పుట:Yogasanamulu.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20


తా|| పై నాడులలో (72000) డెబ్బది రెండు వేల నాడులు వాయు సంచారమునకు యోగ్యమయినవి. ఆ నాడులు వాయు మార్గమున పునరావృత్తి ప్రాపక కర్మ రూప చిద్ర విశిష్టంబి తిర్వగ్గతరంధ్ర ప్రధాన భూతంబుగా నుండును.

శ్లో|| దే హీధనున్యో ధన్యస్థా పంచేంద్రియ గుణావహా
నాభి కంద స్థితౌస్తాన్తు నాభీ చక్రే ప్రదేష్టితా||

తా|| శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధ, గ్రాహ్యకములగు పంచేంద్రియముల యందున్న నాడులు శ్రేష్ఠములు. ఆ ఐదు నాడులు మూలాధారము నాశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి యున్నది.

శ్లో|| ఆపాద ప్రభృతి గాశ్రమ శేల్ష మాసా
మాంస్తకాద పేచ ల్నాభి పుర స్థితేన
ఏ తస్శృ దంగ ఇవ చర్మచక్వ్ ఏవ బద్ధం
కాయం వృణా మిహ సిరా శత సప్తకేన||

తా: మూలాధారము నాశ్రయించి పాదము మొదలు శిరః పర్యంతము వ్వాపించిన (700) ఏడు వందల నాడులు మనుష్య దేహమున మృదంగము చర్మముచే కప్పబడి నట్లు బందించు చున్నవి.

శ్లో: ఇడా పింగళా చైవ సుషుమ్నాచ సరస్వతీ
వారుణీ చైవ పూషాచ హస్తి జిహ్వ య్శ స్వినీ
విశ్వాదరి కూహూచైవ శంఖిణీచ పయస్వినీ
అలంబుషా గాంధారీ ముఖ్యాశ్చై తాశ్చ కుర్థశా: