పుట:Yogasanamulu.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23


చేయు కార్యములను నిర్వర్తించును. శరీరమున వున్న ముఖ్యమయిన సుషుమ్న నాడి మెదడు నుండు వెన్నెముక మధ్య నున్న రంధ్రములో వ్రేలాడి వెన్నెముక చివరి భాగము వరకు వచ్చి యున్నది. ఈ వెన్నెముక పూసల వంటి 33 (ముప్పది మూడు) ఎముకలు ఒక దానిపై ఒకటి అమర్చబడి మెడ నుండి చివర వరకు ఒక గొట్టము వలె తిన్నని రంధ్రముగా ఏర్పడినది. ఈ రంధ్రముననే వెను బాము ప్రేలాడు చున్నది. ఈ వెను బాము మధ్యలో సూక్ష్మ నాడి యగు బ్రహ్మ నాడి వున్నది. మెదడు నుండి స్స్థూల శరీరములకు సంబంధించిన నాడులు వెను బాములోనికి వచ్చి ఇరు ప్రక్కల నుండి శరీర భాగముల లోనికి విస్థరించి ప్రసరించు చున్నది. కంద స్థానమని చెప్పబడిన సూక్ష్మ నాటి మందల కేంద్రము నుండి సూక్ష్మ నాడులు శరీర మంతటను వ్వాపించు చున్నవి. ఈ నాడులు సుషుమ్న నాడిని ఒక్కొక్క చోట కలిసి కేంద్రములు ఏర్పర్చు చున్నది. ఈ కేంద్రములే షట్చక్రములు. ఇటులనే స్థూల దేహమున నున్న నాడులు కూడ ఒకొక్కచోట కలియు చున్నవి. స్థూల శరీరమున ఏర్పడిన నాడీ కేంద్రములను ఆంఘ్ల వైద్య పరి భషలో " ప్లెక్స్ " అని పిలువబడు చున్నవి. ఈ స్థూల నాడి కేంద్రములకు, సూక్ష్మ నాడీ కేంద్రములకు సన్నిహితమైన సంబంధము కలిగి యున్నది. సూక్ష్మ శరీరమున వున్న ఈ నాడి కేంద్రములకు, సూక్ష్మ నాడీ కేంద్రములకు సన్నిహితమైన సంబంధము కలిగి యున్నది. సూక్ష్మ శ్రీరమున వున్న ఈ నాడీ కేంద్రములను మూలాధారము, స్వాధిస్థానము, మణి పూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్త్రారములని ఏడు కేంద్రములు చక్రములని పిలువ బడు చున్నవి. సూక్ష్మ నాడీ మండలమున జరుగు సర్వ వ్వాపారములు స్థూల శరీరముఇనకు సూక్ష్మ శరీర