214
నిజాంరాష్ట్రమందు మాజాతివారు జమీందారులుగను, కృషీవలులుగను, గ్రామోద్యో గులుగనుగలకు. స్వయం కృషి వలన వ్యవసాయ సాయమున ప్రతివిథమగు ధాన్యము పండించి జంతువులకు - పక్షులకు వేయేల ప్రతిజీవ వస్తువుల కాహారమి డుటయే వారి కర్త ఎ్యము. వారివలన ఫలింపబడిన ప్రత్తి వలననే మీజాతి వారు మానవులకు మాసము కాపాడు కొనుటకు వస్త్రముల నిచ్చుచున్నారు. మొత్తముపై వీరి సంబంధములు నమ్మిళితములు..
మీజాతి వారి ఆర్థిక స్థితి నానాటికి హేయమగుచున్నది. దీని వలననే జాతివృత్తి నిర్వహణము దుర్భర మగుచున్నది. వీరిని యీ బాగనుండి తప్పించుటకు ధనికులు వీరికి ధనసహా యము కావించి తిరిగి ప్రాచీన వృత్తికా గౌరవము కలిగించు టత్యవసరమ'. దీనికై యైక్యత, సంఘీ భానము, సహకారము కలిగియుఁడ వలయును దీనితో విదేశములందు తయారగు యంత్రముల సాయము బడయు నంతవరకు వీరికి మోక్షము లేదు.
ఇంతమాత్రముననే మీజాతీ యందలి విద్యావంతులు ప్రభుత్వ శాఖ సేవయందు చేరవలదని గాని, లేక లాభదాయకమగు మరొక వృతి, యవలంబింప గూడదని గాని నా యభిప్రాయముగాదు. మీప్రాచీన జాతీయవృత్తినే తగురీతిగా అభివృద్ధి