ఈ పుట అచ్చుదిద్దబడ్డది
108
విజయనగర సామ్రాజ్యము
యోధవరుల హృదయపీఠములు కంపించెను. తన్ముఖ
ములయందుఁ బొడసూపిన రక్తకాంతి యాసభామండప
కుడ్య జాలముల నెల్లను, కుంకమ రాగ సమేతములనుగాఁ
జేసెను.
“ నేను తీసికొనిపోయెదను, నాకిండు. నేను దీసికొని పోయెదను, నాకిండు ' అని యౌవనులు ముందునకు దుమికిరి.