పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40



రావుగారు యాద్గీరులోని తహసీలు కచ్చేరీలో కార్కూన్ ఉద్యోగము సంపాదించు కొనుటకై ఉమిద్వాగు (ప్రొబేషఃర్ ) గా పనిచేయు చుండిరి. గిరిరావు గారు తహసీల్దారు వద్ద న్యాయ శాశ్రముభ్యసించి వకీలు పరీక్షకు కూర్చుని మూడవదర్జావకాలతులో కడతేరి ప్రాక్టీసు చేయుటకై రాయచూరునకు వెళ్లిరి, వారు యాద్గీరులోనుండు కాలములో వేంకటరామా రెడ్డి గారి పరిచయము కలిగెను. నాటి నుండి సుమారు 45 ఏండ్ల కాలములో ఉభయులు తమ తమ జీవితములను వేరు వేరు శాఖలలో నడుపుచు నుండిరి. ఉబయులలో గాఢమగుమైత్రి యేర్పడి, అది రాజబహద్దరకు గిరిరావు గారి అవసాన కాలము వరకును అవిచ్ఛిన్నముగా దినదిన ప్రవర్ధమానముగా నుండుచు వచ్చెను.


యాద్గీరు తహసీలు కచ్చేరీలో కొందరు కార్కూను లుండిరి, అందొక కార్కూనుంకును వరదారావునకును ఏదో యొక విధముగా ప్రేమ సుబంధము లేర్పడినవి. దాని ఆధార ముచేత కార్కూను లంచములు అపరిమితముగా తినుచు ధనికుడయ్యెను. అది ఇతర కార్కూనులకు కన్నుకుట్టెను. యాద్గీరు లోని అరబ్బులు పహిరా జవానులుగా నుండిరి, కార్కసుల ప్రే రేపణముచే ఆయరబ్బు లొకనాటి రాత్రి దివిటీలతో తుపాకీ కాల్పులతో భయంకర కోలాహము చేయుచు ధనికు