127
యిచ్చినారు. వీరి శిక్షణకై చాల శ్రద్ద వహించినందు చేతనే రెడ్డి ట్రూపు వారు వివిధ సంఘముల పోటీపరీక్షలో ఉత్తమ ములుగా నిర్ణయింపబడి లెక్కలేనన్ని బహుమానములు పొందినారు.“స్కౌటు రాలీ"లో రెడ్డిగారే ముఖ్యశ్రద్ధ వహించినట్టి వారు. వీరి యీ సేవనుగుర్తించి స్కౌటుసంఘమున కొన్ని సంవత్సరములకు పూర్వము ఛాడర్ ఘాట్ హైస్కూలులో గొప్ప సభచేసి వీరికి గౌరవ పతక మర్పించి మంచి సమ్మానము గావించినారు. అనేక స్కాటు సభలలో ప్రస్తుత ప్రధానా మాత్యులగు రై. ఆ. సర్ అక్బర్ హైదరీ గారు రెడ్డిగారి స్కౌటు సేవను బహు విధముల ప్రశంసించియున్నారు.
ఈ విధముగా రెడ్డి గారు నిరంతరముకు కృషి చేసి ప్రభుత్వము నకు అపారమైన సేవ చేసినారు. పై విధులలోనే కాక ఇట్టి మరియితర ముఖ్య సందర్భము లందును సంఘాధ్యక్షులు గానో సభ్యులుగానో పని చేసి తమ దేశ సేవానురక్తిని వెల్లడించినారు.
రా. బ• వేంకట రామా రెడ్డి గారు 26 అమర్గాదు 1343 ఫసలినాడు కొత్వాలీ పదవినుండి ఉపశార వేతనమంది విశ్రాంతినొందినారు. కాని మరునాడే వారియేలిక వారికిం కొక పదవినిచ్చిరి. కొత్వాలీ పదవిలో వీరుండినప్పుడు సుమారు 13 సంవతములవరకు ఉద్యోగకాలమును