పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

విజయనగర సామ్రాజ్యము


యోధవరుల హృదయపీఠములు కంపించెను. తన్ముఖ ములయందుఁ బొడసూపిన రక్తకాంతి యాసభామండప కుడ్య జాలముల నెల్లను, కుంకమ రాగ సమేతములనుగాఁ జేసెను.

“ నేను తీసికొనిపోయెదను, నాకిండు. నేను దీసికొని పోయెదను, నాకిండు ' అని యౌవనులు ముందునకు దుమికిరి.