పుట:Womeninthesmrtis026349mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాధ్యాయము

3

ఇట్టి పుత్రిక వలన తండ్రి వంశము వృద్ధియగును. ఈ విధముగ పూర్వ మనేకులు వంశాభివృద్ధిని చేసికొనిరి.

      అనేనతు విధానేనవురా చక్రేథపుత్రికా:

    (పూర్వము దక్షప్రజాపతి తన వంశాభివృద్ధి కొరకీ విధానముచే పుత్రికలను చేసెను; పదిమంది పుత్రికలను యమునకును, పదముగ్గురను కశ్యపునకును, నిరువదియేడ్గురను చంద్రునకును గౌరవించి యిచ్చెను.)

ఇట్టి పుత్రికకు కల్గిన పుత్రుడు తల్లికి ముందుగ పిండమును వేయును; పిమ్మత నామె తండ్రికి వేయును, మూడవా దాని నామె పితామహునకు వేయును. ఈయంశ మీ క్రింది శ్లోకములో చెప్పబడినది.

ఇట్టి దౌహిత్రుని గూర్చి ప్రసంగించుచు మనుస్మృతి యిట్లు చెప్పుచున్నది.

     పౌత్రదౌహిత్రయోర్లోకే విశేషోనోపపద్యతే
     దౌహిత్రోపిహ్యముత్త్రైవం సంతారయతిపౌత్రవత్
                                    (మను. 9- -39)