144
విజయనగర సామ్రాజ్యము
తరుణుల కది స్వాభావికము. భార్యా భర్తలకు నేకత్ర
సమావేశము చేసి పరిహసించుట సుందరీమణులకు సంతోష
ముగానుండును. అందీ యవనసుందరి హృదయము నిష్కా
పట్యమైనది.
అక్కా ! ప్రత్యుత్తరమియ వేమి ? ”
ప్రత్యుత్తర మేమున్నది ! మీ రేఱుఁగరా !”
ఆ చిత్రపటమెవరిది ? అది నీకిదివఱకే గోచరించియుం డును. అదిస్వభావము. అంతమాత్రము స్ఫురింపనివాని కేదియు స్ఫురింపదు. ఆ చిత్ర ఫలకమువంకఁ దిన్నగాఁ జూడుము. అందు విజయసింహుని లోకోత్తర మూర్తి కలదు.
“ నీ హృదయమును హరించిన సుందరుఁ డితఁడేనా ? '
ఆమె చీఱునగవుచే నంగీకారభావమును సూచించెను. మఱి యిట నెను.
'కాని అక్కా ! ఈ కోరిక యి జన్మమున లభించు " నది కాదు. అంత భాగ్యము నావంటి దురదృష్టురాలికి గల్గదు.'
'ఎందుచేత ! ఇది పరస్పరాను రాగముకాదా ! అతఁడు కూడ నిన్ను ప్రేమింప లేదా? చూడుము! ఈసమానరూపవయో విలాసములే మిమ్మిరువురను దంపతులనుగా, జేయఁదలఁచి దేవుఁడు సృష్టించెనని చెప్పక చెప్పుచున్నవి. అది తప్పె నేని యాసృష్టి రుచించునా :- అతఁడు కూడ నిన్ను ప్రేమించె నని వింటి నే?”