రాజవాహనవిజయము/పీఠిక

వికీసోర్స్ నుండి

రాజవాహనవిజయము

పీఠిక

ఇది 5 ఆశ్వాసముల ప్రబంధము. కాకమాని మూర్తికవి ప్రణీతము. ఈతడు బ్రాహ్మణుడు. ఇంటిపేరు పెన్నేకులవారు. తండ్రి రామలింగభట్టు. తల్లి తిమ్మమాంబిక. ముత్తాత రామపండితుడు. తాత ప్రబోధపండితుడు. ఆపస్తంబసూత్రుడు. ఉభయభాషావిద్వత్కవీంద్రుడు. కవి పట్టభద్రుడు.

ఈతడు సంకుసాల నృసింహకవివలె

శా. వ్యాళస్వాంతు లశాంతు లజ్ఞ సతతైకాంతుల్ మహాచేటికా
     శ్రీలోపద్రవ నవ్యపత్రికులు భూరిప్రాజ్ఞవిజ్ఞాపనా
     వేళాకల్పితరక్తవక్త్రులు కళావిజ్ఞాననిర్భాగ్యు లీ
     కాళక్ష్మాతలనేతలం బొగడుటల్ కష్టంబు లర్థార్థికిన్.

అని ఆనాటి రాజులను గూర్చిన తన యభిప్రాయమును వెల్లడించుచు 'నదైవం కేశవాత్పరమ్మ'ని తనకృతులలో పాంచాలీపరిణయమును శ్రీరంగపతికిని, రాజవాహనవిజయమును శ్రీ వేంకటాచలపతికిని గృతి యొసంగెను. ఈతడు రచించిన బహుళాశ్వచరిత్రములోని లక్ష్యములుగా జూపబడిన పద్యములు తక్క, సమగ్రగ్రంథ మెచ్చటను లభింపలేదు.

కవికాలము

సాధారణముగా కవికాలమును నిర్ణయించుటకు కవిస్తుతియు, గద్యలు, నరాంకిత మొనర్చియుండిన యెడల నాకృతిపతి వంశకథనమును జాలవఱ కుపచరించెడివి. ఈతడు సంస్కృతకవులను, కవిత్రయమునే పేర్కొనియెను గాని, తననాటి కవులను పేర్కొశక తన తాత ముత్తాతలను పేర్కొనెను.

పంచమాశ్వాసము నందలి,

సీ. అఖిలసీమామూలమై దుర్గమ్ము లు
                         మ్మకలు గల కమ్మ వెలమదొరలు
     చేతి కైదేసివేల్ శివరాయల వరాల
                         నెల కట్టడల పటాణీ ల్గరీబు
     లూళ్ళాయములమీద హొరపుత్తరవు గన్న
                         రాయకై జీతంపు రాయవారు
     పగటిగ్రాసంబు దప్పకయుండ దినరోజు
                         మాదిరి నొంటిరు జోదుమూక
గీ. మొదలుగా గల బారలు మొనకు నిల్చి
     పొడిచి పేర్వాడి వీథు లేర్పడగ జేసి
     గాసి గావించి యరుల జేనాసి యెదుట
     జూపి నిలఱేడు మూడు మెచ్చులున మెచ్చ.

అను పద్య మందలి "శివరాయల వరాల"నుటచేత శివదేవరాయలనాటివాడు గాని, తరువాతివాడనిగాని నిశ్చయించుట కాధార మీగ్రంథమందే లభించినది.

అచ్యుతదేవరాయల కుమారుడు మరణించిన తరువాత రంగారాయల కొడుకు సదాశివరాయలు రాజ్యమునకు వచ్చెను. సదాశివదేవరాయల బావమరిది యకు రామరా జతని కమాత్యుఁడై యుండెను. తాళికోట యుద్ధములో 1565 లో రామరాజు మరణించెను. సేనాని వెంకటాద్రియు మడసెను. ఇక మిగిలినది నేనాని తిరుమలరావు ఒక్కడే. అతడు 150 కోట్ల రూపాయిలు, నవరత్నాభరణములు మొదలగు బహుధనముతో సదాశివరాయలను తోడ్కొని అనంతపురము వద్దనున్న పెనుకొండ దుర్గమునకు పారిపోయెను.

1568 వ సం॥మున సదాశివరాయలను చంపి తిరుమలరాయుడే రాజ్య మేలెను. కానీ అక్కడ నిలువలేక చంద్రగిరికి వచ్చి చేరెను.

ఈ కవి 1568 సం॥ తరువాత సదాశివదేవరాయల వరాలు ప్రచారములో నుండుకాలమున జీవించియుండెనని నిర్ధారణ చేయవచ్చును.

పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/5 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/6 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/7 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/8 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/9 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/10 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/11 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/12 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/13 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/14 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/15 పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/16