పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43



“యాద్గీరు తాలూకా అమీను అయిన వేంకట రామారెడ్డిగారు చాల ఉత్తములను చతురు లును, చురుకుతనము కలవారును నై యున్నారు. ఉర్దూ, ఫార్చీ, తెలుగు భాషలలో పూర్తి పాండిత్యము కలవారు. అవసర పూర్తిగా మరాటీ, ఇంగ్లీషును వ్రాయను చదువను నేర్చినారు. యూగ్లీషులో హిందూముసల్మానులలో మతకలహ ములు చెల నేర్చి యుండెను. రాత్రిం బగళ్ళు ప్రయత్నము చేసి మంచి నేర్పుతో ఆకలహములను వీరు అణచి వేయుటయే కాక ఉభయ వర్గములలో సమాధానములు కుది రి0చిరి. లేకున్న ఉభయ వర్గములలో ఎల్లప్పటికిని తగవులు పెరుగుచు ఎన్నడో ఒక గొప్ప పోరాటము జరుగుచుండెడిది. ఒకరి నొకరు చావగొట్టుకొను చుండెడివారు. అట్టి పోరాటమును అణచి వేయుటలో జిల్లా అధికారులకు చాల కష్టములు సంభ వించుచుండెడివి."


వేంకట రామారెడ్డి గారు యాద్గీరులో 1300 ఫసలి షహరేవ ర్ నెల తుదివర కుండిరి. తాలూక్దారు యొక్క మెచ్చు కొనుటనుజూచన రెడ్డి గారిక మొహరిక్ చేతులలో లేరనియు, న్యాయ శాస్త్రములో గూడ ప్రవీణు లైననియు, స్వతంత్రము గాను సమర్థతతోను తమ ఉద్యోగ ధర్మమును నిర్వహించుటకు మొదలు పెట్టినారనియు విశదమగు చున్నది. యాద్గీరునుండి వీరు కల్వకుర్తి తాలూకాకు అనగా లింగుసూగూరు జిల్లా నుండి షుహబూబునగరము జిల్లాకు మార్చబడినారు.