పుట:Yogasanamulu.djvu/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

లంక సూర్యనారయణ


సృష్టిలో ఉన్న సర్వ శక్ల్తులు వాయు శక్తి, విద్యుశ్చక్తి, అయస్కాంత శక్తి అన్నియు ప్రాణ శక్ల్తి యొక్క రూపాందరములగుట వలన ప్రాణ్శ శక్తిని వసము చేసుకొనుట వలన ప్రకృతి యందలి సర్వ శక్తులు వశమగుచున్నవి. ప్రపంచమున భౌతిక, రసాయనిక పద్ధతుల వలన ఆవిరి శక్తి, విద్యుశ్చక్తి, కాంతి శక్ల్తి, ఉష్ణ శక్తి, అణుశక్తి, వాయు శక్ల్తి, జల శక్తి, మొదలగు శక్తులను వశము చేసి కొనుట కూడ ఒక విధమయిన ప్రాణాజ్యామమని చెప్ప వచ్చును. శరీరమున ప్రాణమును వశపరచు కొనుట వలన మనస్సు వశమగుచున్నది. మనసు యొక్క వ్యాపారము సంకల్ప వికల్పములు; సామాన్య మానవుని శరీరమున మనస్సు పూర్తిగా విశ్రాంతి పొందినపుడు సుషుప్తి అనగా గాడ నిద్రలో నున్నట్లు గ్రహించ వలయును. శరీరము డస్సి విశ్రాంతిని కోరి నిదురించుటకు ప్రయత్నించగా మనో వ్యాపారములైన సంకల్ప వికల్పములు ఇంకను కొనసాగు చుండుట వల స్వప్నములు కలుగు చున్నవి. ఇది స్వప్నావస్థ. మనస్సు కూడ సంపూర్ణ విశ్రాంతి పొందినపుడు సుషుప్తి యనబడును. శరీరములోని ఇంద్రియము లన్నియు ప్రాణము శ్వాస కూడ ఉన్నప్పటికి మనస్సు విశ్రాంతి పొందినందున నిద్ర కల్గి శరీరము చేత ఈ ప్రపంచమును అనుభవింపచేయ లేదు.

సాధారణముగా ఉన్న సూర్య రస్మిని గాజు కటకము సహాయమున కేంద్రీకరింప గల్గిన యడల ఎక్కువ వెలుతురు, వేడియు కలుగునని భైతిక శాస్త్రమున తెలిసి కొంటి కదా. అటులనే మనస్సును కేంద్రీకరింప చేసిన యడల అమితమైన శక్తి