పుట:Yogasanamulu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

లంక సూర్యనారయణ


యగు శుక్రమును భద్ర పరచుటకు భారతీయ ఋషులచే ప్రసాదింప బడినది వజ్రోలి. దీనినే హిందిలో వతన్ మే రతన్ జతన్ కరో అని చెప్పి యున్నారు. ఈ శుక్రము యవ్వనముననే ఎక్కువగా ఉత్పత్తి యగు చుండును. ఆ కాలములో రత్నము వంటి దానిని దుర్వినియోగము కానీయ కుండా భద్ర పరచుకొనమని దాని అర్థము.

శరీరమందలి సూక్ష్మ నాడీ మండలములో ఇడ, పింగళ యను రెండు నాడులు ముక్కు రంధ్రముల నుండి వృషణముల వరకు ప్రసరించి యుండును. రెండు వృషణముల నుండి రెండు వాహికలు లింగమందు చేరును. ఇవియే సీవనీ నాడులు లేక శుక్ర వాహికలు. ఉద్రేకము కల్గుట చేత బహిష్కరింప బడుటకు సిద్ధముగా నున్న శుక్రము వాని చుట్టునున్న కండరములను బిగియ పట్టుట వలన బహిషృతము కాక తిరోగమించును. వజ్రోలి ముద్ర సాధనా పాటనము చేత శుక్రము బహిర్గతము కానీయకుండుటయు లింగము చేత దాని బయడ నున్న చిక్కని ద్రవములను లోనికి ఆకర్షించు కొనుటయు చేయ వచ్చును.

వజ్రోలి సాధన క్రమము

ప్రాతః కాలమున మల మూత్రములను విసర్జించిన తరువాత ఇరువది నాలుగు అంగుళముల పొడవుగల రబ్బరు లేక ప్రాస్టిక్ నాళమును తీసుకొని (ఇవి లేని కాలములో లోహపు గొట్టమును వాడండి) దానిని వేడి నీళ్ళ యందు కొంచెము సేపు వుంచి శుభ్రపరచి లింగము ద్వారమునుండి లింగమున ప్రవేశ పెట్టుము. మొదటి దినమున ఒక అంగుళము రెండవ దినమున రెండు అంగుళములు నిట్లు క్రమ క్రమముగా పది దిన