష ములకు స్వర్గమున స్వర్గ లక్ష్మి యయి వెల సెను. ఆయమ కాలక్రమమునం దిపము చేసి యజ్ఞకుండమున జనియించి పాండవులకుం గామిని యగుచౌపది గా ద్రుపదునికిం బుత్రి యయి 'వెల సె' కృతయు గమున వేదవతి యను నామముతోఁ గుశధ్వజునికిం గూఁతురయ్యెను. తేతాయుగమున రామపత్ని యగుసీతా దేవియనం బరఁగుచు జనకు నికిం దనుజాత యయ్యె. ద్వాపరమున నాయమఛాయ ద్రౌపదీ దేవి యను పేరం బరఁగుచు ద్రుపదునికిం జని యించెను. గాన నీయమ యుగ శ్రయమున నుండునది యగుటం జేసి త్రిహాయణి యని చెప్పంబడియె. అని చెప్పిన నారాయణునిం గాంచి నారదుండు నోసం దేహభంజనుఁడా మునిపుంగవుఁడా ఆయమకుం బతు లయిదుగు టైరది యెట్లో యీసంశ యముఁ బాపు మని యడిగిన నారాయణుం డిట్లనియె. ఓనార చా! లంక యందు వాస్తు యగుసీత రామునిం జెందెను. వహ్ని చే సృజియింప బడిన చ్ఛాయాసీత రూపయౌవనసంపన్ను ఆ లయియుండునది యా రామవహ్ను లయాజ్ఞ చేఁ దపముఁ గావించి శంకరుని వరము వేడెను. ఆయమ కామాతుర యగుటం జేసి పతివ్యగ్ర యయి హేత్రిలోచన పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, పతిం దేహి, అని యయిదు మాఱులు మరల మరల ప్రార్థనము గావించెను. శివుండు తతాధ నము విని నవ్వుచు నారసి కేశ్వరుం డోప్రియులా రా నీకు భర్త లయి దుగు పొయ్యెదరు అని వరంబాసు గెను. ఆకారణమున నామె పొండ వులకుఁ బ్రియురా లగుపల్ని యయ్యె. ఓనారదా ప్రస్తావము సర్వముఁ జెప్పితి తిని. ఇంక మొదటికథఁ జెప్పెద వినుము. అంత రాముండు లంక యందు మనోహారిణి యగుసీతం జండియాలంకను విభీషణుని కొసంగి మరల నయోధ్యకుం జని భారతవర్షమున నందుఁ బదునొకండువేల యేండ్లు రాజ్య పాలనము సలిపి సర్వజనములఁ దోడుకొని వైకుంఠము నకుం బోయెను. కమలాంశ యగునా వేదవతి కమలయందుం ప్రవేశించె, ఓనార దాపుణ్యప్రదంబయినయీయాఖ్యానముఁ జెప్పి తిని.దీనివలనఁ బాప ములు నశించును. నాలుగు వేదములు మూర్తివంతము లై యామె జిహ్వా గ్రమున సతతము వర్తించుచుండుం గాన నాయమ వేదవతి యని చెప్పంబడును.కుశ ధ్వజసుత యగు వేదవతియుపాఖ్యానము సంక్షేపము గఁ దెల్పితిని. ఇంక ధర్మధ్వజునికూతును పాఖ్యానముఁ దెల్పెదను. వినుము.

ఇది బ్రహవైవర్తమహాపురాణమునం బ్రకృతిఖండమునందు నారాయణ

నారదసంవాదమునం జతుర్దశాధ్యాయము

ముగిసెను.


