20వ శతాబ్ది ముగుస్తున్న 1999లో ప్రముఖ తెలుగు విమర్శకుడు, అనువాదకుడు వెల్చేరు నారాయణరావు నేతృత్వంలోని బృందం ఎంపిక చేసిన జాబితా ఇది. 20వ శతాబ్దిలో ప్రచురితమై, తప్పక చదవాల్సిన వంద పుస్తకాల జాబితా ఇది. తానా వారి తెలుగు పలుకు, ఈమాట పత్రికల్లో ప్రచురితమైంది. ఇటువంటి ఏ జాబితాలాగా అయినా వదిలివేసిన పుస్తకాల గురించి, స్వీకరించిన పుస్తకాల గురించి గట్టి విమర్శలే ఎదురయ్యాయి, కానీ అనివార్యమైన ఆ వివాదాలు తప్పిస్తే ఒక మంచి జాబితాగా దీన్ని స్వీకరించవచ్చు. సార్వజనీనమైన పుస్తకాలను పూర్తిచేయడానికి, కాని పుస్తకాలు స్వేచ్ఛా నకలు హక్కుల పరిధిలోకి తీసుకురావడానికి మార్గాలు అన్వేషించడానికి ప్రాధాన్యతలు తెలిసేందుకు ఇటువంటి జాబితాలు ఉపకరిస్తాయి. ఈ జాబితాల్లోనివే ప్రాధాన్యత అన్నది కాదు అసలైన ఉద్దేశం, ఆసక్తి ఉన్నవారికి సాయం చేసేందుకు మాత్రమే ఉద్దేశించింది.
సార్వజనీనమైన కృతి, తెవికీసోర్సులో ఉంది. స్కాన్ ఆధారితంగా లేదు. గురజాడలు స్కాన్ పుస్తకం కూడా ఇక్కడే ఉన్నందున, దీన్ని స్కాన్ ఆధారితం చేసేస్తే పూర్తవుతుంది.
2022లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన రచనలన్నీ భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి మరో నాలుగేళ్ళలో ఆయన రచనలపై వికీసోర్సులో పనిచేయవచ్చు.
మహీధర రామమోహనరావు జీవించిన కాలాన్ని బట్టి చూస్తే ఈ రచన కాపీహక్కుల పరిధిలో ఉన్నా, రామమోనహనరావు తన మార్క్సిస్టు దృక్పథంతో రచనను సమాజ వినియోగం కొరకు సార్వజనీనం చేసేశారని వినికిడి. కానీ ఈ విషయాన్ని నిర్ధారణగా తేల్చుకోవాలి.
12.
మొక్కపాటి నరసింహ శాస్త్రి
బారిస్టర్ పార్వతీశం
1940
ఈ కృతి వికీసోసర్సులో పూర్తై ఉంది. కానీ రచయిత మరణించిన తేదీ బట్టి ఈ కృతి మరో పదిహేనేళ్ళ వరకూ భారతదేశంలో సార్వజనీనం కాదు. దీని ప్రాచుర్యం దృష్ట్యా, కాపీలు చెల్లిపోతున్న పద్ధతి దృష్ట్యా చూస్తే దీన్ని తక్షణం తొలగించాలి.
13.
రంగనాయకమ్మ
స్వీట్హోం
1960
14.
శ్రీదేవి
కాలాతీతవ్యక్తులు
1940
2022లో పి.శ్రీదేవి రచనలు భారతదేశంలో సార్వజనీనం అవుతున్నాయి. కాబట్టి వీటిపై వికీసోర్సులో మరో నాలుగేళ్ళ తర్వాత పనిచేయవచ్చు.(సెప్టెంబరు 2018)
15.
ఉన్నవ లక్ష్మీనారాయణ
మాలపల్లి
1920
ఉన్నవ లక్ష్మీనారాయణ కృతులు 2019 జనవరి నుంచి భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి అప్పుడు పుస్తకాన్ని ఎక్కించి పనిచేయవచ్చు.
సార్వజనీనం. వికీసోర్సులో పూర్తైంది. అయితే కన్యాశుల్కం తొలి కూర్పు వేరే ఉంది. గురజాడలులో అది ఉంది, దానిని కూడా పూర్తిచేస్తే పరిశీలకులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతర్జాలంలో కన్యాశుల్కం తొలి కూర్పు మొమ్మొదట అందించినవారం అవుతాం.
భారతదేశంలో సార్వజనీనం. మొదటి సంపుటం తెలుగు వికీసోర్సులో పాఠ్యీకరణ పూర్తై అచ్చుదిద్దడానికి సిద్ధంగా ఉంది. రెండవ సంపుటం వికీసోర్సులో చేర్చి పూర్తిచేయాలి.
2022లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మరణించి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆయన రచనలన్నీ భారతదేశంలో సార్వజనీనం అవుతాయి. కాబట్టి మరో నాలుగేళ్ళ తర్వాత ఆయన రచనలపై వికీసోర్సులో పనిచేయవచ్చు.
కృతి నాలుగో భాగం తప్ప భారతదేశంలో సార్వజనీనం. వికీసోర్సులో పూర్తైంది. నాలుగో భాగం కాపీహక్కులు తెన్నేటి విశ్వనాథం వారసుల వద్ద అప్రమేయంగా ఉన్నాయనుకోవాలి. కాబట్టి స్వేచ్చా నకలు హక్కుల్లో విడుదల చేయించుకుందుకు ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే అది ఎలాగూ అనుబంధమే కాబట్టి తొలగించాలి.