పుట:Yogasanamulu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

51


కూర్చొని ఒక పాదము మడమను తొడ యొక్క మూలమునందును, మరియొక పాదమును మడమను లింగ స్థానము మీదను ఉంచి పాదములు తొడకు పిక్కకు మధ్య ఉండునట్లు చేయునది. ఇందు శిరస్సు, మెడ, వెన్నుపూస తిన్నగా వుంచవలయును. ఇదియు ధ్యానమునకు ఉపకరించును.

పైన చెప్పబడిన 5 ఆసనములు ధ్యానము చేయుటకు ఉపయుక్తములని చెప్పగా మిగిలినవి శరీరము నందలి రోగములను నిర్మూలించుటకున్నూ, అంగములు బలపడుటకున్నూ ఉపయోగపడునవియై ఉన్నవి.