పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యాత్రాచరిత్ర మంచి పుష్కరిణియు- శ్రీకుక్కటేశ్వరాలయంబును గలవు. స్వామి లింగము పస్కటాకారంగా నున్నది. పాధనుప్రహారము గంగయు శిరస్సున గలవు. నిమ్నమైన లింగొపరిభాగము నుండి నీరు స్రవింపుచు ముక్కు గుండా కారుచుండును గనుక గంగ యున్నందుకిది నిదర్శనమని చెప్పుదురు అమ్మవారు శ్రీరజరాజేశ్వరి భోగరాగోత్సవాదులనుకూలముగానే జరుగుచున్నవి. యీగుడి యావరణంలోనే యీశాన్య భాగమందు శ్రీవిష్ణు పాదములున్నవి. యిచ్చటనే పిండప్రధానము గావించి పుష్కరిణిలో బడవైతురు. విష్ణు పాదము లీపుష్కరిణిలోనే యున్నదనియు దర్ప్రలిసులైన యీ పాదములయందుగాని, బసలో గాని పిండదాన మొనరించి పుష్కరిణిలో వైచు యాచారమని కొందఱనిరి- ప్రకృతమందు శ్రీ రాజాగారు కాలనానదిలో నున్నందున నావల 3వ తేది బుధ నాడు ప్రాతఃకాలమందీలాకు దాటి ధవళేశ్వములో సత్రములో దిగి గోదావరి స్నానాదులు గావించి భోజనానంతరమందు రెండవపూట స్టీంబోటు తెప్పించి దాని