పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

విజయనగర సామ్రాజ్యము


కల్గినను మన సైన్యములు సర్వనాశము పొందకపూర్వ మది సిద్ధింపదు. కనుక మనము వారిని మోసము చేత నే జయింప వలయును. అప్పుడు మనపక్షము విశేషించి నష్టము కాదు.శత్రువులను నాశము చేయవచ్చును. శత్రువులను, కాఫరులను జంపునపు డిట్టి మోసములు చేయుట శాస్త్ర సమ్మతమే. దీనినే మన పెద్దలు 'పెక్కు యుద్ధములలో ననుష్ఠించి యున్నారు.


“ అవును. మీరన్న దెంతయు సత్యము. వారి శౌర్యమును, పరాక్రమమును వినుటమాత్రమే కాదు, కనియుంటిని. నారా జ్యములోని ఘాన్ పురము, పానగల్లు దుర్గములను స్వాధీనము చేసికొనునప్పుడు వారు చూపించిన సాహసము, పరాక్రమము వర్ణింప నలవి కాదు. తమరన్న దెంతయు సత్యము. పొరుయుద్ధ ముచేయుచున్నప్పుడా సామర్థ్యము,విజృంభణము చూడవలసి నదేగాని వర్ణింపరాదు. సరియైన యుద్ధమున మన సైనికులు వారికి రెండు రెట్లున్నను 'గెల్వఁజాలరు' అని గోల్కొండ నవాబు 'మెల్లగాఁ జెప్పెను.

సత్యమే. 'నే నెఱుంగుదును. అందలి కమ్మ సేనానుల పరాక్రమము చూచినను, వెలమవీరుల యత్యద్భుత సాహస ముంజూచినను, రెడ్డి యోధులశక్తి వీక్షించినను గుండెలు పగిలి పోవును' అని అహమ్మదనగరు నవాబు వాక్రుచ్చెను.

“ఏదే నొక వెఱవు యోజించి శత్రువులను వంచించుట నాకును సమ్మతమే. అందు కే మేని యుపాయముంజింతించి .