పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62


చెను. ఆరోగము యొక్క దాడి మొదటి పర్యాయముదగుటచే జనులు భీతాత్ములైరి. సరియైన చికిత్సలు లేనందున అనేకులు చనిపోయిరి. అట్టి పరిస్థితులలో వేంకట రామా రెడ్డి గారు ప్లేగు వలన నిబ్బంది పడు వారిని విచారించుట తన పనికాదని తూష్ణీ భావము వహించిన వారుకారు. అట్టి లక్షణము వారిలో ఎన్నడుకు లేదు. తనకు సంబంధము లేని దైనను ఒక కార్యమ, ప్రజాహిత మైనట్టిదనియు, మానవాభ్యుదయ ముసకు అవసరమైనట్టి దనియు వారికి తోచిన. మీరందరి కన్న ముందుగానే జోక్యము కలిగించుకొనెడి వారు. ఈ ప్లేగు నలన బాధపడు జనులకు తమ యావచ్చక్తిని వినియోగించి సాయపడినారు. వీరి యీ సత్కార్యము కు ప్రభుత్వము వారు మెచ్చికొని 20 రూపాయల ఏలువగల పతక మును పసదనముగా ప్రసాదించిరి.

గ్బుర్గాలో నుద్యోగము చేయుచుండు కాలములోనే రెడ్డిగారి (మోహ తెమోం) జిల్లా పోలీసు అధి కారపదవి ఇది వరలో తాత్కా లికము గా (మున్ఛకంగా) నుండు నట్టిది 20 షహరేవర్ 1313 ఫసలీ నాడు స్టీముగా ముస్తఖల్ - పర్మనెంటు) చేయబడి నెలకు 200 రూపాయల జీతమును - రూపాయలు గుర్రము వ్యయమునకును అంగీకరింప బడెను.