పుట:Yogasanamulu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28


ద్వారమయిన మూలాధారమున వుంచి సదా నిద్రించు చుండు నని యోగ శాస్త్రము చెప్పచున్నది. సుషుమ్న నాడి గుండ్రని పొరలు పొరలుగా వుండును. సుషమ్న యందు వజ్రనాడి యను ఒక నాడి వజ్ర నాడిలో చిత్ర నాడి యని మరొక నాడి, ఈ నాడి యందు అతి సూక్ష్మముగా లాలె పురుగు దారము కన్న సన్నని నాడి యున్నది. ఇదియే బ్రహ్మనాడి సామాన్యముగా సుషుమనే వజ్ర నాడి యనియు చిత్ర నాడి యని, బ్రహ్మనాడి యని అందురు. ఈ నాడి నుండి కుండలిని అని పిలువబడు మహా శక్తి మేల్కొని మూలాధారము నుండి దారిలో నున్న ఆ చక్రములను మధ్య ఓ వున్న మూడు గ్రంధులను చేధించుకొని సహాస్రారమున తక ప్రాణేశ్వరుడగు పరమేశ్వరుని చేరును. ఈ విషయమునే పురాణముల యందు త్రిపురాసుర సంహార మని చక్కని కథను వ్రాసిరి. ఈ మూడు పురములే బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి. సుషుమ్న నాది యందలి చిత్ర నాడి మృత్వును జయించ గల శక్తి గలది. కనుక ధ్యానమున చిత్తమును, చిత్ర నాడి యందు లయ పారచిన సకల రోగములు నివృత్తి యగుటయే గాక ఆయుర్యుద్ధి యగునని చెప్పబడినది.

ఇడ, పింగళ ను సూక్ష్మ నాడుల లునికిని తెలిసి కొందము. ఇడా నాడి ఎడమ వృషణము నందును, పింగళా నాడి కుడి వృషణము నందు ప్రారంభమై మూలాధారమున సుషుమ్నతో కలయుచు ఒక కేంద్రము నేర్పరచుచున్నది. ఈ కేంద్రమును ముక్త త్రివేణి అందురు. దీనికీ బ్రహ్మ గ్రంధి యని కూడ అందురు. మరియు ఈ మూడు నాడులు అనా