పుట:Yogasanamulu.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

195


విషయముల నుండివిడి వడును. నాధాను సంధానమున తగుల్కొనిన మనస్సు స్థిరమైన ధారణ పొందు చున్నది.

మనస్సు స్థిరమైనపుడు ప్రాణ వాయువు (శరీర మందలి చలన వ్యాపారము) స్థిరమైనది. ప్రాణము స్థిర మగుట చేత బిందువు స్థిర పడి శరీరమునకు బలము, తేజమును వృద్ధి చేయును. సాధనమున మనస్సు కేంద్రీకరించుట వలన నాదమున మనస్సు లయమందినదని తెలియ వలయును. మనస్సును లయము చేయుటకు శాంభవి యును ముద్ర చేత సాధ్యమగును. మనస్సును తక యిస్ట దైవమందు గాని నిర్గుణ బ్రహ్మ యందు గాని స్థిరము చేసిన వానికి కంటి రెప్పలు మూత పడవు. అట్టి స్థితి యందు తన ఎదుట నున్న ప్రపంచమును చూచుచున్నట్లు ఎదుటి వారికి తోచినను, సాధకుడు మాత్రము దృస్టితో దేనిని కూడ గ్రహింప జాలకున్నాడు. అనగా మనస్సును తనతో నున్న ఆత్మయందు లగ్నము చేసి కండ్లు విప్పియుంచియు కూడ దృష్టిని నిరుద్ద పరచుట. దీని వలన చిత్తము లయమందు చున్నది. లయ పరచుటకు ఉన్మనీయను మరియొక ముద్ర గలదు. పైన చెప్పి నట్లుగానె అంతర్లిక్ష్యము బహిదృష్టి అను సాధాముతో కూడు యున్నది. సగము తెరిచిన నేత్రములను అనగా వాయువును సుషుమ్నాగత మొనర్చి అనగా సూర్య చంద్ర నాడులను నిరోధించిన కేపల కుంభక స్థితిలో నున్నపుడు ప్రాణము సుమష్న యందు సంచరించు చున్నది. అపుడు మనస్సు తన యందు (తన ఆత్మయందు) లగ్నము చేసిన యెడల దానిని ఉన్మనీ ముద్రయని చెప్పబడు చున్నది. ప్రాణ