నారాయణమహర్షి యిట్లనియె. ధర్మధ్వజునికిం బత్ని మాధవి యని ప్రసిద్ధిఁ జెందినయది. ఆసుందరి గంధమాదననగము నందుం బూల వాసనలు చందనవాసనలు వెదజల్లు మారుత మొలయు చుండురమణీయ స్థలమునఁ, బుష్ప చందనచర్చితం బయి రతికరం బయి యుండుళయ్యం గామిచుకొని తాను సర్వాంగములందుఁ జందనం బలందుకొని యా నారీరత్న మతిమనోహరమగుశరీరమున రతనంపు సొమ్ములు చేసికొని యాకాముకి రసిక లగుకాంతలకుం దలక జై యుండునది యగుటంజేసి రసిశాసనసంయుత యగుచు రాజుతో సురతసౌఖ్యం బనుభవించెను. రతి చాతుర్యం బెఱింగినవా రగుటంజేసి వారికి రతివిరతి లేక యుండె. అప్పుడు,

ఉ. కామినిముద్దుపల్కు లలకాయజవీరునిసింహనాద మై
భామినిగుబ్బచన్మొనలపంతపుఁబోటులు కామువ్రేటు లై
సామజయానచూపుగమి సారస బాణుని బాణవృష్టి యై
యామనుజేశుఁ గామకలహంబునఁ దాఁకి కరంచెఁ దాలిమిక్షా.

ఇట్టు లారసికవరులు రేయింబగ ల్లేఱుంగక నూఱుది వ్యవర్ష ములు కామసుఖం బనుభవించుచుండిరి. అంత నారాజు మతిం జెంది సురతము వలన విరమించుకొనియె. ఆసుందరి కాముకి యగుటంజేసి యొకించుకఁ

శ్రీతులసీదేవి యవతారము.

దృష్తిం జెందక యుండెను. ఆసతి యది దొట్టి నూఱుదేవవర్షములు గర్భముఁదాల్చెను, ఆరాజపత్ని శ్రీగర్భ యగుటంజేసి దినదినమునకు శీయుత యగుచు వచ్చెను. ఓపద్మభవుని కుమారుఁడా ఆకాంతామణి ర్తీకమాసమునం బున్న మనాఁడు శుక్రవారంబున శుభయోగసం యుతం బయినశుభదినమున శుభక్షణమున శుభ స్వామిగృహాన్వితం బైన శుభాంశమునఁ బద్మాంశసంభవ యగునారీమణిం గనియె, ఆకన్యక; పద్మ ముల కొప్పయినపాదయుగళమునందుఁ బద్మ రాజి చిహ్నములు; గలిగి రాజరాజేశ్వరీలక్ష్మీ రూపిణి యయి; యాయతము లగు సర్వాంగములును రాజలక్ష్మీ చిహ్న ములును గలిగి; రాజలక్ష్యధి దేవతయై యొప్పుచు; శారద పూర్ణి మా 'చంద్రునిఁ బోలుమొగమును, శరత్వంకజములకుఁ దుల్యము లగులోచనములును, పరిపక్వ మగుబింబఫలమున కొస్పయినయధర మును, ఆరక్తము లగుహస్తపాదతలములును, మనోహర మయి నిమ్న మగునాభియు,తదూర్ధ్వభాగమునఁ ద్రివళులును, వర్తులము లగునితంబ ములును, న్యగ్రోధపత్రమునకు సమాన మగునుదరమును గలిగి; శీత కాలసుఖోష్ణము లగుచు గ్రీష్మ మునందు సుఖశీతలము లగుచు నొప్పు సర్వాంగములతో నతిరుచిరయు శ్యామయు నయి; శ్వేతచంపక సుమ వర్ణ ముగలిగి; సౌందర్యవతులకంటె సౌందర్యవతి యనందగి; స్మితసుధా మధురముగ సూతికాగారమును గాంచుచుండై ఆకన్యకను జూచి,

(సీ॥ క్షీరనీరధికన్య చెలువకు సాటి యే జడజ యనం K. నాచాన యొప్పు
నాపులోమజ తుల్య యనవచ్చునే నాతి కాసుర ప్రకృతి యాయజ్జ నేత్ర
యుమ సరిపోలు నీరమణి కం చనరాదు భిక్షుక కాంత యాభృంగ వేణి
రతి యీసతికిఁ దుల్యరమణి యౌనా యేమి దగ్ధత నాధ యాతలిరుబోణి
సర్వశుభలక్షణంబుల జగములందు । గొప్పగా నుండువారికే కొఱఁత లుండ
సాటి యే యన్య లీబోటిగోటి కైన 1 సొగసుకత్తెలు సర్వాంగసుందరికిని.)

