పుట:Yogasanamulu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

లంక సూర్యనారయణ


పొందును. కుండలిని సుషుమ్నను పొందుటకు మరికొన్ని యుక్తులు చెప్పబడినవి.

పరాధాన యుక్తి, పరీచాలన క్రియ చేయు పద్దతి.

సిద్దాసనమున కూర్చొని రెండు నాసికా రంధ్రముల చేతను కపాల భాతి చేయు విధముగా శ్వాస నిశ్వాసలు జరిపి నిండుగా పూరించి కుంభించిన తరువాత నాభికి యిరు ప్రక్కల యందును రెండు చేతుల బొటన వ్రేళ్ళను ఉంచి మిగిలిన నాలుగు వ్రేళ్ళతోను గట్టిగా కడుపును లోనికి నొక్కవలయును. అపుడు గడ్డమును రొమ్మునకు హత్తునట్లు ముందుకు వెనుకకు వంచ వలయును. ఇట్లు 1 : 4 : 2 నిష్పత్తిలో పూరక, కుంభక, రేచకములు కలుప వలయును. కుంభకములో ఉన్నపుడు మూల భంధములను చేయవలయును. రేచించు నపుడు ఉద్వాన బంధము చేయ వలయును.

శాంభవీ ముద్ర

మనస్సుయు, ప్రాణము ఒకదాని కొకటి మనుగడ చేయలేవు. మనసు లయమందిన ప్రాణము లయమగును. పరబ్రహ్మ యందు మనస్సును నియమించి, బాహ్య ప్రపంచమును చూచు నట్లు కనపడినను, బాహ్య విషయములను గ్రహించని స్థితిలో అనగా ఇంద్రియమును నిరోధించిన యడల, దానిని శాంభవీ ముద్ర యందురు. ఈ విధముగా శాంభవీ ముద్ర యందు మనస్సు లయమందు చున్నది. ఈ ముద్రలో మనసుకు అనాహత చక్రము (హృదయము) నందు మనస్సును నియమించ వలయును. అపుడు ప్రాణము హృదయమున లయమగును. సాధ