పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39


కల్లుకుండలపై కాలము గడిపినారు. ఆ ముచ్చటలో కొరవల దాపరక స్థలాలన్నియు కని పెట్టినాడు. కొరవలకు చిన్నప్పటి నుండియు ఎంత కొట్టిసను “ఇల్ రీ” (నాకు తెలియను ) అనుపదమే నేర్చెడివారు. మొహరిక్ ద్బెలకన్నిటికి ఇల్ రీ జవాబే దొరి కెడిది. ఇప్పటి కొత్త పద్దతి చేత దాచిన సొమ్ములన్నియు గుర్తుపట్టినాడు. దొంగల కందరికిని శిక్ష యిప్పించినాడు.


వేంకట రామారెడ్డిగారు ముదిగల్లు నుండి 9 ఫర్యర్ధి 12 8 సలీనాడు రాయచూరు జిల్లాలోని యాద్ గీరు ఠానాకు మార్చబడినారు. యాగిర్ లో ఒకటిన్నర సంవత్సర కాలము అనగా 1 మెహర్ 1300 ఫసలీ వరకు ఉద్యోగము చేసినారు. యాద్గీలో అప్పుడు వరదారావు అను వారు తహ సీల్దారుగా పనిచేయుచుండిరి. ఈ వరదారావు గారు న్యాయ శాస్త్రము (ఖానూను,లో మంచి ప్రవీణులని పేరుగన్న వారు. తాలూకాలో ముఖ్యాధికారులు గాన రెడ్డిగారికిని, పరదారా పుగారికిని మంచి పరిచయ మేర్పడినది. పలుమారు ఈ తహ సీల్దారువద్ద రెడ్డిగారు న్యాయశాస్త్ర మభ్యసింప మొదలు పెట్టి నారు. కాని ఉభయులును ఉద్యోగులగుట చేత రెడ్డిగారి కంతగా అవకాశము దొరక లేదు. అదే కాలములో సుప్రసిద్ధ న్యాయ వాదులును తర్వాత హైదరాబాదు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులును (రుకున్ ) అయినట్టి రాజాబహద్దరు గిరి