128
హెచ్చింపు చేయచు వచ్చిరి. ఇట్లుండ సర్. ట్రెంచిగారు అప్పుడు తాలూకుదారు పదవిలోనుండిన నవాబ్ రహమత్ యార్జంగుగారిని గొత్యాలుగా నియమింప అభిలాషకలవారై యుండిరి. వారిని నియామకము చేయుటకును ఆజ్ఞలుపొందిరి కాని మరి రెండేండ్లు వారు అనుభవము పొందవలెననియు ఇట్లెన్నియో గౌరణాలనుబట్టి రహమతుయార్జంగుగారికి కొత్వాలు పదవి దొరకక పోయెను. దీనికి ముఖ్య కారణము శ్రీ ప్రభు వుగారికి రెడ్డి గారి పై ననే అభిమానము మొడుగా నుండుటయే. తుదకు రెడ్డిగారు "కొత్వాలీ పదవినుండి విరమింప వలసినప్పుడు శ్రీ ప్రభువు గారు వారితో “నీకంతకంటే గొప్ప పదవి నిత్తునులే" యని సెలవిచ్చిరట. మరునాడు రెడ్డిగారు తమయేలిక వద్దకు వెళ్లి నజరానా (కానుక) అర్పించుకొనినారు. ఎందుకని విచారించగా "నాకు తలపై నుండి మహాభారము వదలిపోయినది. ఆ సంతోషముతో నజరానా చెల్లించు కొనుచున్నాను" అని మనవి చేసికొనినారు. “నిన్ను వదలుటలేదు. అంతకంటే ఎక్కువ భారము మోపుచున్నాను" అని వారిని తమ సర్ఫెఖాసు మండలమునకు స్పెషల్ అధికారిగా నియమించిరి. వారి కన్న పై అధికారులున్నను వారికి నేరుగా శ్రీ ప్రభువుగారి తోనే సంబంధముండుననియు శాసించినారు. 13 వివిధ శాఖలపై వారిని ముల్యాధి కారిగా నిర్ణయించిరి. ఇతరులకు ప్రత్యేక