అనియివ్విధమున నాడుకొనుచు నచ్చట కేగుదెంచినజను లందఱు సనపద్యశుభలక్షణో పేత యగునాశారో దరికిం దుల్యగుణరూపవతు లగుమదవతుల నిరూపింప లేక యానాతికిం దులన లేమింజేసి. తులసియను నామంబు సెల్లు నని పల్కిరి. ఇది పురావిదులు బేర్కొ నినయర్థంబు. అంత, శ్యామ యు నాయతాంగి యు నగు నాతులసి భూమిపయిం బడి నయంతట న నవ్వుచు సూతికాగారముఁ గలయం గనుంగొని లేచి యాసూతికాగారము నిర్గమించి ఎల్ల వారుని షేధించిననునిలువక తపము సేయుటకు బదరీవనమునకుఁజనియె. ఆయమ యచటఁ దనకు నారాయ ణుండు పతి గావలయు నని నిశ్చయించుకొని లక్ష దేవవర్ష ములు పరమం పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/42 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/43 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/44 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/45 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/46 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/47 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/48 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/49 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/50 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/51 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/52 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/53 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/54 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/55 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/56 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/57 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/58 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/59 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/60 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/61 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/62 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/63 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/64 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/65 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/66 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/67 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/68 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/69 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/70 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/71 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/72 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/73 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/74 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/75 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/76 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/77 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/78 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/79 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/80 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/81 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/82 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/83 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/84 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/85 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/86 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/87 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/88 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/89 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/90 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/91 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/92 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/93 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/94 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/95 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/96 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/97 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/98 పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/99

  • తులసీ ధ్యానము, పుష్పంబులలోపల సారయయి; సతియయి; పూజ్యురాలై ;మనోహారిణియై, సకలపాపముల నెడి యిద్యములనుదహియిం చుటకుజ్వలించుచుండునగ్ని జ్వాలలకు సమానురాలై ; పుష్పంబు లందును దేవ స్త్రీలయందును దనకుఁదులన లేమిం జేసి తులసియను పేరువడసియ న్నింటికింబవిత్ర రూపిణియై; యందఱకు నుశిరంబుల ధారణము చేసికొనం దగినదియై, ఈ ఫ్సితంబులొసంగి విశ్వపావనియై; జీవన్ముక్తురాలై, ముక్తి ప్ర దయై;హరిభ క్తి గలుగంజేయునదియై; యుండుతులసీ దేవినిభ జిం చెదను. అనియివ్విధమున ధ్యానించి పూజించి స్తుతించి బుధుండగువాఁడు ప్రణా మంబులాచరింపంజనును. ఓనారదా తులస్యుపాఖ్యానము నచించితిని. మఱియు నేమియడి గెదవు.

తులసీ ధ్యానమూలము.* శ్లో || తులసీం పుష్ప సారాంచసతీం పూజ్యాంమనోహరాం | కృత్న పో పేళ దాహాయ జ్వలదగ్ని శిఖోపమాం. || పుష్పేషుతుల నాప్యస్యా నాసీద్దేవీషు వాము నే | పవిత్రరూపొసర్వాసు తులసీ సాచకీర్తితా || 9 || శిరోధార్యాంచసర్వేషా మిఫ్సితాం విశ్వపావనీం|జీవన్ముక్తాంము క్తిదాంచ భ జేతాంహరిభ క్తిదాం || 3 .


ఇది శ్రీ బ్రహవైన రమహాపురాణమునఁ బ్రకృతిఖండమునందు నారాయణ నారద సంవాదమునందుఁ దులస్యుపాఖ్యానం బనుద్వావింశాధ్యాయము ముగి సె ను.. -- - శ్రీ తుల స్యు పాఖ్యానము . స • పూగ్ల ము. I

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.