28
విజయనగర సామ్రాజ్యము
రము లాలోచింపఁబడును. యుద్ధ విషయములు మొదలగు
సంశముల నిందుఁ జర్చింతురు.
అతఁడింకను నాలోచించుకొను చునుండెను. ఇంతలో నొక మానవ విగ్రహము రంగస్థలమునకు, వచ్చెను. అతఁడు మనరామరాజునకు సలాముచేసెను. రామరాజు కను సన్న సేసి కుర్చీపై (గూరుచుండెను. ఆ నూతన విగ్రహమును గూర్చుండెను.
రామ: ఆదిల్ శాహా ! మఱి గోల్ కొండవార్త లేవియు వచ్చుట లేదేమి?
ఇది:-చిత్తము. రాకేమండి. ఎప్పటీవార్తలప్పుడే వచ్చుచున్నవి.
రామ:-విశేషము లేవేని గలవా ?
ఆది:-చిత్తము. సంతోషకరమైన వార్తలే గలవు.గోల్కొండ రాజ్యములో నంతఃకలహములు ప్రారంభమైనవి.
రామ:-ఏమి ! అంతఃకలహములా ! ఎట్లుసంభవించినవో తెలిసినదా?
ఆది: చి త్తము. సాంతముగాఁ జెప్పెదను. ఆ నవాబు మిక్కిలి పాపవృత్తిగలవాఁడని మీ రెఱుఁగుదురుగదా! అతనికి దారానాధుఁడను మంత్రికలఁడు. ఆయన పుత్త్రిక మిక్కిలి చక్కనిది. ఆమెను దనకిమ్మని నవాబు నిర్బంధించి నానా విధముల బాధించెను.