పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నొక బంగళా కట్టబడియున్నది. దిగువనుండి బంగళా వఱకు పాము మెలికలుగా నొక రోడ్డున్నది తఱుచుగా విశాఖపటట్టణమునుండి కొందఱు దొరలు వచ్చుచు బోవుచుందురు. సోపానపాశ్వన్ మందున్న బట్టేగుండా ప్రవహింపుచున్న యాకాశధారా నీరమాధారంగా కొండ గిరువనశ్రీ విజయనగ్తరపు మహారాజావారి బంగళా వెనుక గొప్పపుష్పవనమున్నది. జలయంత్రములవల్ల నుల్లసిల్లుచు నుల్లమునకు జల్లదనము వెదచల్లుచున్నది. ఈ క్షేత్రము విజయనగరము వారిది. ప్రృతమందుద్యోగస్థులయొక్క యేర్పాటువలన గుత్తలో నున్నందున పూర్వము కన్న నిప్పుడు పూజామర్యాదులు వగైరాలు నానాటికి దరగుచున్నట్టు జనులు ప్రశంసింపుచ్న్నవారు.

తాళ్లవలసనుండి శొంఠేము సత్రములో గాని పైగా గాని బస చేసికొని కొందఱీ సింహాచలమునకెంబదురు.

రోడ్డు రమ్యముగానే యున్నది. 27వ తేది విశాఖపట్టణములోనే నివసించితిమి.

28వ తేదీ గురు|| రాత్రికి 20 మైళ్ల దూరములో నున్న యనకాపల్లి బంగళాలో ప్రవేశించినారము, షొంఠేమునుండియు, విషాఖపట్టనము నుండీయు నిక్కడీకి రెండు రోడ్లున్నవి, యిదిగాక వడ్డాది మాడుగులకు బోవు రోడ్డును గలదు, యీ యనకాపల్లి గొప్ప గ్రామము,గొప్ప గొప్ప షాహుకార్లుగలరు. సప్త పురుషాంతములనుండి యాహితాగ్నులు గాని వేదులవరీయూరిలో లేరు. ఇచ్చటలేని కూరలు పయిని లేవనవచ్చును. రు.30000 ల రాబడిగల పంట భూమి గలదు. దీనికి బడమరగా శారదా నది యున్నది. పతంకుల దరఖాస్థు పైని వారి వల్ల కొంతధనము వసూలు చేసి తక్కిన లోటు పుతిన్ చేసి గవర్నమెంటువారు తంతీయాఫీసుంపించినారు. స్కూలు, చిన్న యాసుపత్రి, సత్రము కల